Skip to main content

Posts

పాపంకుశ ఏకాదశి తేదీ 13-10-2024 ఆదివారం

  ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు పాపాంకుశ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజు విష్ణువు ఆరాధనకు అంకితమైనదిగా పరిగణిస్తారు. పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు, 100 సూర్య యాగాలకు సమానమైన శుభ ఫలితాలు పొందుతారు.  పాపంకుశ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మూడు తరాల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాస దీక్ష ఆచరించనాడు యమలోక చిత్రహింసలు భరించాల్సిన అవసరం లేదు. ఈ ఉపవాసం ఆచరించే వాళ్ళు నేలపై పడుకోవాలి. ఎవరికి చెడు చేయకూడదు. మనసులోనూ చెడు తలంపులు రాకూడదు. రాత్రిపూట మేల్కొని ఉండాలి. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు  తేనె  సమర్పించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
Recent posts

దసరా నాడు జమ్మి చెట్టు మహిమ

  హిందువులు ఈ  చెట్టును  విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ  చెట్టు  యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది. అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారు. పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారు.  దసరా రోజున తెలంగాణ ప్రజలు తొలుత పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూసేందుకు ప్రజలంతా కలిసి ఊరి బయటకు వెళతారు.. అనంతరం ఊరంతా ఒకచోట చేరి జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నారు. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచ

సంతాన లక్ష్మీ అవతారం తేదీ 7-10-2024 సోమవారం

సంతాన లక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల సంతానానికి సంబంధించిన అగ్రహ దోష బాధలతో బాధపడుతున్న భక్తులకు విముక్తి లభిస్తుందని చతుర్భుజాలతో దర్శనమిస్తున్న అమ్మవారు రెండు చేతుల్లో పద్మాలను మరో రెండు చేతులతో వరద అభయ హస్తాలతో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నట్లు జ్యోతిష్య  మరియు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. 

దుర్గా పూజ & హోమం పూజ సామగ్రి

 పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం డబ్బా చిన్నది 1, బియ్యం 3 కిలోలు, తమల పాకులు 100 నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పండ్లు 1 పాకెట్,  టెంకాయలు 5, \ కలశం 2,  దుర్గా ఫోటో 1, కంకణ దారం బంతి 1  పంచామృతం (పాలు,పెరుగు, తేనె, చక్కెర, ఆవు నెయ్యి 100 గ్రాములు ) అయిదు రకాల పండ్లు  పూల దండలు, విడి  పూలు, కిలో  చీర, జాకెట్టు peaces , గాజులు, కాటుక, బొట్టు బిళ్ళలు , దువ్వెన, అద్దం 1, సాంబ్రాణి ఆగరబతి పాకెట్, కర్పూరం, 1 పెద్ద పాకెట్,  నివేద్యం కిలో,  హోమం సామగ్రి,  పుల్లలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో, మట్టి గిన్నె 1, పూర్ణాహుతి సామగ్రి పాకెట్, 1, హోమం పొడి 1/2 కిలో పాకెట్,  రూపాయి బిళ్ళలు 25,  ఆవు పంచితం 100 ml ,  సెంట్ బాటిల్, 1,  మామిడి కొమ్మలు 2,  హోమం గుండం readymade  ఎర్రని వస్త్రం 1 మీటర్,  కుమారి పూజ సామగ్రి  పూజారి దక్షిణ (ఫీజు) 8,000/-

దుర్గాఅష్టమి ప్రాముఖ్యాత

 దేవి శరన్నవరాత్రి.  ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. మహిషాసురుని మీదకు అమ్మవారు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితోనే పూర్వం రాజులు శత్రు రాజ్యాలపై దండయాత్రకు ఈ సమయాన్ని శుభ ముహూర్తంగా ఎంచుకున్నట్టు పురాణాల్లో పేర్కొన్నారు. ‘లోహుడు’ అనే రాక్షసుని దుర్గాదేవి సంహరిస్తే లోహం పుట్టిందని, కాబట్టే లోహాలతో తయారుచేసిన పరికరాలని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని బలంగా నమ్ముతారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయ్యింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపజేసేది", అని అర్థం. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు పటాపంచలవుతాయి. కాబట్టి, మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ ఆరాధనతో సిరిసంపదలు, చివరి మ

