జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వదినాన శ్రీ విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తెలిసి, తెలియక చేసిన పొరపాట్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, పనిలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శని త్రయోదశి రోజు శని భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. చాలా అరుదుగా వచ్చే శని త్రయోదశి ఈ ఏడాది "జూన్ 13న" వచ్చింది. ఈ రోజు ప్రదోష కాలంలో చతుర్ధశి తిథి కూడా ఉంది కాబట్టి మాసశివరాత్రి అయ్యింది. కాబట్టి, అధిక జ్యేష్టమాసంలో మాసశివరాత్రితో వస్తోన్న ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చం. అంతేకాదు, జూన్ 13న కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. మరి, ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. శని త్రయోదశి, మాసశివరాత్రి రెండూ కలిసి వచ్చిన జూన్ 13న శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి, శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే ముప్పై మూడు మారేడు దళాలతో పరమేశ్వరుడిని పూజించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుందంటున్నారు . శివుడిని ముప్పై మూడు మారేడు దళాలతోనే ఎందుకు పూజించాలంటే.. అధికమాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఈ మాసంలో 33 అరిసెలు, అప్పాలు, ...