కపిల గోవు గురించి. శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు , సమీపంలోని ఓ తల్లి ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి , ధ్యానం భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా , ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని ; అందువల్ల , బ్రహ్మ ఓ వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత , పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా , భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది. రాచకొండ రామా చర్యులు , పూజారి , మయూరిమర్గ్ , బేగుంపేట.చరవాని నంబరు. 9989324294
శ్రీ వై ష్ణవ ఆగమ శాస్త్ర అర్చక,B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), no: .9989324294. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మైత్రినగర్,మదీనగూడ, హైదరాబాద్