GAJA LAXMI AVATAR ON 6-10-2024 SUNDAY

  Goddess Lakshmi, the consort of Lord Vishnu assumed several forms to satisfy the necessities of humanity. Each Avatar symbolizes some kind of wealth and her manifestation as Gaja Lakshmi is revered as the giver of Animal Wealth. Goddess Gaja Lakshmi is of deep relevance to those who earn their living and food by rearing cattle. In the form of ‘Gaja’ which means elephants, the Goddess signifies royalty and power. Since Gaja Lakshmi Devi provides both abundance and prosperity, many place an image of her in their houses. Her Avatar as Gaja Lakshmi satisfies the needs of those who are dependent on rearing livestock to make ends meet. Mythology of Gaja Lakshmi Gajendra, the elephant and  Goddess Lakshmi  were always engrossed in offering prayers to Lord Vishnu together. Because of his girth, the elephant was a little slow and could not perform the Ceremonies as fast as Lakshmi.  Lord Vishnu  then requested Lakshmi to join him so that Gajendra could offer prayers to both of them together.

dhaanyalaxmi avataar on 4-10-2024 Friday

  Unique traits of Dhanya Lakshmi The Goddess is generally portrayed, attired in green garments, symbolizing the greenery of agricultural land which results in a rich harvest. Green is also associated with growth, renewal and resurgence, which replenishes the land with fresh new resources. Goddess Dhanya Lakshmi is depicted as an eight armed Goddess, wielding various agricultural products in three of her hands, two of her hands are shown holding lotuses, and one wields a mace. Her other two hands are in Abhaya Mudra and Varadh Mudra which signify her objective of providing grains and charity for the poor and hungry. Incarnations of Dhanya Lakshmi Goddess Lakshmi has assumed several forms to satisfy the needs of living beings. Each form is unique and created with the intent of fulfilling a specific purpose for the benefit of humanity. Her Avatar as Dhanya Lakshmi satisfies the need of ensuring a bountiful harvest and providing nourishment to the hungry.

ఇందిరా ఏకాదశి తేదీ 28-9-2024 శనివారం

  ఈ ఏడాది ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృ పక్ష సమయంలో వస్తుంది. పూర్వీకుల మోక్షానికి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఇందిరా  ఏకాదశి  నాడు ఉపవాసం ఉండే వ్యక్తి ఏడు తరాల వరకు వాళ్ళ పూర్వీకుల దగ్గరకు వెళతాడని చెబుతారు. తన పూర్వీకులు కూడా పుణ్యాన్ని పొందుతారు. వారు తమ పితృలోకం నుండి విముక్తి పొంది స్వర్గంలో స్థానం పొందుతారు. శ్రీమహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో  ఆనందం , శ్రేయస్సు వస్తాయి.  విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. హిందూ గ్రంథాలయ ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. వైకుంఠప్రవేశం లభిస్తుంది. పూర్వీకులు స్వర్గం చేరుకుంటారని నమ్ముతారు. 

అనంత పద్మ నాభ స్వామి వ్రతం తేదీ 17-9-2024 మంగళవారం

  అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు. ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు.  కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రా

వామన జయంతి తేదీ 15-9-2024 ఆదివారం

  త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా పరిగణించబడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడడం కోసం శ్రీ మహా విష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. వాటిల్లో రామ, కృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అయితే శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన ఇతర అవతారాలను కూడా పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారం వామన అవతారం.  విష్ణువు ఈ అవతారం దేవతలను, విశ్వాన్ని రక్షించడానికే.. అందుకే ఈ అవతారం వర్ణన జానపద కథల్లో వినిపిస్తుంది. భూమిపై రాక్షస రాజు బలి ప్రభావం పెరిగి.. దేవతలలో ఆందోళన నెలకొంది. అప్పుడు బలి గర్వాన్ని అణచడానికి, అతనికి గుణపాఠం చెప్పడానికి శ్రీ మహా విష్ణువు వామనుడిగా జన్మించాడు. అదితి, ఋషి కశ్యపుల కుమారుడిగా విష్ణువు (వామనుడు) జన్మించాడు. పురాణ కథ ఏమిటంటే పురాణాల ప్రకారం రాక్షస రాజు బాలి శక్తి పెరిగేకొద్దీ..అతనిలో క్రూరత్వం కూడా పెరిగింది. అప్పుడు మానవులపైనే కాదు దేవతలపై కూడా తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు బాల వటువు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఓ యాగం జరుగుతోంది. యాగ సమయంలో దేవ గురువు శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు.