Skip to main content

Posts

Showing posts from August, 2021

గణపతి మరియు లక్ష్మీ హోమం పూజ సామగ్రి

                                               // శ్రీ రామ //  పసుపు 2 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 4  కిలోలు, కనుములు 2, చీర 1, పెద్ద అంచు గల  దోవతి 2 ,  గరిక కొంచెం  దారం బంతి 1  పూల దండలు  2 , విడిపూలు   అర్ధ కిలో,  కమలం పూలు,2   పంచామృతం కొంచెం,  గణపతి హోమానికి కుడుములు 108, (చిన్న సైజ్ లో ) హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి 1650 గ్రాములు,  హోమం పౌడర్ పాకెట్,  ఆగరబతి పాకెట్   ముద్ద కర్పూరం పాకెట్   హోమం నెయ్యి వేయటానికి మట్టి గిన్నె  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 3 ,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ , హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 100  , వక్కలు 35, ఖర్జూరం పండ్లు పాకెట్,  పూర్ణాహుతి పాకెట్ 1  ఇద్దరు బ్రాహ్మణ  స్వయం  పాకం మరియు  దక్షిణ 

శ్రీ వర లక్ష్మీ వ్రత కథ

  వరలక్ష్మీ వ్రత కథ:- పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ప్రాణేశ్వరా! స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్య స్త్ర

నూతన గృహ ప్రవేశ పూజ సామగ్రి వివరాలు

                                                                 // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, బియ్యం 4  కిలోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 100, సున్నం డబ్బి చిన్నది 1.  వక్కలు 45, ఖర్జూరం పండ్లు 35, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 2, ఇత్తడి గిన్నె ఆవు పాలు పొంగించటానికి. 1,  ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  అయిదు రకముల పండ్లు  ఆవు పాలు లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ అర్ధ  కిలో, మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి  రూపాయి నాణెములు 25, మామిడి కొమ్మలు, నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ ) గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, విస్తరి ఆకులు 10.  కొబ్

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి వివరాలు

                                       // జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  తమల పాకులు 50,  వక్కలు 21, ఖర్జూరం పండ్లు,  పసుపు కొమ్ములు 11,  అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం,  ఆరతి కర్పూరము,  పసుపు అక్షతలు,  మల్లె  పూలు 1/2  కిలో, , కొబ్బరి కాయ/కలశం మీదికి 1,  కొబ్బరికాయ అర్చనకు 1,  దీపారాధన కుంది - పెద్దది,  దీపారాధన కుంది - చిన్నది,  గంధం, గంట, హారతి పల్లెము,  వత్హులు, దీపారాదన కు  ఆవునెయ్యి,  అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧,  ఆవు పంచితం, ఆవు పేడ,  పంచామృతాలు,  అమ్మవారికి పీటము,  ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు,  బియ్యము కిలోన్నర    ఒక రవికె గుడ్డ,  అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,జాకెట్ ,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ),  వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే),  పత్తి ని   కాయిన్  గా   చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు,  పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అద్దిన  యగ్యోపవీతము,  ఆచమనం పాత్ర 1  కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, దాల్చిన చెక్కలు,శొంటి,పచ్చ కర్పూరం పొడి, కుంకుం పూవు,   కూర్చొను వారికి పీటలు,  నూతన వస్త్ర

షష్టి పూర్తి చేసుకొనే పద్దతి

  మానవుని జీవితములో అనూహ్య సంఘటనలు , అనుకోని పరిణామాలు ఎదురైనపుడు భీతి చేత స్పందించుట అతి సహజము. అట్టి పరిణామములు సంభవించకుండా అనాదిగా ,మానవాళి ఎన్నో ఉపాయములను , పద్దతులను పాటిస్తున్నది. అయితే ఆయా పద్దతులకు శాస్ త్ర ప్రమాణము , వేద ప్రమాణము అందినపుడు , వాటి విలువా , ఆచరణా కూడా పెరుగుతాయి. మానవ జీవితము లో సగము ఆయుర్దాయము గడచు ఘట్టము చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము , మానవుని పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అంతలోపల అన్ని గ్రహముల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. జాతకుడు పుట్టిన సంవత్సరమే ( నామ సంవత్సరము ) మరలా పునరావృత్తి అవుతుంది. అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరములో పుట్టి ఉంటే , అరవై యేళ్ళు నిండగనే అరవై ఒకటో సంవత్సరం మరలా ’ ప్రభవ ’ యే వస్తుంది. సగము ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఇక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా అనేకులు ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. ఆసమయములో   గ్రహ   సంధులవల్ల   కొన్ని   దోషాలు   కలుగవచ్చు .  దానితోపాటుగా ,  ఏ   జన్మలో   చేసిన   పాపపు   ఫలము   ఆజన్మములోనే   తీరునన్న   నమ్మకము   గలవారు ,  గడచిన