దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా ప్రదక్షిణలు చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి.
వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ రోజునే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మోహినీ అవతార విశిష్టత తెలుసుకుందాం. 'మోహిని' అంటే మోహింపజేసేది అని అర్థం. హిందూ పురాణాలలో మోహిని అవతారం శ్రీమహావిష్ణువు ధరించిన అత్యంత విశిష్టమైన, ఏకైక స్త్రీ అవతారం. మోహిని ఏకాదశి ఇలా వచ్చింది శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్ప...