Skip to main content

Posts

First paashuram in Thiruppavai with meaning in English

  First pAsuram. Praising time, cow-herd girls and emperumAn, who is both the means and the end result, ANdAL resolves that she will observe   mArgazhi nOnbu   (a fasting or religious penance observed in the thamizh month of   mArgazhi ) so that she could have   krishNAnubhavam   (enjoying krishNa). mArgazhith thingaL madhi niRaindha nannALAl   nIrAdap pOdhuvIr pOdhuminO nErizhaiyIr sIr malgum AyppAdich chelvach chiRumIrgAL   kUrvEl kodum thozhilan nandhagOpan kumaran Er Arndha kaNNi yasOdhai  iLam singam   kAr mEnich chengaN kadhir madhiyam pOl mugaththAn nArAyaNanE namakkE paRai tharuvAn   pArOr pugazhap padindhu ElOr embAvAy Oh young girls in thiruvAyppAdi (SrI gOkulam) who have the wealth of  krishNa kainkaryam  (service to krishNa)! Oh those who are wearing great ornaments! It is an auspicious day on this full moon day of  mArgazhi . kaNNan is the obedient son of nandhagOpar, who has a sharp spear which will dest...
Recent posts

సఫల ఏకాదశి తేదీ 15-12-2025 సోమవారం

  ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి (Ekadashi Tithi)ని సఫల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన ఏకాదశి తిథి వేళ శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ  రోజున ఆచరించే వ్రతాన్ని చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకునే వాళ్లు ఈ సఫల  ఏకాదశి తిథి  రోజున చేసే పరిహారాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి  శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం . ప్రారంభం, పాటించాల్సిన పరిహారాలు వంటి విషయాలను తెలుసుకుందాం.. సఫల ఏకాదశి 2025 తిథి ఈ ఏడాది పవిత్రమైన సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 14వ తేదీ రాత్రి 8.46 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ రాత్రి 10.09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 15వ తేదీన సఫల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 16వ తేదీన ఉపవాసం విరమించాలి (Saphala Ekadashi 2025 Parana Time). ఎందుకంటే ఈరోజు ద్వాదశితో కూడిన ఏకాదశి. ఏకాదశి లేదా ద్వాదశి తిథి ఉండే రోజున ఏకాదశి ఉపవాసం చేయవచ్చు.  కానీ దశమి తిథితో కూడిన ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం ప...

తిరుమంగయి ఆళ్వార్ తిరు నక్షత్రం తేదీ 4-12-2025 గురువారం

  తిరుమంగై అల్వార్ ను తిరుమంగై మన్నన్ అని కూడా పిలుస్తారు.  దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో చివరివాడు . అతను హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా గుర్తింపు పొందాడు. అతను పద్యాల కూర్పులో అత్యంత ఉన్నతమైన అళ్వార్లలో ఒకనిగా పరిగణించబడ్డాడు.  అతనికి పరకాలయోగి అని కూడా పిలుస్తారు. జీవిత విశేషాలు అతను కలియుగ ప్రారంభంలో 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక (కార్తిక) మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందు జన్మించాడు. అతనికి తన తండ్రి ""నీలనిఱైత్తర్" అని నామకరణం చేసాడు. అతను పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొన్నాడు. అందుకు అతను శ్రీవైష్ణవ ఆరాధనను నిర్వహించుచూ పూజా ద్రవ్యములకై దొంగతనము చేసేవాడు. అతనిని పరీక్షింపదలచి పెండ్లి కుమారుని వేషములో వచ్చిన శ్రీమహావిష్ణువుని కూడా దోచి స్వామి పాదస్పర్శచే జ్ఞానోదయము పొందెను. అతను "నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి. అతను తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారము చేయుచు పెరు...

what is Dhanurmaasam ?

 Dhanurmasam is a significant period in South India states, spanning from December 16th to January 14th. It is a sacred time for Hindus, especially Vaishnavites, and holds immense importance in South Indian states due to the following reasons: 1. *Spiritual Significance*: Dhanurmasam is dedicated to Lord Vishnu and is considered an auspicious time for spiritual growth, meditation, and prayer. 2. *Festivals and Celebrations*: This period sees various festivals like Vaikunta Ekadashi, Koodaravalli, and Bhogi Pongal, which are deeply rooted in South Indian culture and tradition. 3. *Pongal Celebrations*: Dhanurmasam culminates in the harvest festival of Pongal, which is a four-day celebration honoring the Sun God and the bounty of nature. 4. *Cultural Events*: During Dhanurmasam, many cultural events, such as classical music concerts, dance recitals, and religious discourses, take place in temples and cultural centers across South Indian states. 5. *Charitable Activities*: This period...

పిండ ప్రధాన ఆబ్దికం పూజ సామగ్రి వివరాలు

    నల్లని నువ్వులు ౫౦ గ్రాములు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం 5౦ గ్రాములు, గంధం 20 గ్రాములు,బియ్యం పిండి 1/2 కిలో,  అరటి పండ్లు 6 ,తెల్లని దోవతి  వస్త్రం,   తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం,  స్వయం పాకం (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.

ఉత్పన్న ఏకాదశి తేదీ 15-11-2025 శనివారం

  ఈ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. హిందువులు ఈ ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. ఈరోజునే దుర్గాదేవి ముర అనే రాక్షసుడుని సంహరించి ఏకాదశి మాతగా పిలువబడింది. ఈరోజున శ్రీమహావిష్ణువుతోపాటు తులసి దేవిని పూజిస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల మీ యెుక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి. ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 15 నవంబర్ 2025న రాత్రి 12:49కి ప్రారంభమై..నవంబర్ 16న రాత్రి 2:37కి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకోనున్నారు. ఉత్పన్న ఏకాదశి నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండబోతుంది. దీంతోపాటు విష్కుంభ యోగం కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ఏకాదశికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. పైగా ఇదే రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:27 వరకు ఉంటుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పాటిస్తారు. దీని వల్ల మీ జీవితంలో శాంతిపాటు ఆనందం కూడా ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణువుకు పసుప...

