స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్ |సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే ||
ప్రతిపదార్థము
| సహస్రార | = | వేయి అరలు (ఆకులు) అనెడు |
| శిఖా | = | జ్వాలలతో (శిఖలతో) |
| అతి తీవ్రం | = | మిక్కిలి తీవ్రంగా |
| స్ఫురత్ | = | ప్రకాశిస్తుండే |
| భాస్కరకోటి | = | కోటి సూర్యుల కాంతితో |
| తుల్యం | = | సమానముగా వెలుగుతున్న |
| సురద్విషాం | = | (దేవతలకు విరోధులైన) అసురుల యొక్క |
| ప్రాణ | = | ప్రాణములను |
| వినాశి | = | నశింపజేయు |
| విష్ణోః | = | శ్రీ మహావిష్ణువు యొక్క |
| సుదర్శనం | = | సుదర్శనం అను పేరు కల్గిన |
| చక్రం | = | చక్రాయుధమును |
| అహం | = | నేను |
| సదా | = | ఎల్లప్పుడు |
| శరణం | = | ఉపాయముగా(రక్షకముగా) |
| ప్రపద్యే | = | ఆశ్రయించుచున్నాను |
తాత్పర్యము
రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును “ఆకు” లేక “అర” అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్నిశిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ “సుదర్శన చక్రమా” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్యరాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు. కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను.
యస్య ధ్వని ర్దానవ దర్ప హంతా |
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే ||
| విష్ణోః | = | శ్రీ మహావిష్ణువు యొక్క |
| ముఖ | = | ముఖము నుండి |
| ఉత్థ | = | వెలువడిన |
| అనిల | = | వాయువు చేత |
| పూరితస్య | = | నింపబడిన |
| యస్య | = | (ఏ) పాంచజన్య శంఖము యొక్క |
| ధ్వనిః | = | శబ్దము |
| దానవ | = | దానవుల యొక్క |
| దర్ప | = | గర్వమును |
| హంతా | = | అణచివేయునో |
| తం | = | అట్టి |
| శశికోటి | = | కోటి చంద్రుల కాంతి వలె |
| శుభ్రం | = | తెల్లనైన |
| పాంచజన్యం | = | పాంచజన్యమను పేరు గల |
| శంఖం | = | శంఖమును |
| సదా | = | నిరంతరం |
| అహం | = | నేను |
| శరణం | = | రక్షకముగా |
| ప్రపద్యే | = | ఆశ్రయించుచున్నాను |
తాత్పర్యము
శ్రీ మహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువుతోనిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవిసోకినంతనే రాక్షసమూకలందరి యొక్క గర్వములును అణగిపోవును. అట్టి భీకర ధ్వని నీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమనాటి చంద్రులకాంతి ఒక్కచోట చేరినదా యునునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులునీవి. శ్రీ విష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా నిన్ను నేను ఎల్లప్పుడూ శరణువేడుచున్నాను
కౌమోదకీం దైత్య కులైక హంత్రీమ్ |
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే ||
ప్రతిపదార్థము
| హిరణ్మయీం | = | బంగారుమయమై |
| మేరు | = | మేరు పర్వతముతో |
| సమాన | = | సమానమైన |
| సారాం | = | బలము కలిగిన |
| దైత్యకులైకహంత్రీమ్ | = | దానవ వంశమును నాశనము చేయునది |
| వైకుంఠ | = | వైకుంఠనాథుని యొక్క |
| వామాగ్రకర | = | ఎడమచేతి అగ్రభాగములో |
| అభిమృష్టాం | = | విరాజిల్లుచున్న |
| కౌమోదకీం | = | కౌమోదకీ అను పేరు గల |
| గదాం | = | గద అనే ఆయుధమును |
| సదా | = | నిరంతరం |
| అహం | = | నేను |
| శరణం | = | దిక్కు అని |
| ప్రపద్యే | = | నమ్ముచున్నాను |
తాత్పర్యము
బంగారమువలె స్పృహణీయమైన, మేరు పర్వతముతో సమానమైన బలము కల్గినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమునపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింది వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు “కౌమోదకీ” అను ఓ గదాయుధమా నిన్ను నే సదా శరణు వేడుచున్నాను.
