Skip to main content

Posts

Showing posts from July, 2019

3-8-2019 శనివారం నాడు గోదాదేవి తిరునక్షత్రం

జై శ్రీమన్నారాయణ.  చారిత్రిక ఐతిహ్యం శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల (పెరియాళ్వార్) వారికి నేటి తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరులో పుబ్బ నక్షత్రం నాడు తులసి వనం లో లభించింది. రోజూ స్వామికి పూలదండలు  కట్టి సమర్పించే తనకు ఆయన  అనుగ్రహంగా దొరికిన ఆ బాలికకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. శ్రీ విష్ణుచిత్తుల ఇంట అల్లారుముద్దుగా పెరిగిన గోదా  తండ్రి తో బాటే మాలలు కట్టి, ముందుగా తాను ధరించి తర్వాత స్వామి అర్పించేందుకు ఇచ్చేది. ఇది తప్పని తండ్రి వారించినా సాక్షాత్తూ రంగనాథుడే ఆమె ధరించిన మాలలే తనకు ఇష్టమని స్వప్నంలో కనిపించి చెబుతాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇది కానిపని అనుకుంటాడు. అయితే ఇదే సమయంలో  గోదాదేవి భక్తి ఫలించి, అక్కడి పెద్దలకు రంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని ఆజ్ఞాపించాడు. పెళ్లికూతురుగా వచ్చిన గోదా గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ

ఏకాదశి 7-2-2021 ఆదివారం

 7-2-2021  ఆదివారం నాడు ఏకాదశి. ఈ రోజు ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా  ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని,  యాలకు లను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని  ప్రసాదం  కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. హేమంత ఋతువు   ముగిసి వసంత   ఋతువు  ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక,  వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది

ఆడపిల్ల మొదటి సారి రజస్వల లేదా పుష్పావతి అయినప్పుడు ఏమి చేయాలి...

ప్రకృతికి దగ్గరగా , ప్రకృతితో కలిసి నడవాలని చెప్పే ఆచరణీయమైన , ఆదర్శనీయమైన విషయం చెబుతుంది. అందుకు ఇటీవల అందరూ మట్టి పాత్రలపై దృష్టి సారించారు . పసుపు పవిత్రతకు చిహ్నంగా భావిస్తాం. యాంటీబయోటిక్‌ అని ఆధునిక పరిశోధకులూ గుర్తించారు. బోనంలో ఉన్న ఆహారం శుద్ధిగా ఉండాలనే కుండ చుట్టూ పసుపు రాస్తారు. అమ్మ వారి ఆహార్యం , ఆచరించే నియమాలు.. అన్నింట్లో శాస్త్రీయత ఇమిడి ఉందని ఉస్మానియా విశ్వవిద్యాయంలో బోనాలపై పీహెచ్‌డీలు చేసిన విద్యార్థులు వెల్లడిస్తున్నారు.   బోనంలో ఉండే పసుపన్నం వల్ల కాలేయ సమస్యలు రావని వైద్యులు తెలిపారు. ఇలాంటి సామూహిక వేడుకల్లో పసుపన్నం తినడం వల్ల ఎలాంటి జీర్ణకోశ సమస్యలు రావు. గాల్‌బ్లాడర్‌ పనితీరు మెరుగవుతుంది. మెదడు     చురుకవుతుంది.   బోనం అలంకరణలో , సాక కోసం పసుపు నీటిలో వేపాకును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కీలకంగా వాడే వేపాకు వల్ల గాలి శుద్ధి అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది , కంటి సంరక్షణకు తోడ్పడుతుంది. క్యాన్సర్‌ , ప్లూ జ్వరాలు తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తేది 16-7-2019 మంగళ వారం నాడు గురు పౌర్ణమి. వేదం వ్యాసుని పుట్టిన రోజు.  వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’ సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం . వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ వశిష్ట మహర్షికి మునిమనువడు, శక్తికి మనువడు, పరాశర మహర్షికి పుత్రుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడు తపోనిదియైన మహర్షికి  నమస్కారం. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః భావం : బహు జన్మల నుండి సంప్రాప్తించిన పాప పుణ్యములు జ్ఞానమను అగ్ని చేత దహింపజేయునట్టి గురువునకు నమస్కరిస్తున్నాను . త్రికరణము లచే హింస చేయని వాడును, సత్యశౌచాదులు కలవాడు, సమస్త జీవ రాశుల యందు దయ కలవాడు, శాంత    చిత్తం కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తులు గల వాడు, వేద సంపన్నుడు , పరమభక్తుడు, యోగమును ఎరిగిన వాడు, యోగ నిష్ఠ యందున్నవాడు ,సదా యోగాత్మ స్వరూపుడై బహిరంతర శుద్ధి కలవాడు, జ్ఞానము , యోగము,చర్య, క్రియ, అను నాలుగు పాదాంతముల పర్యంతము శాస్త్ర (కర్మ,యోగ,భక్తీ, జ్ఞా

భాగవత్ గీత లోని పురుషోత్తమ యోగము,15వ అధ్యాయము.

తద్దినం పూజ సామాన్

ప్రథమ సంవస్చరం  – సంకల్ప  విధానం పూజ సామగ్రి  నల్లని నువ్వులు 100 grams, , బియ్యము 5 కిలోలు  ,    తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి  100 grams ,5 పాకెట్లు  ,పెరుగు డబ్బాలు 5 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు), ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ కొంచెం, గందం కొంచెము  , మోదుగ ఆకు    విస్తార్లు 20 , దొప్పలు 10, రూపాయి బిళ్ళలు, 15, రాగి చెంబు 1, రాగి గ్లాస్ 1, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్  ,తేనె,ఫోటో కు   పూల మాల, కుల్లా     పూలు, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, అయ్యగారికి ఆకు కూరలు కిలో , చింతపండు కిలో , ఉప్పు కిలో ,బెల్లం కిలో ,మిరపకాయలు  కిలో,ఎండు మిర్చిపొడి కిలో,   జీలకర్ర,1/4 కిలో, మిరియాలు,1/4 కిలో, ధనియాలు,1/4 కిలో,clothes dothi, kanduva.   రాచకొండ mobile no: 9989324294 అయ్యగారి దక్షిణ 2,౦౦౦/-