Skip to main content

1897 అంటువ్యాదుల నివారణ చట్టం అమలు


కోవిడ్-19 వ్యాధికి గురైన బాధితులు వైద్యం తీసుకోకుండా పారిపోకుండా ఉండేందుకు లేదా నిర్బంధంలో ఉండటానికి నిరాకరించినపుడు వారిని అదుపులోకి తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)-1897ని అమలు చేసింది. ఇది 123 ఏళ్ల నాటి చట్టం.
కర్ణాటకలోని మంగళూరులో కరోనావైరస్ లక్షణాలు గుర్తించిన ఒక రోగి హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి పారిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది.
రైలు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రయాణించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించే హక్కు అధికారులకి ఉంటుంది.
వ్యాధి సోకిన రోగులను హాస్పిటల్లో విడిగా ఉంచవచ్చు.
పరీక్షలు నిర్వహించే అధికారి ఎవరికైనా వ్యాధికి గురైన అనుమానితులను అదుపులోకి తీసుకుని వైద్యం అందించే హక్కు ఉంటుంది.
ఎవరికైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వారిని అదుపులోకి తీసుకుని నిర్బంధంలో పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
ఈ చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష ఏమిటి
ఈ చట్టాన్ని ధిక్కరించిన వారికి భారతీయ శిక్షా స్మృ తిలోని సెక్షన్ 188 ప్రకారం శిక్ష విధించవచ్చు.
చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు వీలులేదు.
ఈ చట్టం ప్రకారం... ఎవరైనా రోగి వైద్యం తీసుకోవడానికి గాని, అది మరింత వ్యాప్తి చెందకుండా నిర్బంధంలోకి వెళ్ళడానికి నిరాకరించినా అటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుని చికిత్స అందించే అధికారం ఉంటుంది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు నుంచి 14 రోజుల వరకు రోగిని అదుపులో ఉంచవచ్చు.
సెక్షన్ 188 ప్రకారం... ఎవరి ప్రాణానికైనా భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-