మృగశిర కార్తె 8-6-2016 వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరిజల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు. ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు. ఈ నక్షత్రం దేవగణానికి చెందినది. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. ఇంగువ బెల్లం కలిపిన మిశ్రమం గులికను పరిగడుపున వేసుకోవాలి.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, తమల పాకులు 100 , వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 , టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, అరటి పండ్లు 2 డజన్ అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, ఆవు పంచితం, 100 ml కర్పూరం పాకెట్ మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8. రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1, దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి బిళ్ళలు 25 పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, గరిక కొంచెం 1 కట్
Comments
Post a Comment