Skip to main content
ప్రశ్న శాస్త్రం ద్వారా తప్పిపోయిన వాళ్ళను కనుక్కోవటం
ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.
ప్రశ్న అడిగినవారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు.
లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు ఆ వ్యక్తి వెళ్లిన చోట స్థిరముగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎటువంటి సమస్యా లేదని కూడా చెప్పచ్చు.
చర రాశులైన మేష, కర్కాటక, తుల, మకరములలో ఒకటి లగ్నము అయి ఎక్కువ షడ్వర్గులు చర వర్గులు అయిన యెడల వెళ్లిన మనిషి వెళ్లిన చోట స్థిరముగా లేరు అని చెప్పాలి.తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండచ్చు.
ద్విస్వభావ రాశులు అయిన మిథున, కన్య, ధను, మీన రాశులలో ప్రశ్న అడిగిన యెడల వెళ్లిన వ్యక్తి యొక్క లక్షణము కూడా చంచల్యము ద్వంద్వముగా వున్నది అని చెప్పవలెను. లగ్నమును పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్రులలో ఎవరు చూచిననూ లేదా లగ్నములో వున్ననూ సంపూర్ణ శుభ ఫలము చెప్పవలెను. అనగా వెళ్లినచోట సుఖముగా వున్నారు. ఇబ్బంది పడటం లేదు అని చెప్పాలి.
లగ్నములో పాపగ్రహములు వున్నను, పాప గ్రహములు లగ్నమును చూచినను వెళ్లిన చోట మనిషి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. స్థిర లగ్నములలో పాప గ్రహములు వున్నవి అనుకోండి మనిషి వెళ్లినచోట స్థిరముగా ఉండి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అదే రీతిగా శుభగ్రహాలు వున్న చర లగ్నంలో ప్రశ్న అడిగిన యెడల చలనం కోరుకుంటున్నారు. అది మంచి ఫలితమే సూచించనున్నదని చెప్పాలి.
ద్విస్వభావ లగ్నాలకు పాపగ్రహం సంబంధం పాప ఫలితాలను, శుభ గ్రహ సంబంధం శుభ ఫలితాలను సూచిస్తుంది. లగ్నాధిపతితో కలిసి 5 డిగ్రీలలో వేరే ఏదేని గ్రహం ఉన్న యెడల వెళ్లిన వ్యక్తికి తోడుగా వేరేవారు కూడా వున్నారు అని చెప్పచ్చు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-