Skip to main content

Posts

Showing posts from February, 2016

Construction of Houses & precious time as per shaastraas

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు. గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు. ఇల్లు కట్టుకోవటానికి తగిన భూమిని పరీక్షించే పద్ధతిని కూడా ఇక్కడే వివరించాడు సూతుడు. గృహ నిర్మాణానికి ఎంచుకున్న భూమిని పరీక్షించాలనుకున్నప్పుడు పిడిమూక లోతు, అంతే పొడవు వెడల్పుతో చక్కగా ఒక గుంటను తవ్వాలి. ఆ గుంటను బాగా అలకాలి. ఒక పచ్చి మూకుడు తెచ్చి దానిలో నెయ్యి పోసి నాలుగు దిక్కులలో నాలుగు వత్తులను ఆ మూకుడులో ఉంచి వెలిగించి పొయ్యి మధ్యన ఉంచాలి. ఏ దిక్కున ఉన్న వత్తి బాగా కాంతితో వెలుగుతుందో గమనించాలి. తూర్పు దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే ఆ భూమి విప్రులకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే క్షత్రియులకు, పడమటది వైశ్యులకు
Udaka Shaanti at our house on 21-2-2016 early morning 4 a.m. 
Read Saraswathi Goddess Stotram today for good rememberence. వసంత పంచమి ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ దేవి గురించి వివరణ హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, వి
The Sun God Birth day on 14-2-2016. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున సంభవించే సూర్య జయంతి సందర్భంగా ఈ ఏడు రేపు అనగా 14-02-2016 న రథసప్తమి కి గాను ఒక్కరోజు బ్రహ్మొత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకకు కలియుగ పరిపాలకుడు,ప్రత్యక్ష దైవము శ్రీనివాసుని క్షేత్రం తిరుమల సిద్దమైంది. మాఘశుద్ధ సప్తమి రోజున పుష్కరిణి స్నానం చాలా పవిత్రమైనది భక్తుల విశ్వాసం. చక్రస్నానం సమయానికి పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తుతారు. సర్వాలంకార భూషితుడైంనా మలయప్ప స్వామి సప్తవాహనాల పై రేపు అనగా 14-02-2016 ఆదివారం ఒక్కరోజే తిరువిదులల ో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కలిగిస్తూ దర్శనమివ్వనున్నారు. సాధారణంగా 9 రోజులు పాటు జరిగే బ్రహ్మొత్సవాలలో స్వామివారు రోజుకు రెండుచొప్పున అనగా ఉదయం,సాయంత్రం 16 వాహనాలపై ఊరేగడం పరిపాటి అందులోనూ ఈ ఏడు అధిక మాసం రావడం వలన శ్రీనివాసుని రెండు బ్రహ్మొత్సవాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఒక్కరోజు ఎదుకొండలవాడు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించడం ఈ రథసప్తమి వేడుకల ప్రత్యేకత. భక్తులు దీనినే అర్థ సంవత్సర బ్రహ్మొత్సవంగా, ఒక్క రోజు బ్రహ్మొ

Importance of Abhijith lagnam & its story.

అభిజిత్ నక్షత్రం మనకు తెలియని మరో నక్షత్రం! బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణజన్మ ఖండం తొంభై ఆరో అధ్యాయంలో ఉన్న విషయం. నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ­రుకున్నా శ్రవణా  నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు. అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.

Shatthila Ekadashi on 4-2-2016 Thursday

Shattila Ekadashi - शटतिला एकादशी ::::::::::::::: ::::::::::::::: ::::::::::::::: :::::: Shattila Ekadashi Vrat Katha Once Lord Vishnu told God Narad about an incident and elaborated the importance of Shatila Ekadashi fast. The story narrated by Lord Vishnu to Narad ji is as follows. In ancient time, a Brahmani used to live on earth. She always used to observe fast but never did any donations to any Brahman or monk. Once she observed fast regularly for a month. Due to which her body became very weak. Then Lord Vishnu thought that the Brahmani has purified her body by keeping the fast, so she will get a place in the Vishnu Lok but, she never donated food. So, achieving contentment is difficult for her. So Lord decided to visit her house in disguise of a beggar and ask for alms. If she does the charity, she will achieve satisfaction. So, Lord Vishu reached the Brahmani in disguise of a beggar on earth and asked for alms. She asked Lord “Highness, why have you come to me.” Lord replied “

Our customs in our human life.

మన సంప్రదాయాలు .......!! ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. - కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు. - లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు. - రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము). - ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశి
అంతరిక్షం లో అరుదైన దర్శనం ఒకేసారి బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహములను ప్రత్యక్షంగా చూసే మహదవకాశం ఫిబ్రవరి 4 వ తేదీ నుండి ఫిబ్రవరి 18 వ తేదీ వరకు అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుఝామున 5 గంటల 38 నిమిషముల వరకు తూర్పు నుండి నైరుతి వరకూ ఒకే రేఖ లో 5 గ్రహములను ప్రత్యక్షంగా దర్శించవచ్చును. మరలా అగస్ట్ 12 నుండి అగస్ట్ 19 వరకు నైరుతి నుండి తూర్పు వరకు ఒకే రేఖ మీద 5 గ్రహములను రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు దర్శించ వచ్చును. అంతరిక్షంలో కనిపించే అరుదైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించగలరు