Skip to main content

Posts

Deepavali festival date 20-10-2025 Monday

  Lakshmi Puja Timings for Diwali 2025: Date: Monday, October 20, 2025 Lakshmi Puja Muhurta:  7:36 PM to 9:00 PM  Duration: 1 hour 24 minutes Pradosh Kaal: 6:24 PM to 9:00 PM  Pradosh Kaal in Hinduism is the  twilight period . The twilight period on the 13 th day during the waxing and waning phase of moon (Shukla Paksha and Krishna Paksha) is the Pradosham period. Golden rule is that Trayodashi tithi should be present during twilight period. Auspicious Time for Worship : The twilight period is considered a powerful time for connecting with divine energies. హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి తిథి 2025లో  అక్టోబర్ 18 న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలి . మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం గా ఉంటారని చెబుతారు.  యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా ...
Recent posts

దేవాలయాలలో పవిత్రోత్సవాలు

  పవిత్రోత్సవం అనేది   పవిత్ర   (పవిత్ర),   ఉత్సవ   (పండుగ) అనే రెండు పదాల కలయిక నుండి ఉద్భవించింది. ఈ ఉత్సవం పశ్చాత్తాపకరమైనది, ప్రాయశ్చిత్తకరమైనది. దీని ప్రధాన లక్ష్యం ఏడాది పొడవునా వివిధ ఆచారాల నిర్వహణలో లోపాలు, అంటూ ముట్టు లు పాటించక దేవాలయాలకు వచ్చిన  కారణంగా సంభవించే చెడును వదిలించుకోవడం. ఈ పండుగను   దోష నివారణ   (తప్పు దిద్దుబాటు),   సర్వ యజ్ఞ ఫలప్రద   (ఏడాది పొడవునా వ్రతాల పవిత్రతను సమానం చేసే ఒక ఆచారం),   సర్వ దోషోపమానం   (అన్ని దోషాలను తొలగించడం),   సర్వ తుష్టికార ,   సర్వకామప్రద ,   సర్వలోకసంతిద   అని కూడా పిలుస్తారు. పవిత్ర గ్రంథాల ప్రస్తావన పవిత్రం చెడు నుండి రక్షిస్తుందని జయఖ్య సంహిత వివరిస్తుంది. విష్ణువు ఆరాధన సమయంలో ఆచారాలలో అంతర్భాగంగా  పవిత్ర ఆరోపణ  (దేవతను  పవిత్ర  దారంతో అలంకరించడం - పవిత్రమైన దారపు దండలు)ను పురాణాలు సూచిస్తున్నాయి.  అగ్ని పురాణం  ప్రకారం, ఆషాఢ మాసం ప్రారంభంలో లేదా కృత్తిక చివరిలో చాంద్రమాన పక్షం మొదటి రోజును పవిత్రోత్సవాలు నిర్వహించడానికి ఎ...

మహార్నవమి విశేషాలు

  నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం కూడా ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మహార్నవమి రోజున  అమ్మవారికి పిండివంటలతో పాటు చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు . మహానవమి చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియజేయబడినది. ప్రధానపూజ నవమి రోజే చేయాలి. నవమి పూజ చేసిన వారే దశమి రోజు పున: పూజ చేస్తారు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.  వివిద రకాల పిండి వంటలు, చెరుకు గడలు  అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుం...

అన్నం వలన ప్రాణి కోటి

  *అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః* *యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః* అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి.  మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

 మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య  (21-9-2025) వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు.

తర్పణం గురించిన విశేషాలు

  *తర్పణం!*                    ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....! తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. *1.) తర్పణం అంటే ఏమిటి? పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు. *2. ) తర్పణము ఎన్నిరకాలు ? తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు. *ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు. 1-గరుడ తర్పణం : - ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు. 2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : - నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి. 3-పర్హెణి తర్పణం : - యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు. 4-సాధారణ తర్పణం : - అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణ...

