Skip to main content

మాఘ మాసం సూర్య నమస్కారాలు


ఓం సూర్య నారాయణాయ నమః
తేది 25-1-2020 శనివారం నుండి మాఘ మాసం ప్రారంభం. ఈనెల  ప్రతి రోజు  ఆదిత్యహృదయం పారాయణతో పాటు సూర్య నమస్కారాలు  మొదలుపెడదాము
రామరామ మహాబాహో,శృణుగుహ్యంసనాతనం
యేన సర్వా నరీన్వత్స, సమరే విజయిష్యసి//
ఓ రఘుకుల రామా! పరశురాముని బలాన్నికూడా తీసుకొని ద్విగుణీకృతబలముతోప్రకాశిస్తున్న రామా !శతృవులనుయుధ్ధములో సునాయాసముగా జయించి విజయాన్నిపొందడానికి ఉపయోగపడే సనాతనమైనది రహస్యమైన (ఓ)ఈస్తోతా్రన్ని విను.
శ్రీ రమద్వాల్మీకిరామాయణంలోయుధ్దకాండలో 107 ౧౦౭ సర్గరామరావణ యుధ్ధాన్నిచూడటానికి ఆకాశమార్గం లో దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహర్షి రాముని వద్దకు వచ్చి ఆదిత్య హృదయస్తోతా్రన్ని ఉపదేశిస్తాడు.
సూర్యోపాసన వల్లమహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుఅక్షయపాత్రని పోందేడుట;మహాభాగవతం దశమస్కందం లో సతా్రజిత్తుకుశ్యమంతకమణి దొరికిందిట;
ఋక్షరజస్సు అనే వానరానికి సుగీ్రవుడు, కుంతీదేవికి కర్ణుడు పుత్రులుగా  దొరికేరుట;అంతెందుకు తేజస్సు కావాలంటే సూర్యోపాసన, సుఖం కావాలంటే సూర్యోపాసన, యశస్సు కావాలంటే సూర్యోపాసన_ ఒకటేమిటి సూర్యభగవానుడు సాక్షాత్తు ఆరోగ్యదేవత కదా_ ఏదికావాలంటే అదేపొందచ్చు.
కృష్ణునికి జాంబవతికి పుట్టినసాంబుడు దూర్వాసుని శాపం వల్లకుష్టురోగి అయితే సూర్యోపాసన చేసి నిరోగి, సుందరాంగుడిగా మారాడుట.
సూర్యోపాసనతో బాహ్యాభ్యంతర తిమిరాన్ని పారదో్రలి సాధనలో జ్జానజ్యోతిని సత్వరం దర్శించుకోడానికి వీలవుతుంది అంటారు విజ్ఞులు.  అలాంటి ఆదిత్యహృదయాని్న ఒక్కసారి పరికిద్దాం.
ఆదిత్యహృదయం లో మొత్తం 31 శ్లోకాలు, వెరసి వెయ్యి అక్షరాలు ఉన్నాయి.
మొదటి తొమ్మిది శ్లోకాలు నుతి (స్తుతి) అంటే ఈశ్వరారాధనలో నమకం లాంటివి.
చివరి 10 శ్లోకాలు శ్తోత్ర మాహాత్మ్యం తెలియ చేస్తాయి.

ఇంకమధ్యలో వున్న 12 శ్లోకాలు ద్వాదశాదిత్యులన్న మాట.అంటే మన పారాయణకి 6వ శ్లోకం రశ్మిమంతం సముద్యంతం  నుంచి మొదలుపెడితే 24వ శ్లోకంవేదాశ్చ క్రతవశ్చైవ వరకూ చె ప్పుకొంటే చాలు.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-