Skip to main content
తేది 16-7-2019 మంగళ వారం నాడు గురు పౌర్ణమి. వేదం వ్యాసుని పుట్టిన రోజు. 
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’
సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి
నమస్కారం
.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్
వశిష్ట మహర్షికి మునిమనువడు, శక్తికి మనువడు, పరాశర మహర్షికి
పుత్రుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడు తపోనిదియైన
మహర్షికి  నమస్కారం.
అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః
భావం : బహు జన్మల నుండి సంప్రాప్తించిన పాప పుణ్యములు జ్ఞానమను
అగ్ని చేత దహింపజేయునట్టి గురువునకు నమస్కరిస్తున్నాను .
త్రికరణము లచే హింస చేయని వాడును, సత్యశౌచాదులు కలవాడు,
సమస్త జీవ రాశుల యందు దయ కలవాడు, శాంత    చిత్తం కలవాడు,
నిగ్రహానుగ్రహ శక్తులు గల వాడు, వేద సంపన్నుడు , పరమభక్తుడు,
యోగమును ఎరిగిన వాడు, యోగ నిష్ఠ యందున్నవాడు ,సదా యోగాత్మ
స్వరూపుడై బహిరంతర శుద్ధి కలవాడు, జ్ఞానము , యోగము,చర్య,
క్రియ, అను నాలుగు పాదాంతముల పర్యంతము శాస్త్ర
(కర్మ,యోగ,భక్తీ, జ్ఞాన) మెరింగినవాడు, దంభాచారము లేనివాడు,
శిష్యుల గుణ దోశాములలో విశిష్ట జ్ఞానం కలవాడును , సర్వ సంశయములను
చేదించిన నిస్సంశయుడైన గురువు కటాక్షము సర్వదా అందరిపై వుండాలని
కోరుకుంటూ ———శ్రీ గురుభ్యో న్నమః…….
గురువులలోని రకాలు .. ……..
ఆధ్యాత్మిక గురువులు, వారి వారి లక్షణాలను హిందూ సంప్రదాయం ఇలా
నిర్వచించింది .
. సూచక గురువులు : ప్రకృతిలో లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా
తెలియజేస్తారు . భక్తీ జ్ఞాన వైరాగ్య భొదలు చేసి సాధన చతుష్టయ
సంపత్తి కలిగిని భక్తులను తయారు చేస్తారు వీరు…
. వేద గురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను
విశదీకరించి ఆచరింపజేస్తారు వీరు. .
. నిషిద్ద గురువులు : సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి
ధర్మాలను భోదిస్తారు వీరు.
. కామ్యక గురువులు : ధర్మ దాతలుగా సప్త సాధనాలు భోధిస్తారు.
త్యాగమూర్తులుగా, భక్తులుగా తన భక్తులను తయారు చేస్తారు.
5. భోధక గురువులు : వేదాంత గ్రంధ పరిచయం కలిగిస్తారు . భోధక
గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని చెప్తున్నారు. వారు…
నాద గురువులు : వీరి స్వరం ఎప్పుడైతే
శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .
చాయానిది గురువులు : చాయానిది ane ఒక
పక్షి వుందట . దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట.
ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు
ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు .
పరమ గురువులు : వీరు పరుసవేదిలా శిష్యుని
తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు
. చందన గురువులు : చందన వృక్షంలా జ్ఞాన
సుగుణాలను పంచుతారు వీరు.
క్రౌంచక గురువులు : :దూరంగా వుండి కూడా తన
గ్రుడ్లను పొదగా గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట . అదే విధంగా
క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను
చెయగలడు.
౬.. . వాచక గురువులు : సాంఖ్య ఉపదేశాలు భోధించి, పరమాత్మ
సత్యమని , దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.
7. కారణ గురువులు : ఆసనాలు, ప్రాఞాయామాలు చేయించి చివరకు జీవ
బ్రహ్మైక్య సంధానం భోదించి అద్వైత స్థితి ని కలిగిస్తారు.
౮.. సద్గురువులు : తెలుసుకోగల్గితే  గురువు-శిష్యుడు ఒక్కటే అని
తెలియజేస్తారు.
౯. నిజ గురువులు: పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా
చేస్తారు.
పురాణ పండ రంగనాథ్ గారు వ్యాసుని విశిష్టత వివరిస్తూ వ్రాసిన
వ్యాసం ఇది….. “గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి
నుండి జ్ఞానమనే వెలుగును నాలుగు వైపులకు నడిపించే శక్తి ఒకా గురువుకే
వుంది. .. అటువంటి గురువును పూజించడం మన సంప్రదాయం . ప్రతి సంవత్సరం
హిందువులు ఆషాడ పౌర్ణమి నాడు వేద వ్యాసుని జయంతిని గురు పౌర్ణమి
పేరుతొ జరుపుకుంటారు ” …బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ట మహా ముని,
ఆతని కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరునికి ,
మత్స్యగంధి సత్యవతి ద్వారా విశ్వ తేజస్సుతో జన్మించిన వాడే
వ్యాసుడు. తండ్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఏక రాశిగా వున్న వేదాన్ని
ఋక్, యజు, సామ, అధర్వణ అనే నాలుగు భాగాలుగా సులభ గ్రాహ్యం
చేసినందుకు ఆతడు వేద  వ్యాసుడు అయ్యాడు.
నావ యందు (ద్వైపాయనం ) జన్మించాడు కాబట్టి మరియు నలుపు రంగులో
వున్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరుగాంచాడు. పద్దెనిమిది
పురాణాలను, పద్దెనిమిది ఉప పురాణాలను, విజ్ఞాన సర్వస్వం ఐన
మహాభారతాన్ని, బ్రహ్మ సూత్రాలను, ఆధ్యాత్మ రామాయణమును
రచించి, కలియుగ మానవాళికి కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాలను
ఉపదేశించాడు ..
ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే
మానవ జీవిత వికాసం ఉందని వ్యాస మహర్షి భోదించాడు .
తాను జీవితమంతా గురు సేవ చేసిన సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా
పాటించాలని  . గురువును
పూజించడానికి వ్యాసుని జయంతి ఐన వ్యాస పౌర్ణమిని మించిన రోజు
లేదని భావించి, ఆ రోజును గురు పౌర్ణమిగా నిర్ణయించి పూజకు ఏర్పాట్లు
చేసుకున్నారు.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,