Skip to main content

Construction of Houses & precious time as per shaastraas

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం
మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు.
గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు.
ఇల్లు కట్టుకోవటానికి తగిన భూమిని పరీక్షించే పద్ధతిని కూడా ఇక్కడే వివరించాడు సూతుడు. గృహ నిర్మాణానికి ఎంచుకున్న భూమిని పరీక్షించాలనుకున్నప్పుడు పిడిమూక లోతు, అంతే పొడవు వెడల్పుతో చక్కగా ఒక గుంటను తవ్వాలి. ఆ గుంటను బాగా అలకాలి. ఒక పచ్చి మూకుడు తెచ్చి దానిలో నెయ్యి పోసి నాలుగు దిక్కులలో నాలుగు వత్తులను ఆ మూకుడులో ఉంచి వెలిగించి పొయ్యి మధ్యన ఉంచాలి. ఏ దిక్కున ఉన్న వత్తి బాగా కాంతితో వెలుగుతుందో గమనించాలి. తూర్పు దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే ఆ భూమి విప్రులకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే క్షత్రియులకు, పడమటది వైశ్యులకు, ఉత్తరం వైపుది శూద్రులకు శుభకరమైన భూమిగా భావించాలి. ఒకవేళ నాగులు దిక్కులలో ఉంచిన వత్తులు అన్నీ సరిసమానంగా బాగా ప్రకాశిస్తుంటే దాన్ని సామూహిక వాస్తు ప్రదేశం అంటారు. అలాంటి భూమి ఎవరైనా సరే ఇళ్ళు కట్టుకొని హాయిగా ఉండటానికి అనువైనది.
దీప పరీక్ష అయిన తరువాత ఆ తవ్విన మట్టితోనే ఆ గోతిని పూడ్చాలి. గొయ్యిని పూడ్చటానికి మన్ను ఎక్కువైతే అది శుభప్రదం. సరిగా సరిపోతే అది సమం. మట్టి తక్కువైతే మాత్రం మంచిది కాదు. అంటే ఆ భూమిలో గృహ నిర్మాణం చేయటం శుభప్రదం కాదు. గొయ్యిని పూడ్చిన తరువాత ఆ భూమినంతా నాగలితో దున్ని అన్ని విధాలైన (నవ ధాన్యాలను) విత్తనాలను చల్లాలి. ఆ విత్తనాలు మూడు రోజులకు మొలకెత్తితే శుభ ప్రదం. ఐదు రోజులకు మొలకెత్తితే మధ్యమం, ఏడు దినాలకు మొలకెత్తితే అది అధమం. అలా ఏడు దినాలకు మొలకెత్తిన ప్రదేశం గృహ నిర్మాణానికి పనికిరాదు. అని ఇలా మత్స్య పురాణంలో సూతుడు వాస్తు పురుష ఉత్పత్తి గురించి, గృహ నిర్మాణ పరీక్ష గురించి తెలియ చెప్పాడు. ఈ విషయాన్ని మన పూర్వుల నమ్మకంగా భావించవచ్చు. ఆనాటి వారి ఆచార వ్యవహారాలకు ఇదొక ఉదాహరణగా కనిపిస్తోంది. అయితే దీన్నే కొద్దిగా శాస్త్రీయ దృక్పధంలో పరిశీలించినా అవన్నీ పూర్తిగా గుడ్డి నమ్మకాలు కావని, పూర్వ రుషులు తమ జీవితానుభవాన్ని రంగరించి తపశ్శక్తిని మిళితం చేసి చెప్పినవేనని పురాణజ్ఞులు వివరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,