దేవాలయాలలో పవిత్ర ఉచ్చవాలు విధి విధానాలు

    పవిత్రోత్సవం అనేది   పవిత్ర   (పవిత్ర),   ఉత్సవ   (పండుగ) అనే రెండు పదాల కలయిక నుండి ఉద్భవించింది. ఈ ఉత్సవం పశ్చాత్తాపకరమైనది, ప్రాయశ్చిత్తకరమైనది. దీని ప్రధాన లక్ష్యం ఏడాది పొడవునా వివిధ ఆచారాల నిర్వహణలో లోపాలు, అంటూ ముట్టు లు పాటించక దేవాలయాలకు వచ్చిన  కారణంగా సంభవించే చెడును వదిలించుకోవడం. ఈ పండుగను   దోష నివారణ   (తప్పు దిద్దుబాటు),   సర్వ యజ్ఞ ఫలప్రద   (ఏడాది పొడవునా వ్రతాల పవిత్రతను సమానం చేసే ఒక ఆచారం),   సర్వ దోషోపమానం   (అన్ని దోషాలను తొలగించడం),   సర్వ తుష్టికార ,   సర్వకామప్రద ,   సర్వలోకసంతిద   అని కూడా పిలుస్తారు. పవిత్ర గ్రంథాల ప్రస్తావన పవిత్రం చెడు నుండి రక్షిస్తుందని జయఖ్య సంహిత వివరిస్తుంది. విష్ణువు ఆరాధన సమయంలో ఆచారాలలో అంతర్భాగంగా  పవిత్ర ఆరోపణ  (దేవతను  పవిత్ర  దారంతో అలంకరించడం - పవిత్రమైన దారపు దండలు)ను పురాణాలు సూచిస్తున్నాయి.  అగ్ని పురాణం  ప్రకారం, ఆషాఢ మాసం ప్రారంభంలో లేదా కృత్తిక చివరిలో చాంద్రమాన పక్షం మొదటి రోజును పవిత్రోత్సవాలు నిర్వహించడ...

లక్ష్మీ గణపతి హోమం పూజ సామగ్రి వివరాలు

             // శ్రీ రామ //  పసుపు 2 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 4  కిలోలు, కనుములు 2, చీర 1, పెద్ద అంచు గల  దోవతి 1  ,  గరిక కొంచెం  దారం బంతి 1  పూల దండలు  2 , విడిపూలు   అర్ధ కిలో,  కమలం పూలు,2   పంచామృతం కొంచెం,  గణపతి హోమానికి కుడుములు 108, (చిన్న సైజ్ లో ) హోమం సమీధలు 10 చిన్న కట్టలు, ఆవు నెయ్యి 1650 గ్రాములు,  హోమం పౌడర్ పాకెట్,  ఆగరబతి పాకెట్   ముద్ద కర్పూరం పాకెట్   హోమం నెయ్యి వేయటానికి మట్టి గిన్నె  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 3 ,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ , హోమం కుండం  లేదా  ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 100  , వక్కలు 35, ఖర్జూరం పండ్లు పాకెట్,  పూర్ణాహుతి పాకెట్ 1   బ్రాహ్మణ  స్వయం  పాకం, దోవతి  మరియు  దక్షిణ 

మనవాళ మహాముని చరిత్ర

మామునిగళ్ తిరునక్షత్ర మహోత్సవమును ఆళ్వార్ తిరునగరి, శ్రీరంగము, కాంచీపురమ్, శ్రీవిల్లిపుత్తూర్, తిరువహింద్రపురము, వానమామలై, తిరునారయణపురము మొదలగు చాలా దివ్యదేశములలో గొప్పగా చేస్తారు. మనమూ కూడా శ్రీ రంగనాతనులకు ప్రియమైన ఆచార్యులు మరియు మనకునూ ఆచార్యులైన వీరి ఉత్సవములో శుద్దమైన మనసుతో సేవించుదాము. శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్ యతీన్ద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్ తాత్పర్యము : శ్రీశైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్దిచెందిన ‘తిరువాయ్ మొజి పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ గణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళచరణ పంకేరుహములందు అత్యన్త ప్రవణులై, తదేకాన్తికాత్యన్తిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యునివలె వారికి అనన్యార్హ శిశ్యభూతులైయుండు శ్రీ అజగియ మణవాళమహామునులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును త్రికరణశుద్దిగా నమస్కరించుచు సేవించుచున్నాను

పంచాయుద స్తోత్రం మరియు ప్రతి పదార్థ తాత్పర్యం

  స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్ | సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే || ప్రతిపదార్థము సహస్రార   =     వేయి అరలు (ఆకులు) అనెడు శిఖా   =     జ్వాలలతో (శిఖలతో) అతి తీవ్రం   =     మిక్కిలి తీవ్రంగా స్ఫురత్   =     ప్రకాశిస్తుండే భాస్కరకోటి   =     కోటి సూర్యుల కాంతితో తుల్యం   =     సమానముగా వెలుగుతున్న సురద్విషాం   =     (దేవతలకు విరోధులైన) అసురుల యొక్క ప్రాణ   =     ప్రాణములను వినాశి   =     నశింపజేయు విష్ణోః   =     శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం   =     సుదర్శనం అను పేరు కల్గిన చక్రం   =     చక్రాయుధమును అహం   =     నేను సదా   = ...