వరలక్ష్మి వ్రతము ఆచరించు దినమున గృహిణులు తమ యింటిని శుబ్రముగా కడిగి, తల స్నానము చేసి, యింటిని ముగ్గులతోను, మామిడి తోరనములతోను,అనంకరించి, శుబ్రమయిన పట్టు వస్త్రములు/మది వస్త్రములు కట్టుకొని, కొబ్బరికాయతో వరలక్ష్మి దేవి ప్రతిమను చేసి, కలశము పయిన వుంచి, అలంకరించి షోడశోప చార పూజలు మధ్యాన్న సమయమున చేస్తారు. రాత్రి/సాయంకాల సమయమునందు దీపారాధన చేసి మరల షోడశ ఉపచార పూజలు చేసి ముత్హయిదువు లకు పసుపు, కుంకుమ తాంబూలము, పండ్లు, యిచ్చి గౌరవించుట సాంప్రదాయము.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment