18శాంతి నక్షత్రములు 1. అశ్విని, 2. భరణి, 3. కృతిక, 4. రోహిణి, 5.ఆరుద్ర, 6.పుష్యమి, 7.ఆశ్లేష, 8.మఖ, 9.పుబ్బ, 10. ఉత్తర, 11. హస్త, 12. చిత్త, 13. విశాఖ, 14. జ్యేష్ట, 15. మూల, 16. పూర్వాషాఢ, 17. పూర్వాభాద్ర, 18. రేవతి వీటిలో జ్యేష్ట మూల మిక్కిలి దోష తారలు. జ్యేష్ట` చివరి 4 ఘ|| లు , మూల ప్రారంభ 4 ఘ||లు అత్యంత దోషము పుష్యమి 2 వ పాదం కర్కాటక లగ్నం, పూర్వాషాఢ 3 వ పాదం ధనుర్లగ్నం, చిత్త 2 వ పాదం కన్య లగ్నం,
// శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది ఏప్రిల్ 22 వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి , బుధ వారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు.విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు.విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని, ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామాన...