Skip to main content
రాగి పాత్రల విశిష్టత
దైవ పూజలో తామ్ర పాత్ర (రాగి పాత్ర)లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలీ ప్రశ్నను భూదేవే వరాహ రూపుడైన నారాయణుడిని తొలిగా అడిగింది. అప్పుడు రాగి అంటే తనకెందుకు ఇష్టమో ఇలా వివరించాడు ఆ నారాయణుడు.
రాగి పవిత్ర వస్తువులన్నిటిలోకీ పవిత్రమైంది. అది సంసారం నుంచి ముక్తిని కలిగిస్తుంది. దీక్ష తీసుకొన్న వారు, విశుద్ధులు అయిన వారు నారాయణుడికి సంబంధించి అన్ని కార్యాలలోనూ రాగినే ఉపయోగించాలి.
పూర్వం ఏడువేల యుగాల కిందట గుడాకేశుడు అనే ఓ మహా రాక్షసుడు రాగి రూపాన్ని ధరించి విష్ణువును ఆరాధిస్తూ ఉండేవాడు. కావటానికి మహా రాక్షసుడే కానీ గొప్ప భక్తుడతడు. పదహారు వేల ఏళ్ళ పాటు గుడాకేశుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అతడున్న తామ్రాశ్రమం అనే ఆశ్రమానికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. తపస్సుకు మెచ్చినట్లు చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు ఎంతో ధర్మబుద్ధితో, భక్తి ప్రపత్తులతో దేవదేవుడికి నమస్కరించి స్తుతి చేశాడు. తనకు వేరే భోగభాగ్యాలేవీ అక్కరలేదని, సుదర్శన చక్రంతో తన శరీరాన్ని ఛేదించి తన ప్రాణాలను విష్ణువులో కలుపుకోమన్నాడు. ఆ తర్వాత తన శరీరం విష్ణు పూజలో ఉపకరించాలని, దానితో చేసిన పాత్రలు నారాయణ పూజలో వాడే పవిత్ర వస్తువులు కావాలని కోరాడు ఆ రాక్షసుడు. శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడి కోర్కెను అనుగ్రహిస్తూ వైశాఖ శుక్ల పక్ష ద్వాదశినాడు మధ్యాహ్న సమయంలో తన సుదర్శన చక్రం ఆ రాక్షసుడి శరీరాన్ని ఛేదిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
గుడాకేశుడు నారాయణుడు చెప్పిన ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తూ నిరంతరం విష్ణు పదసేవలో నిమగ్నమవుతూ వచ్చాడు. ఆ క్షణం రానే వచ్చింది. భక్తుడు కోరిన కోర్కెను తీర్చింది. మహారాక్షసుడి ప్రాణాలు నారాయణుడిలో లీనమయ్యాయి. అతడి శరీర మాంసం అంతా రాగి అయింది. రక్తం తగరం గానూ, ఎముకలు బంగారంగానూ, మలినం కంచుగానూ అయింది.
తనలో లీనమవ్వాలని నిస్వార్థ భక్తితో భక్తుడు కోరిన కోర్కెను తీర్చేందుకే విష్ణువు రాగిని అంత పవిత్రమైనదిగా అనుగ్రహించాడు. రాగి పాత్రలో నివేదించిన ఒక్క మెతుకును స్వీకరించినా ఎన్నెన్నో జన్మల పాపం నశించి పుణ్యం ప్రాపిస్తుంది. అది శుద్ధాలలో శుద్ధం, మంగళాలలో మంగళం.
ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంటుంది. నిజంగా రాగి అనే లోహం అలాగే పుట్టిందా? మహారాక్షసుడైన వాడిని భగవంతుడు అనుగ్రహించమేమిటి? అనే తీరులో ఆలోచించకుండా హేతుబద్ధంగా ఆలోచించినా ఇక్కడ ఓ చక్కటి సందేశమే కనిపిస్తుంది. భగవంతుడైన నారాయణుడి దృష్టిలో సకల ప్రాణులూ సమానమే. గుడాకేశుడు వాస్తవానికి మహా రాక్షసుడే. అయితేనేమి రాక్షస సహజమైన దుర్మార్గాలకతడు పాల్పడకుండా కేవలం దైవభక్తితోనే జీవితాన్ని సాగించాడు. ఇతర రాక్షసులలాగా తీవ్రంగా తపస్సు చేసి దేవతలకు ఇబ్బంది కలిగించే వరాలనేవీ కోరుకోలేదు. తను మరణించినా, తన శరీరం కూడా దైవసేవకే ఉపకరించాలన్నాడు. తన ప్రాణాలు దైవంలోనే లీనమవ్వాలన్నాడు. ఇలాంటి భక్తితత్వాన్నే ఏ కాలంలోని భక్తులైనా కోరుకోవాలని సూచించటం ఇక్కడ కనిపించే సందేశం. ఈ కథంతా వరాహ పురాణం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,