Skip to main content

"సప్త చిరంజీవులు"

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. 1. అశ్వత్థాముడు 2. బలి చక్రవర్తి 3. వ్యాసుడు 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపుడు 7. పరశురాముడు వారిని స్మరిస్తూ చెప్పేదే సప్త చిరంజీవి శ్లోకం.


అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః 

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః 

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం 

జీవేద్వర్షశ్శతమ్ సోపి సర్వవ్యాధి వివర్జిత.


శ్రీ కృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి, లోక హితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మం వలన కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు. 


ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహంచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతి నిత్యం స్మరిస్తే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగుతోందని శాస్త్ర వచనం.

Comments