Skip to main content

Posts

Parama Ekadashi date 11-6-2026 Thursday

  Parama Ekadashi translates to the "supreme" or "highest" Ekadashi . It is an exceptionally rare and highly auspicious Hindu fasting day dedicated to Lord Vishnu. Timing: It falls during the dark fortnight ( Krishna Paksha ) of the Adhika Masa (the extra or leap month in the Hindu lunar calendar, which occurs roughly once every three years. Ekadashi is a powerful spiritual practice that purifies a person's physical, mental, and spiritual well-being . Today's observance of the fast, along with the hearing of Ekadashi Vrat Katha and proper performance of Ekadashi Parana rituals, will help devotees receive divine blessings and spiritual peace.
Recent posts

అధిక జ్యేష్ఠ మాసం ఈ ఏడాది మే 17వ తేదీ ఆదివారం నుంచి వచ్చే నెల 15వ తేదీ సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాసం

(ఫోటోలు- iStock) Adhika Jyeshta masam 2026 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠ మాసం వస్తుంది. అయితే సూర్య సిద్ధాంతం, బ్రహ్మ సిద్ధాంతం తదితర గ్రంథాల ప్రకారం, ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి కనిపించదో ఆ కాలాన్ని ‘అధిక మాసం’గా పరిగణిస్తారు. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక ఏడాదికి 365 రోజులు 6 గంటల 11 సెకన్లు. అయితే ఒక చాంద్రమానం ప్రకారం ఒక ఏడాదికి 354 రోజుల సుమారు 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు మాసాల మధ్య సమన్వయం కల్పించేందుకు భారతీయ శాస్త్రకారులు ‘అధిక మాస’ వ్యవస్థను రూపొందించినట్లు ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్త మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.   జ్యేష్ఠ శుక్ల పక్షం, రెండో పక్షం అయిన క్రిష్ణ పక్షంలో ఎలాంటి సంక్రాంతి లేకపోవడంతో ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా పరిగణించనున్నారు. ఈ లెక్కన ఏ ఏడాదిలో అయిన రెండు జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య విభేదాలు రావొ...

Darsha Bhavuka Amavasya date 16-5-2026 Saturday

  Amavasya May 2026 16 May (Saturday) Darsha Bhavuka Amavasya,  ఈ క్రమంలోనే దర్శ అమావాస్య రోజు రాత్రి  రావి చెట్టు క్రింద ఆవాల నూనెతో దీపం వెలిగించి కోరికలు నెరవేరాలని ప్రార్థించండి. ఇక ఈ అమావాస్య రోజు రాత్రి నదిలో లేదా పారుతున్న నీటిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి. అమావాస్య రాత్రి లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సంపదలు చేకూరే అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన శక్తి సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం మంచిది.

Rounds in temples why ?

  దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా  ప్రదక్షిణలు  చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి. 

మోహినీ ఏకాదశి తేదీ 27-4-2026 సోమవారం

  వైశాఖ  శుద్ధ  ఏకాదశి  ఈ  రోజునే  మోహిని  ఏకాదశి  వ్రతాన్ని  ఆచరించాలని  పంచాంగకర్తలు  సూచిస్తున్నారు.  ఈ  సందర్భంగా  మోహినీ  అవతార  విశిష్టత  తెలుసుకుందాం.  'మోహిని'  అంటే  మోహింపజేసేది  అని  అర్థం.  హిందూ  పురాణాలలో  మోహిని  అవతారం  శ్రీమహావిష్ణువు  ధరించిన  అత్యంత  విశిష్టమైన,  ఏకైక  స్త్రీ  అవతారం. మోహిని ఏకాదశి ఇలా వచ్చింది శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్ప...

శాంతి నక్షత్రములు (Shanti Nakshtramulu)

  18శాంతి నక్షత్రములు 1. అశ్విని, 2. భరణి, 3. కృతిక, 4. రోహిణి, 5.ఆరుద్ర, 6.పుష్యమి, 7.ఆశ్లేష, 8.మఖ, 9.పుబ్బ, 10. ఉత్తర, 11. హస్త, 12. చిత్త, 13. విశాఖ, 14. జ్యేష్ట, 15. మూల, 16. పూర్వాషాఢ, 17. పూర్వాభాద్ర, 18. రేవతి వీటిలో జ్యేష్ట మూల మిక్కిలి దోష తారలు. జ్యేష్ట` చివరి 4 ఘ|| లు , మూల ప్రారంభ 4 ఘ||లు అత్యంత దోషము పుష్యమి 2 వ పాదం కర్కాటక లగ్నం, పూర్వాషాఢ 3 వ పాదం ధనుర్లగ్నం, చిత్త 2 వ పాదం కన్య లగ్నం,

రామానుజాచార్య జయంతి తేదీ 22-4-2026 బుధవారం

// శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది ఏప్రిల్ 22 వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి , బుధ వారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు.విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు.విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని, ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామాన...

అక్షయ తృతీయ తేదీ 20-4-2026 సోమవారం నాటి విశేషాలు

శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. “ ఓం నమో భగవతే వాసుదేవాయ “ అనే ద్వాదశాక్షర మంత్రం తొ జపం చేయడం చాలా ముక్యం ఈరోజు. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి.బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.