Skip to main content

Posts

Showing posts from September, 2023

అనంత చతుర్దశి తేదీ సెప్టెంబర్ 28, గురువారం

   ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అనంత చతుర్ధశిని జరుపుకుంటారు. దీని ప్రకారం ఈ ఏడాది  సెప్టెంబర్ 28  అనంత చతుర్దశిని జరుపుకోబోతున్నాం. హిందూ సాంప్రదాయం లో  అనంత చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు 14 లోకాలను సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హృదయపూర్వకంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని.. అన్ని వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి అనంత చతుర్దశి రోజున ఉపవాసం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అనంత చతుర్దశి పూజా విధానం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం పూజ గదితో సహా మొత్తం ఇంటిలో గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత పూజా స్థలంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరచి, విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. దీని తరువాత, ధూపం, దీపం, నైవేద్యం, పరిమళం, చందనం సమర్పించి .. మహావిష్ణువుని పూజించి చివరకు హారతి  ఇవ్వాలి. మంత్రాలన

నక్షత్ర శాంతి పూజ సామగ్రి & వివరాలు

పూజ విధానం : -  నవగ్రహ ధాన్యాలు దానం చేయాలి , గోమాతకు గ్రాసం మరియు ప్రదక్షిణలు చేయాలి , శ్రీ వారికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు అభిషేకం చేయించాలి.  దానాలు : - నవగ్రహ ధాన్యాలు : -  గోధుమ పిండి 1250 గ్రాములు, బియ్యం 2 కిలోలు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, జీలకర్ర 2 00 గ్రాములు.  అభిషేకం, అర్చన:- అభిషేకం పూజ సామగ్రి, : -ఆవు పాలు లీటరు, పెరుగు కిలో, తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 1/2  కిలో, చక్కెర 1/2 కిలో,కొబ్బరి బోండాం 1, పండ్ల రసాలు. అరటి పండ్లు 1/2 డజన్, సాంబ్రాణి ఆగరబత్తి 1 పాకెట్, పూలు 1/2 కిలో, పూల దండలు, దోవతి సెల్లాలు.  ప్రసాదం నై వేద్యం. బ్రాహ్మణ ఆశీర్వచనం,  బ్రాహ్మణ దక్షిణ 

పరివర్తన ఏకాదశి తేదీ 25-9-2023 సోమవారం

  యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు, భాద్రపద శుద్ధ  ఏకాదశి రోజున  ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే, ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది.వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నాయి. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు.  ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగే ఫలం లభిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.

రాధ అష్టమి తేదీ 23-9-2023 Radha Ashtami

  భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ' రాధాష్టమి ' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. Sri Radha Ashtami, , the birthday of Radha, is a major festival celebrated by Lord Krishna devotees. The day celebrates the relationship between Radha and  Krishna  – a unique relationship between god and human (world).

"గుడిలో మనం ఏం సేవ చేయొచ్చు?"

భగవంతుడికి మనం చేసే గొప్ప సేవలలో ఒకటి మన శరీరంతో ఒక సామాన్యుడిలా సేవ చేయడం. ఆ సేవ ఒక దేవాలయంలో చేస్తే ఇంకా గొప్ప పుణ్యం.  భగవంతుడి ముందు అందరం సమానమే. అందరూ సామాన్యులమే అనే భావం మనస్సులో నింపుకొని, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తే, భగవంతుడు తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు.  దేవాలయంలో మనం చేసే సేవ, ఆ భగవంతుడి పూజ కన్నా ఎక్కువైనదే అనటంలో సందేహం లేదు. దేవాలయంలో మనం చాలా సేవలు చేయవచ్చు. అవి.....    *దేవాలయం బండలు తుడవడం,  *భగవంతుడు (విగ్రహం) ధరించిన వస్త్రాలు ఉతకడం,  *దేవుడి పల్లకి మోయడం,  *దేవుడి పూజ సామాగ్రిని శుభ్రం చేయడం,  *దేవాలయ ప్రాంగణం శుభ్రం చేయడం,  *దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడం,  *దేవుడి అలంకరణలో సహాయం చేయడం,  *దేవుడి పూజకు సామాన్లు సర్దడం,  *దేవుడి అభిషేకం కోసం పదార్థాలను వండటం / సర్దడం దేవుడి తీర్థ ప్రసాదాలు పంచడం, *దేవాలయం గోడలు / గోపురాల మీద బూజు దులపడం,  *అన్నదాన కార్యక్రమంలో వంటకు సహాయం చేయడం,  *దేవుడి పూజ యొక్క నిర్మాల్యం శుభ్రం చేయడం,  *అభిషేకం తర్వాత గర్భాలయం శుభ్రం చేయడం,  *దేవుడి కళ్యాణంలో సహాయం చేయడం.

ఋషి పంచమి తేదీ 19-9-2023 మంగళవారం

    ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ( Rishi Panchami  2023) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం,  ఋషి పంచమి  సెప్టెంబర్ 19, మంగళ వారం వస్తుంది. ఋషి  పంచమినే రిషి  పంచమి , గురు  పంచమి  అని కూడా  అంటారు . సనాతన ధర్మంలో  ఋషి  పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు.  ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువు వశిష్ఠుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కన్నతండ్రి జమదగ్ని మహర

అజ ఏకాదశి తేదీ 10-9-2023 ఆదివారం

    ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. దీని గురించి పద్మ పురాణంలో వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మరోవైపు ఈసారి వచ్చిన అజ ఏకాదశి వేళ అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున పునర్వసు, పుష్య నక్షత్రాల ప్రభావంతో వరియాన్ యాగం, రవి పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి.   మూడు శుభ యోగాలు.. ఈ పవిత్రమైన రోజున సర్వార్ధ, వరియాన్, రవి పుష్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ మూడు యోగాల వల్ల అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ మూడు యోగాల సమయంలో శ్రీ హరిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.

"సప్త చిరంజీవులు"

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. 1. అశ్వత్థాముడు 2. బలి చక్రవర్తి 3. వ్యాసుడు 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపుడు 7. పరశురాముడు వారిని స్మరిస్తూ చెప్పేదే సప్త చిరంజీవి శ్లోకం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః  కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః  సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం  జీవేద్వర్షశ్శతమ్ సోపి సర్వవ్యాధి వివర్జిత. శ్రీ కృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి, లోక హితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మం వలన కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు.  ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహంచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతి నిత్యం స్మరిస్తే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగుతోందని శాస్త్ర వచనం.

భగవంతుని ఉపచారములు - రకములు

  భగవంతుడిని పూజించే విశేష ఘట్టములను ఉపచారములు అని అందురు. వీనిలో సంక్షేపం, విస్తారం అని రెండు రకములు కలవు.ఈ విషయాలు వివిధ ఆగమ శాస్త్రాలలో తెలిపినారు.  లఘువుగా జరుపబడు ఉపచారములను  సంక్షేప ఉపచారము లని, విశేష రీతిలో జరుపబడు ఉపచారములను  విస్తార ఉపచారము లని అంటారు. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, మప్ఫైఆరు, అరవైనాలుగు అని అనేక విధాలుగా ఉపచారములు ఉన్నాయి. పంచోపచారాలు – 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం దశోపచారాలు – 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం షోడశోపచారాలు – 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం అష్టాదశోపచారాలు – 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం 5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం ముప్ఫైఆరు ఉపచారాలు – 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5.