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్ |
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే ||
ప్రతిపదార్థము
| రక్షో౽సురాణాం | = | రాక్షసుల యొక్కయు, అసురల యొక్కయు |
| కఠిన | = | కర్కశమైన |
| ఉగ్ర | = | ఉన్నతమైన |
| కంఠ | = | కంఠములను |
| ఛేద | = | ఛేదించుటచే |
| క్షరత్ | = | కారుచున్న |
| శోణిత | = | రక్తముతో |
| దిగ్ధ | = | తడిసిన |
| ధారమ్ | = | అంచు గల |
| హరేః | = | భగవంతుని యొక్క |
| ప్రదీప్తం | = | మిక్కిలి ప్రకాశిస్తున్న |
| నందకం | = | నందకం అని పేరు కలిగిన |
| తం | = | సుప్రసిద్ధమైన |
| ఖడ్గం | = | ఖడ్గమను ఆయుధమును(కత్తిని) |
| అహం | = | నేను |
| సదా | = | ఎల్లప్పుడు |
| శరణం | = | రక్షకముగా |
| ప్రపద్యే | = | వేడుచున్నాను |
తాత్పర్యము
జన్మతః రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండి అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధిచెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ, భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగ పిలువబడు వారియొక్కయు, క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని. తద్వారా నిరంతర ధారాప్రవాహముగ కారుచున్న రక్తముతో మరింత వాడిగ జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణుని దివ్య హస్తమందు ప్రకాశించు చున్నావు. “నందక”మను ఓ ఖడ్గరాజమా నిన్ను నే నెల్లప్పుడు శరణు వేడుచున్నాను.
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః |
భవంతి దైత్యాశని బాణవర్షి
శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే ||
ప్రతిపదార్థము
| యత్ | = | ఏ భగవంతుని ధనుస్సుకు సంబంధించిన |
| జ్యా | = | నారి యొక్క |
| నినాద | = | టంకారమును |
| శ్రవణాత్ | = | వినడం వలన |
| సురాణాం | = | దేవతల యొక్క |
| చేతాంసి | = | మనస్సులు |
| సద్యః | = | వెంటనే |
| నిర్ముక్త భయాని | = | భయము లేనివి |
| భవంతి | = | అగుచున్నవో |
| దైత్య | = | రాక్షసుల విషయములో |
| అశని | = | పిడుగుల వంటి |
| బాణ | = | బాణములను |
| వర్షి | = | వర్షించే |
| శార్ఙ్గం | = | శార్ఙ్గమను పేరు గల అట్టి ధనస్సును |
| సదా | = | ఎల్లప్పుడు |
| అహం | = | నేను |
| శరణం | = | రక్షకముగా |
| ప్రపద్యే | = | నమ్ముచున్నాను |
తాత్పర్యము
దేవ దానవ భీకర సంగ్రామములలో నీ నారిని సారించుటచే బయల్వెడలిన ధ్వని (జ్యా ఘోషము) చెవి సోకినంతనే దేవతల మనస్సులో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును. జయము కల్గును. రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్య హస్తమున ప్రకాశించు శార్ఙ్గమనెడి ఓ ధనస్సా నిన్ను నే నెల్లప్పుడూ శరణు వేడుచున్నాను.
స్తవం పఠేత్ యో೭నుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి ||
ప్రతిపదార్థము
| హరేః | = | శ్రీమన్నారాయణుడి యొక్క |
| పంచమహాయుధానాం | = | ఐదు మహా ఆయుధములకు సంబంధించిన |
| ఇమం | = | ఈ |
| స్తవం | = | స్తోత్రమును |
| ప్రభాతే | = | ప్రాతఃకాలమున |
| అనుదినం | = | ప్రతిరోజు |
| యః | = | ఎవడు |
| పఠేత్ | = | చదువుకొనునో |
| తస్య | = | వాని యొక్క |
| సమస్త దుఃఖాని | = | అన్ని దుఃఖములు |
| భయాని | = | భయములు |
| పాపాని | = | పాపములు కూడా |
| సద్యః | = | వెంటనే |
| నశ్యంతి | = | నశించును |
| సుఖాని | = | సుఖములు |
| సంతి | = | చేకూరును |
తాత్పర్యము
శ్రీ హరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినమూ అనుసంధించు వారియొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దుఃఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.
