Skip to main content

Posts

Showing posts from July, 2017
ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా. 👉  ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు. సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు. 👉  ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే.. కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః! వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!! భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు. ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. 1.కశ్యపుడు, 2.అత్రి, 3.భరద్వాజుడు, 4.విశ్వామిత్రుడు, 5.గౌతముడు, 6.జమదగ్ని, 7.వసిష్ఠుడు... వీ
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు, Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.  శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı ఇతర పక్షులు పీకలు పట్టుకొ
కామిక ఏకాదశి ప్రాముఖ్యత  కామిక ఏకాదశి 19-7-2017 బుదవారం రోజున తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించడం మరియు విష్ణు సహస్ర నామ స్తోత్రం & లక్ష్మి స్తోత్రం చదవడం గాని వినటం గాని చేస్తే తద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. తులసీ దళాలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుబాధ, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక తులసీ దళం.. నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణం, వెండి కంటే అతీతమైందని పురాణాలు చెబుతున్నాయి.  అందుచేత కామిక ఏకాదశిన సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ, తులసీ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున శ్రీ కృష్ణుడిని నిష్ఠగా పూజించి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపమెలిగిస్తే.. ఆ పరమాత్మ ఆశించిన ఫలితాలనిస్తాడని, పాపాలను హరింపజేసి, స్వర్గలోకవాస ప్రాప్తం ప్రసాదిస్తాడు. 
ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి'( తేది 9-7-2017 ఆదివారం ) అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, శ్రీ వైష్ణవ ఆచార్యులను, to parents  పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ' గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర : గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట.  ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.  ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరి
ఆషాఢమాస తొలి ఏకాదశి 4-7-2017 మంగళ వారము రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్ తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంట
శ్రీమన్ నాథమునులు జన్మ నక్షత్రం 5-7-2017 నాడు ఉంది. వీరనారాయణ పురంలో ఈశ్వర భట్టాళ్వార్ నకు జన్మించారు.వారికి రంగనాథముని మరియు నాథ బ్రహ్మర్ అని నామధేయములు కలవు. వారు అష్టాంగ యోగం మరియు దైవ సంగీతంలో నిష్ణాతులు. వీరే అరయర్ సేవని దివ్య దేశములలో ప్రవేశపెట్టారు. ఇప్పటికి మనం శ్రీ రంగం, ఆళ్వార్ తిరునగరి , శ్రీ విల్లిపుత్తూర్ లలో సేవించవచ్చును. నాథమునులు వారి తండ్రి మరియు కుమారునితో ( ఈశ్వర ముని) కూడి మధుర, బృందావనం , గోవర్ధన గిరి, ద్వారక,బదరికాశ్రమం, నైమిశారణ్యం మొదలగు దివ్య దేశముల కు వెళ్ళిరి. వారు గోవర్ధనపురం అనే ఊరిలో స్వామి యమునా నది రూపంలో ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డున ఉండిరి. ఒక రోజు స్వామి నాథమునులకు కలలో కాట్టుమన్నార్ గుడికి తిరిగి వెళ్ళమని ఆదేశించిరి . వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, పూరి , సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం ( అక్కడ మిగిలిన దివ్య దేశములు), తిరువహీంధ్రపురం, తిరుక్కోవలూరు, శ్రీ రంగం, కుంభకోణంలలో ఉన్న పెరుమాళ్ళకు మంగాళాశాసనము చేసి చివరికి వీరనారయణపురమమునకు చేరిరి.
పెరియాళ్వార్ తిరునక్షత్రం 3-7-2017 సోమవారం  భక్తియొక్క పరిపక్వ దష కలిగినవారు మన ఆళ్వార్లు, అందులో విష్ణుచిత్తులవారు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించింది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెళ్ళి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాళ్ళను ఆళ్వారులు అని అంటాం. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీళ్ళంతా.   తనియన్ :-   మిధునే స్వాతిజంవిష్ణోః రథాంశం ధన్వినః పురే | ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశ్శిఖమ్ || గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతిపరిక్లుప్తం శుల్క మాదాతుకామః, శ్వశుర మమర వన్ద్యంరఙ్గనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి.   తిరునామములు :-   పెరియాళ్వార్, శ్రీవిష్ణుచిత్తులు, పట్టరపిరాన్, భట్టనాథులు   ఈయన శ్రీవిల్లిపుత్తూర్లో వటపత్రశాయి మందిరంలో మాలాకారుడు. ఒక సారి ఆయనకు పాండ్య
సుదర్శన చక్రరాజం Sudharshana Alwaar birth day on 3-7-2017 ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణస్తోమ భూషణ! జనిభయస్థాన తారణ! జగదవస్థాన కారణ! నిఖిల దుష్కర్మ కర్శన! నిగమ సద్ధర్మ దర్శన! జయ జయ శ్రీ సుదర్శన! జయజయశ్రీ సుదర్శన!   –  శ్రీసుదర్శనాష్టకం శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి.    అవి:    సుదర్శన చక్రం ,  పాంచజన్య శంఖం ,  కౌమోదకీ గద ,  నందా ఖడ్గం ,  శార్ జ్గ ధనువు ;   కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరణం ప్రపద్యే!! సౌరమాసం  –  కర్కాటాకంలో  –  చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం    అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది. కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం  | విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !! ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది.    యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని