Skip to main content

Posts

మోహినీ ఏకాదశి తేదీ 27-4-2026 సోమవారం

  వైశాఖ  శుద్ధ  ఏకాదశి  ఈ  రోజునే  మోహిని  ఏకాదశి  వ్రతాన్ని  ఆచరించాలని  పంచాంగకర్తలు  సూచిస్తున్నారు.  ఈ  సందర్భంగా  మోహినీ  అవతార  విశిష్టత  తెలుసుకుందాం.  'మోహిని'  అంటే  మోహింపజేసేది  అని  అర్థం.  హిందూ  పురాణాలలో  మోహిని  అవతారం  శ్రీమహావిష్ణువు  ధరించిన  అత్యంత  విశిష్టమైన,  ఏకైక  స్త్రీ  అవతారం. మోహిని ఏకాదశి ఇలా వచ్చింది శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్ప...
Recent posts

శాంతి నక్షత్రములు (Shanti Nakshtramulu)

  18శాంతి నక్షత్రములు 1. అశ్విని, 2. భరణి, 3. కృతిక, 4. రోహిణి, 5.ఆరుద్ర, 6.పుష్యమి, 7.ఆశ్లేష, 8.మఖ, 9.పుబ్బ, 10. ఉత్తర, 11. హస్త, 12. చిత్త, 13. విశాఖ, 14. జ్యేష్ట, 15. మూల, 16. పూర్వాషాఢ, 17. పూర్వాభాద్ర, 18. రేవతి వీటిలో జ్యేష్ట మూల మిక్కిలి దోష తారలు. జ్యేష్ట` చివరి 4 ఘ|| లు , మూల ప్రారంభ 4 ఘ||లు అత్యంత దోషము పుష్యమి 2 వ పాదం కర్కాటక లగ్నం, పూర్వాషాఢ 3 వ పాదం ధనుర్లగ్నం, చిత్త 2 వ పాదం కన్య లగ్నం,

రామానుజాచార్య జయంతి తేదీ 22-4-2026 బుధవారం

// శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది ఏప్రిల్ 22 వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి , బుధ వారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు.విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు.విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని, ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామాన...

అక్షయ తృతీయ తేదీ 20-4-2026 సోమవారం నాటి విశేషాలు

శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. “ ఓం నమో భగవతే వాసుదేవాయ “ అనే ద్వాదశాక్షర మంత్రం తొ జపం చేయడం చాలా ముక్యం ఈరోజు. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి.బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
 
 
 

అమలకి ఏకాదశి రోజు (ఫిబ్రవరి 27) శుక్రవారం

    ఉసిరి  కాయలను  దానం  చేయడం  ఆరోగ్యానికి  మేలు  చేస్తుందని  విశ్వసిస్తారు.  అనారోగ్య  సమస్యలు  తగ్గి  ఆయురారోగ్యాలు  పెరుగుతాయని  భక్తుల  నమ్మకం.  సంపద,  దీర్ఘాయుష్షు,  మానసిక  ప్రశాంతత  కలుగుతాయని  కూడా  చెబుతారు.  ఉసిరి  చెట్టు  పూజ  వల్ల  లక్ష్మీ  కటాక్షం  సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.  ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ హరి విష్ణువుకు పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అమలక ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారి ఇల్లు పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూజలు, ఉపవాసాలతో పాటు, దానాలు కూడా చేస్తారు.

కళ్యాణ ఏకాదశి తేదీ 13-2-2026 శుక్రవారం

మాఘమాసంలో  బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్‌ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం. తిలాదానం గ్రహ శాంతి సందర్భాలలోనూ, పితృ కార్యాల లోనూ జరుగుతుంది గనుక కల్యాణ ఏకాదశినాడు తిలలతో పూజ చేయడం అసాధారణం అనిపిస్తుందిగాని ఇది పురాణాకాలం నుంచి వస్తున్న విధానం.   మాఘమాసంలో   శివరాత్రికి  ముందు  వచ్చే  ఏకాదశి   నాడు  ఆరు  విధాలుగా  నువ్వులను  ఉపయోగించడంలో  నువ్వులను  దానం  చేయడం  ఒక  అంశం.