Skip to main content

Posts

Showing posts from September, 2024

అనంత పద్మ నాభ స్వామి వ్రతం తేదీ 17-9-2024 మంగళవారం

  అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు. ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు.  కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కింద విశ్రా

వామన జయంతి తేదీ 15-9-2024 ఆదివారం

  త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా పరిగణించబడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడడం కోసం శ్రీ మహా విష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. వాటిల్లో రామ, కృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అయితే శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన ఇతర అవతారాలను కూడా పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారం వామన అవతారం.  విష్ణువు ఈ అవతారం దేవతలను, విశ్వాన్ని రక్షించడానికే.. అందుకే ఈ అవతారం వర్ణన జానపద కథల్లో వినిపిస్తుంది. భూమిపై రాక్షస రాజు బలి ప్రభావం పెరిగి.. దేవతలలో ఆందోళన నెలకొంది. అప్పుడు బలి గర్వాన్ని అణచడానికి, అతనికి గుణపాఠం చెప్పడానికి శ్రీ మహా విష్ణువు వామనుడిగా జన్మించాడు. అదితి, ఋషి కశ్యపుల కుమారుడిగా విష్ణువు (వామనుడు) జన్మించాడు. పురాణ కథ ఏమిటంటే పురాణాల ప్రకారం రాక్షస రాజు బాలి శక్తి పెరిగేకొద్దీ..అతనిలో క్రూరత్వం కూడా పెరిగింది. అప్పుడు మానవులపైనే కాదు దేవతలపై కూడా తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు బాల వటువు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఓ యాగం జరుగుతోంది. యాగ సమయంలో దేవ గురువు శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు.

పరివర్తని ఏకాదశి తేదీ 14-9-2024 శనివారం

  వివాహిత స్త్రీలకు ఈ వ్రతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఏదైనా శుభ యోగంలో పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ రోజున ఉపవాసం మరియు విష్ణువును ఆరాధించడం వల్ల కష్టాలు మరియు బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటం ద్వారా విష్ణువును ధ్యానిస్తారు. ఈ ఏకాదశిని పరివర్తినీ ఏకాదశి అంటారు. పరివర్తినీ ఏకాదశి శుభ యోగం పరివర్తిని ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ రోజు సాయంత్రం 6.18 గంటల వరకు శోభన యోగం ఉంటుంది. దీనితో పాటు సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి 8:32 నుండి 06:06 వరకు సర్వార్థ సిద్ధి యోగం, ఉదయం 06:06 నుండి 08:32 వరకు రవియోగం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత శ్రవణా నక్షత్రం కనిపిస్తుంది. ఈ యోగాలు మరియు రాశులు శుభప్రదంగా పరిగణించబడతాయి, దీనిలో చేసిన పని విజయవంతం అవుతుంది. మరియు జీవితంలో తెలియక చేసిన పాపాలు నశించి కోరికలు తీరుతాయి. విష్ణువు అనుగ్రహం వలన దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్య దీవెనలు లభిస్తాయి. పరివర్తినీ ఏకాదశి న

రాధాష్టమి తేదీ 11-9-2024 బుధవారం

  సంస్కృత గ్రంథం పద్మ పురాణం (సంపుటి 5) లోని భూమి ఖండాలోని 7 వ అధ్యాయం రాధాష్టమి పండుగకు సంబంధించిన వివరణాత్మక సమాచారం , ఆచారాలను అందిస్తుంది. స్కంద పురాణంలోని విష్ణు ఖంశంలో, కృష్ణ భగవానునికి 16,000 మంది గోపికలు ఉన్నారని, వారిలో రాధా దేవి అత్యంత ప్రముఖమైనది అని పేర్కొన్నారు. వృషభాను మహారాజు, అతని భార్య కీర్తిదలు చెరువులోని బంగారు తామరపై రాధా దేవిని కనుగొన్నారు. జానపద గాథల ప్రకారం, కృష్ణుడు స్వయంగా తన ముందు ప్రత్యక్షమయ్యే వరకు రాధ ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు తెరవలేదు.  ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు. ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్

Dhanvantari Homam for recovery to good health