Skip to main content
The Sun God Birth day on 14-2-2016.
ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున సంభవించే సూర్య జయంతి సందర్భంగా ఈ ఏడు రేపు అనగా 14-02-2016 న రథసప్తమి కి గాను ఒక్కరోజు బ్రహ్మొత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకకు కలియుగ పరిపాలకుడు,ప్రత్యక్ష దైవము శ్రీనివాసుని క్షేత్రం తిరుమల సిద్దమైంది.
మాఘశుద్ధ సప్తమి రోజున పుష్కరిణి స్నానం చాలా పవిత్రమైనది భక్తుల విశ్వాసం. చక్రస్నానం సమయానికి పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తుతారు. సర్వాలంకార భూషితుడైంనా మలయప్ప స్వామి సప్తవాహనాల పై రేపు అనగా 14-02-2016 ఆదివారం ఒక్కరోజే తిరువిదులలో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కలిగిస్తూ దర్శనమివ్వనున్నారు.
సాధారణంగా 9 రోజులు పాటు జరిగే బ్రహ్మొత్సవాలలో స్వామివారు రోజుకు రెండుచొప్పున అనగా ఉదయం,సాయంత్రం 16 వాహనాలపై ఊరేగడం పరిపాటి అందులోనూ ఈ ఏడు అధిక మాసం రావడం వలన శ్రీనివాసుని రెండు బ్రహ్మొత్సవాలు నిర్వహించడం జరిగింది.
అలాగే ఒక్కరోజు ఎదుకొండలవాడు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించడం ఈ రథసప్తమి వేడుకల ప్రత్యేకత. భక్తులు దీనినే అర్థ సంవత్సర బ్రహ్మొత్సవంగా, ఒక్క రోజు బ్రహ్మొత్సవంగా వ్యవహరిస్తారు.
సూర్యుని పుట్టిన రోజున జరిగే ఈ ఉత్సవంలో తొలుత ఆదివారం(14-02-2016) వేకువజామున మలయప్పస్వామి సూర్య ప్రభ వాహనంపై తిరుమాదావిధులలో ఊరేగుతూ దక్షిణ,ఉత్తర కలిసే మూలైన వాయువ్యదిశ లోకి వేంచేస్తారు. అక్కడ స్వామివార్లు తూర్పు దిశగా నిలబడి సూర్యకిరణాల కోసం వేచిఉంటారు. సూర్యభగవానుడు భక్తీ పారవశ్యంతో తన కిరణాలతో స్వామివారి శరీరాన్ని తాకుతూ పాదాల చెంతకు రాగానే అర్చకులు హారతిచ్చి గోవిందా,గోవిందా,గోవిందా అని నామస్మరణతో ఒక్కరోజు బ్రహ్మొత్సవాల ఊరేగింపు ప్రారంభిస్తారు. ఇది తరతరాలు గా వస్తున్న సంప్రదాయం. అప్పటి నుండి వరుసగా చిన్నశేష,గరుడ,హనుమంత,కల్పవృక్ష,సర్వభూపాల,చంద్ర ప్రభ వాహనాలపై తిరువిదులలో ఉత్సవర్లు ప్రదక్షణ చేస్తారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవ లైన కల్ళ్యాణోత్సవం,ఆర్జిత బ్రహోత్సవం,ఊ0జల్ సేవ,వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, విఐపి బ్రేకు దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. కాని సుప్రభాతం,తోమాల,అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-