యదృచ్ఛయాపత్సు మహాభయేషు |
ఇదం పఠన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః ||
ప్రతిపదార్థము
| వనే | = | అడవిలో దారితప్పినగాని, క్రూరజంతువుల బారిన పడిన గాని |
| రణే | = | యుద్ధరంగమున చిక్కుకున్నగాని |
| శత్రుమధ్యే | = | శత్రువుల మధ్యగాని |
| జల | = | నీటిగండములో గాని |
| అగ్ని | = | అగ్నిప్రమాదమేర్పడిన గాని |
| యదృచ్ఛయా | = | తలవని తలంపుగా వచ్చిన |
| ఆపత్సు | = | ఆపత్తులలోను |
| మహాభయేషు | = | గొప్ప భయస్థితులలోగాని |
| అనాకులాత్మా | = | నిశ్చలచిత్తము కలవాడై |
| ఇదం | = | ఈ |
| స్తోత్రం | = | పంచాయుధ స్తోత్రమును |
| పఠన్ | = | చదువుకొన్నవాడు |
| తత్కృత | = | ఆ పంచాయుధములచే లభించిన |
| సర్వ రక్షః | = | అన్ని విధాల రక్షణ కలవాడై |
| సుఖీ | = | సుఖము కలవాడు |
| భవేత్ | = | కాగలడు |
తాత్పర్యము
అడవులలో దారితప్పి, జంతువుల బారినపడి, యుద్ధములో చిక్కుకొని, నీటి ప్రమాదమేర్పడి, అగ్ని ప్రమాదమేర్పడిగాని భయగ్రస్తులయినా, లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ యితర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ అయిదు ఆయుధములను మనసార స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును.
పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నమ్ |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే ||
ప్రతిపదార్థము
| స శంఖ చక్రం | = | శంఖ చక్రములను ధరించినవాడు |
| సగదాసి శార్ఙ్గం | = | గదతో కూడా ఖడ్గమును, ధనుస్సును కూడా ధరించినవాడు |
| పీతాంబరం | = | పచ్చని వస్త్రమును ధరించినవాడు |
| కౌస్తుభ | = | కౌస్తుభమణిని |
| వత్స | = | శ్రీవత్సమనెడి పుట్టుమచ్చను |
| చిహ్నమ్ | = | గుర్తుగా కలవాడు |
| శ్రియా | = | లక్ష్మీదేవితో |
| సమేత | = | కలసి ఉండటం చేత |
| ఉజ్జ్వల | = | దేదీప్యమానముగా |
| శోభిత | = | ప్రకాశించుచున్న |
| అంగం | = | దివ్యమంగళ విగ్రహము కల |
| విష్ణుం | = | శ్రీ మహావిష్ణువును |
| అహం | = | నేను |
| సదా | = | ఎల్లప్పుడు |
| శరణం | = | రక్షకముగా |
| ప్రపద్యే | = | వేడుకొనుచున్నాను |
తాత్పర్యము
భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్ఙ్గములను పంచాయుధములను ధరించి, పీతాంబరముతో వెలుగొందుచు, కౌస్తుభమణిని ధరించి శ్రీ వత్సమనెడి పుట్టుమచ్చతో విరాజిల్లు, శ్రీదేవి సదా సన్నిధిచేరి యుండుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలి మబ్భు వలె దేదీప్యమానమగు దివ్య సుందర మంగళవిగ్రహ విశిష్టుడును అగు శ్రీ మహావిష్ణువును నేనెల్లప్పుడూ సేవించుచున్నాను..
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ||
ప్రతిపదార్థము
| జలే | = | నీటి గండమునందు |
| వారాహః | = | వరాహమూర్తి |
| రక్షతు | = | రక్షించుగాక |
| స్ధలే | = | భూమి పై తటస్థించు ఉపద్రవములలో |
| వామనః | = | వామన భగవానుడు |
| రక్షతు | = | రక్షించుగాక |
| అటవ్యాం | = | మహారణ్యములో కలిగే దుఃఖములో |
| నారసింహః చ | = | నరసింహస్వామియును |
| రక్షతు | = | రక్షించుగాక |
| సర్వతః | = | చిక్కులన్నింటినుండి |
| కేశవః | = | కేశవుడు |
| పాతు | = | రక్షించుగాక |
తాత్పర్యము
జలము నందెల్లపుడూ ఏ ఆపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక భూమి పై ఏ ప్రమాదములు సంభవించకుండు నట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక. అడవులలో ఘోర ప్రమాదము లలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక బ్రహ్మకు శివునికి తన దేహమందే స్ధానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక.
Comments
Post a Comment