Skip to main content

భీష్మ ఏకాదశి విశిష్టత- విష్ణు సహస్ర నామ స్తోత్రమును.. !


భీష్ముడు భారతంలో మణిపూస వంటివాడు. ఈతడు సత్యవతీ, శంతనుల వివాహ సంధానకర్తగా, ధృతరాష్ట్ర, పాండురాజులు పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితృతుల్యునిగా, కౌరవుల సర్వసైన్యాధక్షునిగా, సర్వలోకావళికి పాపభంజనం, పుణ్యప్రదం, మోక్షప్రదమునగు ‘శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము’ను అందించిన ఆచార్యునిగా సుప్రసిద్ధుడు.
గంగా, శంతనుల కుమారుడైనందున ఇతనికి ‘గాంగేయుడు’, ‘దేవవ్రతుడ’నియు అంటారు. శంతన మహారాజుతో వివాహపూర్వము ఏర్పరచుకొనిన నియమమును రాజు గాంగేయుని జననమున ఉల్లంఘించినందున, ఆ పిల్లవానిని పెంచి పెద్దవానిని చేసి సకల విద్యాపారంగతుని చేసి అప్పగించగలనని పలికి, గంగాదేవి గాంగేయుని తీసికొని శంతనుని విడచి వెళ్ళింది.
గంగాదేవి గాంగేయుని పరశురాముని వద్ద సకల విద్యలు, ధనుర్విద్యను నేర్పించి కొంత కాలమునకు శంతన మహారాజుకు అప్పగించింది. సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు.
ఇలా ప్రతిజ్ఞ చేసిన కుమారుడు భీష్మునికి శంతనుడు స్వచ్ఛంద మరణ వరమును ప్రసాదించాడు. శంతన, సత్యవతులకు చిత్రాంగద, విచిత్రవీర్యులను ఇరువురు కుమారులు కలిగారు. చిత్రంగదుడు గర్వాతిశయమున గంధర్వరాజు చిత్రాంగదుని చేతిలో మరణించాడు.
భీష్ముడు విచిత్ర వీర్యుని సింహాసనాధిష్ఠితుని గావించి, అంబిక, అంబాలికలతో వివాహం జరిపించాడు. కాని విచిత్రవీర్యుడు కారణాంతరాలచే శుష్కించినవాడై, కొద్దికాలానికే విగతజీవుడయ్యాడు. కురువంశాభివృద్ధికి సత్యవతి భీష్ముని వివాహం చేసికొనమని ప్రోత్సహించింది.
కాని భీష్ముడు తన ప్రతిజ్ఞనుల్లంఘించలేదు. ఆమె వ్యాసభగవానుని స్మరించి, ఆయన అనుగ్రహమున కోడండ్రు ద్వారా ధృతరాష్ట్ర, పాండురాజులను అంబాలిక దాసి ద్వారా విదురుని పొందింది. ధృతరాష్ట్ర, పాండు రాజులను తదుపరి వారి సంతతి అగు కౌరవ పాండవులను భీష్ముడు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాడు.
కౌరవుల దుశ్చింతన వలన కౌరవ పాండవులకు యుద్ధమనివార్యమయంది. కౌరవ సర్వసైన్యాధ్యక్షునిగా భీష్ముడు పాండవులతో ధర్మయుద్ధంచేశాడు. భీష్ముని శస్తధ్రాటికి అర్జునుని రథసారథియైన శ్రీకృష్ణుడు కోపోద్రిక్తుడై ఆయుధమును ధరింపనని ప్రతినబూనినవాడు యుద్ధరంగమున చక్రహస్తుడై ‘‘నేను భీష్ముని చంపుదు, నిన్నుగాతు విడువుమర్జున’’ అని పలికి భీష్మునిపైకి పోబోయాడు. అట్టి తనను చంపబూనిన శ్రీకృష్ణుడే తనకు దిక్కు అని భీష్ముడు స్తవము చేసినట్లు భాగవతము ప్రథమాస్కందమునందలి పోతనమహాకవి అత్యద్భుత రచన భీష్మస్తవము’ విశదపరుస్తుంది.
ధర్మపక్షపాతియైన భీష్ముడు శిఖండిని యుద్ధరంగమున తాను చూచిన అస్త్ర సన్యాసము చేయుదునని ధర్మరాజునకుతెలుప, అవ్విధమున ఒనర్చి అర్జునుడు భీష్ముని శరతల్పగతుని చేసెను. స్వచ్ఛంద మరణము వరముగాగల భీష్ముడు శరతల్ప గతుడై ఉండియు ధర్మరాజుకు అనేక ధర్మములను బోధించి చివరగా మానవులు ముక్తినొందెడి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ సమక్షముననే ఆచార్యత్వము వహించి బోధించాడు. ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించిన తరువాత మాఘ శుద్ధ ఏకాదశిన తండ్రిగారిచ్చిన స్వచ్ఛంద మరణ వరమువలన భీష్మాచార్యులు శరీరం త్యజించి శ్రీ విష్ణు సన్నిధి చేరారు.
ఇంకా శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే(వాసము) ఉపవాసం చేస్తారు. 

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...