Skip to main content

Posts

Showing posts from February, 2022

శ్రవణ నక్షత్ర యుక్త శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

 ప్రతి నెల శ్రవణ నక్షత్రం ఉన్న రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మాస కళ్యాణం నిర్వహిస్తున్నారు.   వేదవతీ (పద్మావతి), గోదాదేవి(అలివేలు మంగమ్మ)ల సమేతుడై  పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి భక్తులకు  కోర్కెలు తీర్చే కల్యాణ ప్రదాతగా దర్శనమిస్తున్నారు.   కల్యాణోత్సవంలో పాల్గొన్న అవివాహిత  యువతీయువకులు కంకణాన్ని ధరిస్తే, అర్చకుల చేత కళ్యాణ అక్షతలు శిరస్సు మీద ఆశీర్వచన రూపకముగా వేయించుకుంటే  వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం.  వివాహం ఆలస్యం అవుతున్న వారు స్వామి వారి కళ్యాణం లో పాల్గొనవచ్చును. పూల మాలలు గాని , తులసి మాల గాని సమార్పిస్తే కూడా వివాహం జరుగుతుంది.

విజయ ఏకాదశి తేదీ 27-2-2022 ఆదివారం

  యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానునితో ఇలా అన్నాడు  " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరాడు. శ్రీ కృష్ణ పరమాత్మ :- ఓ యుధిష్టిర ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి" ఈ ఏకాదశిని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరియు వారి పాపాలు కూడా తొలిగిపోతాయి.  ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది అందుకు సందేహమే లేదు.  శ్రీ రామచంద్రుడు ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద ఈ విధంగా  ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి ఘోరమైన పాపాలు అయిననూ హరించిపొ

నామ కరణం పూజ సామగ్రి

// జై శ్రీరామ // పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, బియ్యం 3 కిలోలు, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పండ్లు 1 పాకెట్, రాగి చెంబులు 1, పూల దండలు చిన్నవి 3, ఆవు పాలు,  ఆగరబతి పాకెట్,  కర్పూరం పాకెట్, నెయ్యి దీపాలు 2, ఆచమనం పాత్ర  తెల్లని వస్త్రము (బంగారు వర్ణముతో అంచు ఉండాలి.  ఎర్రని, లేదా పసుపు వర్ణముతో కనుము బట్టలు (blouse peaces ) అరటి పండ్లు 1/2 డజన్, స్వీట్ ప్రసాదం 1250 గ్రాములు  బ్రాహ్మణ దక్షిణ Rs .4,000 /-

కృష్ణ సప్తమి తేదీ 23-2-2022 బుధ వారం

    కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మహా శివరాత్రి  మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటున్నారు. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్ని పర్వదినాలే. 

పుణ్యా హ వాచనం పూజ సామగ్రి

  పుణ్యా హ వాచనం పూజ సామగ్రి                                                                       //  జై  శ్రీరామ్ //   పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 500 ml  తమల పాకులు 25, వక్కలు 15 ,  అరటి పండ్లు 1/2 డజన్  ఆగరబతి packet, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, రాగి కలశం చెంబులు 1, దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  15  పూలు,  1/4 kg. ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర 1 బ్రాహ్మణ దక్షిణ  

విశాఖ నక్షత జనన శాంతి పూజ విషయాలు

 నవగ్రహ జపాలు, విశాఖ నక్షత్ర మంత్ర జపం , గ్రహ పూజ,తర్పణాలు,నవగ్రహ హోమం,శివాభిషేకం  చేయించాలి.  పూజ సామగ్రి  పసుపు, 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, గండం చిన్న డబ్బా, రాగి చెంబులు 2,  విడి పూలు, బిల్వ దళం ఆకులు , ఆవు పాలు,పెరుగు,తేనె, నెయ్యి,చక్కర అన్నీ కలిపి 1/2 లీటర్, అరటి పండ్లు 1 డజన్, కొబ్బరి కాయలు, 5, గోధుమ పిండి,1250 గ్రాములు  బియ్యం 3 కిలోలు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు  పుట్నాలు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు, 1250 గ్రాములు, ,తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు,  దోవతి ,ఉత్తరీయం, నవగ్రహాలకు వస్త్రాలు 9,  తమల పాకులు 50, వక్కలు 51, ఖర్జూరం 35, ఆగరబత్తి పాకెట్,  కర్పూరం, హోమం సమీధలు,  ఆవు నెయ్యి, కిలో,దీప నూనె 1/2 కిలో,వత్తులు,  మట్టి గిన్నె, 1,  హోమం పౌడర్ పాకెట్ చిన్నది 1, పూర్ణాహుతి చిన్న పాకెట్, హోమ గుండం, లేదా ఇటుకలు, 16,సన్నని ఇసుక ఒక half cement bag  బ్రాహ్మణ దక్షిణ 15,000/-

Chanting of Alwaar Prabhandam (adyayana uschavams)

  By the grace of Lord VenkateSvara of Mytrinagar, Madinaguda Temple, it is planned to have a divya prabandha pArAyANa utsavam for 2 days (between 14-2-2022 evening and 15-2-2022 ) at the temple. This is partly to commemorate 11 years of the Lord's presence at this kshetram to bless us by His presence. Priests plan to chant about pASurams during these days. Many visitors have remarked that the priests in the temple do an outstanding kainkaryams in the temple.

