Skip to main content
శ్రీమన్ నాథమునులు జన్మ నక్షత్రం 5-7-2017 నాడు ఉంది. వీరనారాయణ పురంలో ఈశ్వర భట్టాళ్వార్ నకు జన్మించారు.వారికి రంగనాథముని మరియు నాథ బ్రహ్మర్ అని నామధేయములు కలవు. వారు అష్టాంగ యోగం మరియు దైవ సంగీతంలో నిష్ణాతులు. వీరే అరయర్ సేవని దివ్య దేశములలో ప్రవేశపెట్టారు. ఇప్పటికి మనం శ్రీ రంగం, ఆళ్వార్ తిరునగరి , శ్రీ విల్లిపుత్తూర్ లలో సేవించవచ్చును.
నాథమునులు వారి తండ్రి మరియు కుమారునితో ( ఈశ్వర ముని) కూడి మధుర, బృందావనం , గోవర్ధన గిరి, ద్వారక,బదరికాశ్రమం, నైమిశారణ్యం మొదలగు దివ్య దేశములకు వెళ్ళిరి. వారు గోవర్ధనపురం అనే ఊరిలో స్వామి యమునా నది రూపంలో ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డున ఉండిరి. ఒక రోజు స్వామి నాథమునులకు కలలో కాట్టుమన్నార్ గుడికి తిరిగి వెళ్ళమని ఆదేశించిరి . వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, పూరి , సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం ( అక్కడ మిగిలిన దివ్య దేశములు), తిరువహీంధ్రపురం, తిరుక్కోవలూరు, శ్రీ రంగం, కుంభకోణంలలో ఉన్న పెరుమాళ్ళకు మంగాళాశాసనము చేసి చివరికి వీరనారయణపురమమునకు చేరిరి.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-