ఇందిరా ఏకాదశి తేదీ 17-9-2025 బుధవారం

  ఇందిరా ఏకాదశి అనేది  భాద్రపద మాసం  కృష్ణ పక్షంలో వచ్చే ఎంతో పవిత్రమైన, విశేషమైన ఏకాదశి . సాధారణంగా ఇది  పితృ పక్షంలో వస్తుంది  కాబట్టి పితృ దేవతలకు, పూర్వీకులకు అంకితం చేయబడిన ఏకాదశిగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం,  ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల  పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని, అలాగే వారికి మోక్షం లభిస్తుందని పురాణోక్తి. అలాగే.. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం. అంతే కాకుండా పితృ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయి. ముఖ్యంగా  ఏకాదశి వ్రతం  ఆచరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. పితృ దోష నివారణకు ఆచరించాల్సిన పరిహారాలు ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులకు సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజున పూర్వీకులకు తర్పణం వదలడం చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వులు నీటిలో కలిపి దక్షిణ ముఖ...

దేవాలయాలలో భక్తులు పాటించవలసిన నియమాలు

    ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పెద్ద పెద్దగా మాట్లాడకూడదు. లౌకిక విషయాలపై ప్రసంగాలు చేయకూడదు. పక్క వ్యక్తుల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈమధ్యకాలంలో గుడిలోకి వెళ్లాక సెల్‌ఫోన్లలో మాట్లాడటం అలవాటుగా మారింది. ఇలా చేయడం ముమ్మాటికీ పాపమేనని అంటున్నారు పెద్దలు. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా రజోగుణసంపన్నమైన విషయాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించకూడదు. ప్రతీ ఆలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వస్త్రధారణ కూడా ముఖ్యమైనదే. ఆలయ నియమానుసారమే వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. శౌచం లేకుండా, స్నానాదులు చేయకుండా, బొట్టు లేకుండా గుడకి వెళ్లరాదు. గుడికి వెళ్లేసమయంతో తమతో పాటు కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్లాలి. స్వామివారికి నైవేధ్యం సమర్పించాలి. ఇక ప్రదక్షిణ చేసే విధానం కూడా ముఖ్యమే. గబగబా పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మూలమూర్తిని దర్శించుకోరాదు. అంతేకాదు, ముఖమంటపంలో గోడలకు ఆనుకొని కూర్చోవడం, కాళ్లు జాపుకొని కూర్చోకూడదు. స్వామివారి సన్నిధానంలో ఉండాలని బలంగా కోరుకునే భక్తులు... దేహాన్ని విడిచిన తరువాత ఆలయంలో ఇటుకలు, స్తంభాల రూపంల...

పరివర్తిని ఏకాదశి తేదీ 3-9-2025 బుధవారం

   ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో ఏర్పడే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి, వామన ఏకాదశి అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  03 సెప్టెంబర్ 2025  బుధవారం రోజున పరివర్తిని ఏకాదశి వచ్చింది.   పరివర్తన ఏకాదశి పూజా విధానం మిగతా ఏకాదశుల మాదిరిగానే, పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై, పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీలక్ష్మీ నారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేమంతులతో నారాయణుని పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి. పూజా చేసేవారు రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి. సాయంత్రం పూజ ఏకాదశి రోజు సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.

శుక్రవారం నాడు వచ్చిన అమావాస్య రోజు చెయ్యాల్సిన విధి - యోగక్షేమ౦

  పిప్పళ్ళు, ఎండు మిరపకాయలు, బొరుగులు, గులాబీ పువ్వులు, మిరియాలు, చెంగల్వకోష్టు,గుగ్గిలం ,మహిసాక్షి, సాంబ్రాణి ,మరియు ఇతర విశేష మూలికలతో కలిపినా పొడితో దూపం వెయ్యండి .దూపం వేసాక " ఓం ఐ౦ హ్రీం శ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్ని రకాల దృష్టులు, దోషాలు హరించబడి మీరు అనుకునే కార్యాలు త్వరగా దిగ్విజయమవుతాయి.