Skip to main content

Posts

అక్షయ తృతీయ తేదీ 20-4-2026 సోమవారం నాటి విశేషాలు

శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. “ ఓం నమో భగవతే వాసుదేవాయ “ అనే ద్వాదశాక్షర మంత్రం తొ జపం చేయడం చాలా ముక్యం ఈరోజు. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి.బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
Recent posts
 
 
 

అమలకి ఏకాదశి రోజు (ఫిబ్రవరి 27) శుక్రవారం

    ఉసిరి  కాయలను  దానం  చేయడం  ఆరోగ్యానికి  మేలు  చేస్తుందని  విశ్వసిస్తారు.  అనారోగ్య  సమస్యలు  తగ్గి  ఆయురారోగ్యాలు  పెరుగుతాయని  భక్తుల  నమ్మకం.  సంపద,  దీర్ఘాయుష్షు,  మానసిక  ప్రశాంతత  కలుగుతాయని  కూడా  చెబుతారు.  ఉసిరి  చెట్టు  పూజ  వల్ల  లక్ష్మీ  కటాక్షం  సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అమలక ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారి ఇల్లు పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూజలు, ఉపవాసాలతో పాటు, దానాలు కూడా చేస్తారు.

కళ్యాణ ఏకాదశి తేదీ 13-2-2026 శుక్రవారం

మాఘమాసంలో  బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్‌ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం. తిలాదానం గ్రహ శాంతి సందర్భాలలోనూ, పితృ కార్యాల లోనూ జరుగుతుంది గనుక కల్యాణ ఏకాదశినాడు తిలలతో పూజ చేయడం అసాధారణం అనిపిస్తుందిగాని ఇది పురాణాకాలం నుంచి వస్తున్న విధానం.   మాఘమాసంలో   శివరాత్రికి  ముందు  వచ్చే  ఏకాదశి   నాడు  ఆరు  విధాలుగా  నువ్వులను  ఉపయోగించడంలో  నువ్వులను  దానం  చేయడం  ఒక  అంశం.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి

 // జై శ్రీరామ్ //   పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 9  , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ), blouse peaces, red & yellow colour 2 nos., dothi,Sella 1 set. అరటి పండ్లు 1 డజన్ & అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 nos. అగర్ రబత్తి ,,, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  ముద్ద కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 రాగి  కలశం చెంబులు 2,   దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1,  రూపాయి  బిళ్ళలు  25.  చిన్నవి అరటి కొమ్మలు 4, పూలు ఒక  కిలో, పూల హారాలు  3  మూరలు , Tulasi maala ఒకటి ,sree satyanarayana swamy దేవుని ఫోటో   ఆచమనం పాత్ర సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, కాజు, kissmiss ,బాదాం పొడి,  బెల్లం పొడితో చేయాలి .cha...

భీష్మ ఏకాదశి తేదీ 29 -1-2026 గురువారం

  భీష్ముడు  మాఘ  శుక్ల  అష్టమి  నాడు  తనువు  చాలించినా  వైకుంఠానికి  చేరడానికి  మూడు  రోజులు  పడుతుంది.  కావున  ఏకాదశి   నాడు  భీష్ముడు  మోక్షాన్ని  పొందాడని  ప్రసిద్ధి.  అందుకే  మాఘ  శుక్ల  ఏకాద శి  భీష్మ   ఏకాదశి   అని  అంటారు.  మాఘ  శుద్ధ  ఏకాదశి,  భీష్మ   ఏకాదశి గా  పిలుస్తారు. అందుకే ఈ రోజున భీష్మునికి ఇష్టమైన విష్ణు సహస్రనామమును ఈ ఏకాదశి నాడు ఉపవాసముతో మూడుసార్లకు తగ్గకుండా శక్తి మేరకు పారాయణము చేయాలి.  ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించాలి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" అనే ఈ శ్లోకాన్ని చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానమని.. పార్వతీ దేవికి పరమ శివుడు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

రథ సప్తమి తేదీ 25-1-2026 ఆదివారం

  రథ  సప్తమి  సూర్య  భగవానుని  జన్మదినం .  ఈ  రథ  సప్తమి  రోజునే  సూర్య  భగవానుడు  సత్రాజిత్తుకి  శమంతక  మణిని  ప్రసాదించాడు.  ఏడు  కిరణాలుగా  సప్తవర్ణాలను  ప్రతిబింబిస్తూ  కదిలే  సూర్యుని  అశ్వాలు/  కిరణాలు  ఈ  రోజు  ఒకే  తెల్లని  కాంతి  రేఖగా  మారుతాయి.  అందుకే  ఈ  రోజుని  రథసప్తమి  అంటారని  పెద్దలు  చెబుతారు. సూర్యుని  గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు  రథం  మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం  ఉత్తరాయనము ,  దక్షిణాయనము  అని రెండు విధములు.  ఆషాఢమాసము  నుండి  పుష్యమాసము  వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి...