Skip to main content
రాగి పాత్రల విశిష్టత
దైవ పూజలో తామ్ర పాత్ర (రాగి పాత్ర)లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలీ ప్రశ్నను భూదేవే వరాహ రూపుడైన నారాయణుడిని తొలిగా అడిగింది. అప్పుడు రాగి అంటే తనకెందుకు ఇష్టమో ఇలా వివరించాడు ఆ నారాయణుడు.
రాగి పవిత్ర వస్తువులన్నిటిలోకీ పవిత్రమైంది. అది సంసారం నుంచి ముక్తిని కలిగిస్తుంది. దీక్ష తీసుకొన్న వారు, విశుద్ధులు అయిన వారు నారాయణుడికి సంబంధించి అన్ని కార్యాలలోనూ రాగినే ఉపయోగించాలి.
పూర్వం ఏడువేల యుగాల కిందట గుడాకేశుడు అనే ఓ మహా రాక్షసుడు రాగి రూపాన్ని ధరించి విష్ణువును ఆరాధిస్తూ ఉండేవాడు. కావటానికి మహా రాక్షసుడే కానీ గొప్ప భక్తుడతడు. పదహారు వేల ఏళ్ళ పాటు గుడాకేశుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అతడున్న తామ్రాశ్రమం అనే ఆశ్రమానికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. తపస్సుకు మెచ్చినట్లు చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు ఎంతో ధర్మబుద్ధితో, భక్తి ప్రపత్తులతో దేవదేవుడికి నమస్కరించి స్తుతి చేశాడు. తనకు వేరే భోగభాగ్యాలేవీ అక్కరలేదని, సుదర్శన చక్రంతో తన శరీరాన్ని ఛేదించి తన ప్రాణాలను విష్ణువులో కలుపుకోమన్నాడు. ఆ తర్వాత తన శరీరం విష్ణు పూజలో ఉపకరించాలని, దానితో చేసిన పాత్రలు నారాయణ పూజలో వాడే పవిత్ర వస్తువులు కావాలని కోరాడు ఆ రాక్షసుడు. శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడి కోర్కెను అనుగ్రహిస్తూ వైశాఖ శుక్ల పక్ష ద్వాదశినాడు మధ్యాహ్న సమయంలో తన సుదర్శన చక్రం ఆ రాక్షసుడి శరీరాన్ని ఛేదిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
గుడాకేశుడు నారాయణుడు చెప్పిన ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తూ నిరంతరం విష్ణు పదసేవలో నిమగ్నమవుతూ వచ్చాడు. ఆ క్షణం రానే వచ్చింది. భక్తుడు కోరిన కోర్కెను తీర్చింది. మహారాక్షసుడి ప్రాణాలు నారాయణుడిలో లీనమయ్యాయి. అతడి శరీర మాంసం అంతా రాగి అయింది. రక్తం తగరం గానూ, ఎముకలు బంగారంగానూ, మలినం కంచుగానూ అయింది.
తనలో లీనమవ్వాలని నిస్వార్థ భక్తితో భక్తుడు కోరిన కోర్కెను తీర్చేందుకే విష్ణువు రాగిని అంత పవిత్రమైనదిగా అనుగ్రహించాడు. రాగి పాత్రలో నివేదించిన ఒక్క మెతుకును స్వీకరించినా ఎన్నెన్నో జన్మల పాపం నశించి పుణ్యం ప్రాపిస్తుంది. అది శుద్ధాలలో శుద్ధం, మంగళాలలో మంగళం.
ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంటుంది. నిజంగా రాగి అనే లోహం అలాగే పుట్టిందా? మహారాక్షసుడైన వాడిని భగవంతుడు అనుగ్రహించమేమిటి? అనే తీరులో ఆలోచించకుండా హేతుబద్ధంగా ఆలోచించినా ఇక్కడ ఓ చక్కటి సందేశమే కనిపిస్తుంది. భగవంతుడైన నారాయణుడి దృష్టిలో సకల ప్రాణులూ సమానమే. గుడాకేశుడు వాస్తవానికి మహా రాక్షసుడే. అయితేనేమి రాక్షస సహజమైన దుర్మార్గాలకతడు పాల్పడకుండా కేవలం దైవభక్తితోనే జీవితాన్ని సాగించాడు. ఇతర రాక్షసులలాగా తీవ్రంగా తపస్సు చేసి దేవతలకు ఇబ్బంది కలిగించే వరాలనేవీ కోరుకోలేదు. తను మరణించినా, తన శరీరం కూడా దైవసేవకే ఉపకరించాలన్నాడు. తన ప్రాణాలు దైవంలోనే లీనమవ్వాలన్నాడు. ఇలాంటి భక్తితత్వాన్నే ఏ కాలంలోని భక్తులైనా కోరుకోవాలని సూచించటం ఇక్కడ కనిపించే సందేశం. ఈ కథంతా వరాహ పురాణం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.