Importance of Brahmoschavams

  Brahmotsavam means a festival  to commemorate an offering by Lord Bramha to Lord Vishnu . According to a legend, Lord Bramha performed a Brahmotsavam prayer for Lord Vishnu. ... Since then, the name of the festival is derived from this practice and was first conducted by Lord Bramha at Tirupati Temple. The Brahmotsava is performed over a nine-day/five day/three day  period . On the evening prior to the start of the first day, the rite of “Ankurarpana” (sowing of the seeds to signify fertility, prosperity and abundance) is performed along with a festival for Sri Vishvaksena (the leader of Narayana's retinue who removes obstacles and protects worship).On the first day, the main activity is the “Dhvajarohana,” the hoisting of the Garuda flag at the Dhvajastambham. This signifies the commencement of the Brahmotsava. It is believed that Garuda goes to Devalokam and invites the Devas to attend the function. During the period  of the festival, the religious activities include daily homa

రథ సప్తమి తేదీ 8 -2-2022 మంగళ వారం

  సూర్యుడి పుట్టిన రోజున రథ సప్తమి(Ratha Saptami)గా జరుపుకుంటాం.  మత్స్య పురాణం ప్రకారం.. సూర్యదేవుని (sun worship)పూజించే రోజు. రథ సప్తమి నాడు చేసే స్నానము, దానము, గృహము, పూజలు మొదలైన పుణ్య ఫలాలు వేయి రెట్లు అధికంగా ఇస్తాయని నమ్మకం. ఈ రథ సప్తమిని అచల సప్తమి, సూర్య రథ సప్తమి, ఆరోగ్య సప్తమి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు. ఎక్కువ మంది భక్తులు ప్రత్యేకంగా గంగాస్నానం చేస్తారు. ఈ రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారని నమ్ముతారు.   శాశ్వత ఫలం:  రథసప్తమి వ్రతం పాటించిన వారికి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.  కేవలం సూర్య భగవానునికి జలాన్ని సమర్పించినా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. శారీరక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు తప్పనిసరిగా పూజ చేయాలి. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. థసప్తమి రోజున ఎలా పూజించాలంటే..  రథ సప్తమి రోజున తెల్లవారు జామునే స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యదానం చేయాలి. నదిలో పువ్వు మొదలైన వాటితో అర్ఘం అర్పించాలి. అనంతరం స

వసంత పంచమి 5-2-2022 శనివారం

  మాఘమాసంలో 5-2-2022 శనివారం  వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు.ఈ   ఈ వసంత పంచమినే మదన పంచమి అని శ్రీ పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.    రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.    ఈ రోజున జ్ఞానానికి, జ్ఞానానికి, జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు.   తీపి అన్నం సరస్వతి తల్లికి ఇష్టమైన ప్రసాదంగా పరిగణించబడుతుంది.   అందుకే ఈ సమయంలోనే కొత్త బియ్యంతో పాయసం  చేసి దేవుళ్లకు నైవేధ్యంగా పెడతారు.   సరస్వతీ శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం .  అలాగే వసంతి పంచమి నాడు అమ్మవారిని  తెల్లని పూలతో పూజించడం మంచిది. 

మాఘ మాసం లో తిల చవితి తేదీ 4-2-2022 శుక్రవారం

 మాఘ   మాసంలో వచ్చే చవితిని .. అంటే మాఘ శుద్ధ చవితిని 'వర చతుర్థి' ..   'తిల చతుర్థి' ..  'కుంద చతుర్థి' అని పిలుస్తుంటారు. 'వర చతుర్థి'   రోజున గణపతిని పూజించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయట. అందువలన దీనిని 'తిల చతుర్థి' అని కూడా అంటారు. ఇక ఈ 'కుంద చతుర్థి'   రోజున శివుడిని 'మొల్ల' పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన ఫలాలు లభిస్తాయని చెబుతారు.  

మాఘమాస విశిష్టత ప్రారంభ0 2-2-2022 నుండి 2-3-2022 వరకు

  మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.  శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. మాఘమాసంలో వచ్చే పర్వదినాలు, తిథులు 1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12