దీపావళి పూజ ఏర్పాట్లు, పూజా విధానం దీపావళి నిత్య కృత్యాలు: ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది ఈరోజు చేయకూడనిది: మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం. ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు : గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము. పూజించే విధానం, ఇంట్లో పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని పోయాలి, దారంతో చెప్పిన కలశాన్ని అలంకరించి కొబ్బరికాయతో స్థాపన చేయాలి. లక్ష్మీదేవి ఫోటోలు పెట్టాలి. అమ్మ వారికి ధరింప చేయవలసినవి కాటుక అద్దం చెక్క దువెన ఎరుపు రంగు గాజులు మొదలైన అలంకరణ సామాగ్రి. అభిషేకము పంచామృతంతో చేయాలి అనగా ఆవుపాలు ఆవుపెరుగు ఆవునెయ్యి తేనె మరియు పంచదారలతో అభిషేకించాలి. అమ్మవారికి చేయవలసిన నైవేద్యము కొబ్బరికాయ అరటిపండ్లు పాయసాన్నము పంచఫలములు అనగా అయిదు రకాల పండ్లు అమ్మవారికి నివేదించాలి. మారేడు పత్రితో లక్ష్మీదేవిని పూజించడం మరింత శుభకరం. కర్పూర హారతి తో లక్ష్మీ దేవి మంగళ హారతి పాట పాడాలి. వ్యాపార గృహం అయినట్లయితే మంచి గుమ్మడితో దిష్టితీసి కొట్టాలి.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, తమల పాకులు 100 , వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 , టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, అరటి పండ్లు 2 డజన్ అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, ఆవు పంచితం, 100 ml కర్పూరం పాకెట్ మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8. రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1, దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి బిళ్ళలు 25 పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, గరిక కొంచెం 1 కట్
Comments
Post a Comment