ఈ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. హిందువులు ఈ ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. ఈరోజునే దుర్గాదేవి ముర అనే రాక్షసుడుని సంహరించి ఏకాదశి మాతగా పిలువబడింది. ఈరోజున శ్రీమహావిష్ణువుతోపాటు తులసి దేవిని పూజిస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల మీ యెుక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి.
ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 15 నవంబర్ 2025న రాత్రి 12:49కి ప్రారంభమై..నవంబర్ 16న రాత్రి 2:37కి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకోనున్నారు. ఉత్పన్న ఏకాదశి నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండబోతుంది. దీంతోపాటు విష్కుంభ యోగం కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ఏకాదశికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. పైగా ఇదే రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:27 వరకు ఉంటుంది.
ఈ ఏకాదశి వ్రతాన్ని పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పాటిస్తారు. దీని వల్ల మీ జీవితంలో శాంతిపాటు ఆనందం కూడా ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణువుకు పసుపు రంగు వస్తువులను సమర్పించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్దిగా ఉపవాసం చేయలేకపోతే ఉదయాన్నే తేలిక పాటి ఆహారాన్ని తీసుకోండి. ధాన్యాలు, బియ్యం వంటి తీసుకోవడం మానుకోండి. మనస్సును దేవుడిపై లగ్నం చేసి ప్రశాంతంగా ఉండండి.
Comments
Post a Comment