అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు. ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు. కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రా
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com