ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. వ్యాసభగవానుడిని మానవాళి మెుత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిడి వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు. అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని పెద్దలు చెబుతున్నారు.
జ్యేష్ఠ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి, పాపాలను నాశనం చేయడానికి, జీవితంలో ఆనందం, శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా.. 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు. ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి. యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస న...