Skip to main content

తేది 18-12-2018 నాడు వైకుంఠ ఏకాదశి ని తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం,సూర్యోదయము కంటే ముందే నిద్ర లేవ్వాలి.
ఒకటిస్వర్గ ద్వారం : రెండు ముక్కోటి: మూడు వైకుంఠ. ఇందులో మొదటిది అయిన స్వర్గ ద్వార నామవిషయం. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాదిని కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అనే నామం కూడా కానవస్తూ ఉంది. ముక్కోటి యనగా మూడుకోట్ల మూడుకోట్ల దేవతలా దినమున శ్రీరంగమో లేక లేదా దివ్యక్షేత్రమున జేరుదురను ప్రతీతి ఉంది. విష్ణువు వైకుంఠానుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేపేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు. 
"
కృత యుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని "ముర" అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మిూదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది." స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మున్నగు నామాలతో వ్యవహరించబడే ఈ పర్వదినాన దేవాలయముల ఉత్తరద్వారమునందు శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మము లేదని శాస్త్రప్రమాణము. ఈ దినమె శ్రీరంగ క్షేత్రమున శ్రీరంగ దేవాలయ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం. మహత్తుగల ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి మహోత్తమమైంది. విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని బాగా జరుపుతారు.నేను ఈరోజు మదీనగూడ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవస్తానము విధులలో ఉంటాను. సాయంత్రము పూట నాచారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానములో అద్యయన ఉస్చవాలలో  ఉంటాను. 
 

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,