Skip to main content
వైశాఖ మాసం కృష్ణ‌ పక్షంలో వచ్చే ఏకాదశి ( apara ekaadashi ) ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి సోమవారం నాడు వస్తుంది. అనేక దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది పవిత్రమైన సమయం. అలాగే సోమవారం కూడా శివుడికి మరియు మహా విష్ణువు కు  ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కి  ఏడు రకాల వస్తువులతో అభిషేకం చేస్తే అపజయాల బాట వీడి విజయాలు సాధిస్తారు.

శ్రీ మహా విష్ణువు పై గంగా జలాన్ని పోస్తూ ఓ నమో నారాయణాయ  మంత్రాన్ని ఉచ్ఛరించాలి. దీని వల్ల మనసు, శరీరంలోని మలినాలు తొలిగి స్వచ్ఛంగా ఉంటారు.
అవివాహితులు పంచామృతాల్లో ఒకటైన తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి భార్య లేదా భర్త లభిస్తారు.

నెయ్యితో అభిషేకం చేస్తే ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే 108 సార్లు అష్టాక్షరి  మంత్రాన్ని జపించాలి.

అత్తరుతో శ్రీ విష్ణు ప్రతిమకు  అభిషేకం చేస్తే చుట్టూ ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గి మంచి ఆలోచనలు కలుగుతాయి.

చందనంతో శ్రీ మహా విష్ణు ప్రతిమ పై మూడు నామాలను దద్దితే అపార సంపదలు కలుగుతాయి.

పెరుగుతో అభిషేకం చేస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

కుంకుమ పువ్వును నీటిలో కలిపి శ్రీ మహావిష్ణువు ను  అభిషేకిస్తే మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-