Skip to main content
వైశాఖ మాసం కృష్ణ‌ పక్షంలో వచ్చే ఏకాదశి ( apara ekaadashi ) ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి సోమవారం నాడు వస్తుంది. అనేక దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది పవిత్రమైన సమయం. అలాగే సోమవారం కూడా శివుడికి మరియు మహా విష్ణువు కు  ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కి  ఏడు రకాల వస్తువులతో అభిషేకం చేస్తే అపజయాల బాట వీడి విజయాలు సాధిస్తారు.

శ్రీ మహా విష్ణువు పై గంగా జలాన్ని పోస్తూ ఓ నమో నారాయణాయ  మంత్రాన్ని ఉచ్ఛరించాలి. దీని వల్ల మనసు, శరీరంలోని మలినాలు తొలిగి స్వచ్ఛంగా ఉంటారు.
అవివాహితులు పంచామృతాల్లో ఒకటైన తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి భార్య లేదా భర్త లభిస్తారు.

నెయ్యితో అభిషేకం చేస్తే ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే 108 సార్లు అష్టాక్షరి  మంత్రాన్ని జపించాలి.

అత్తరుతో శ్రీ విష్ణు ప్రతిమకు  అభిషేకం చేస్తే చుట్టూ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గి మంచి ఆలోచనలు కలుగుతాయి.

చందనంతో శ్రీ మహా విష్ణు ప్రతిమ పై మూడు నామాలను దద్దితే అపార సంపదలు కలుగుతాయి.

పెరుగుతో అభిషేకం చేస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

కుంకుమ పువ్వును నీటిలో కలిపి శ్రీ మహావిష్ణువు ను  అభిషేకిస్తే మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-