Skip to main content
వివాహ సమయంలో పెళ్లిపందిరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మనిషి జీవితంలో ప్రధానమైన ఘటమైన పెళ్లి కార్యక్ర మానికి దేవతలందరి ఆశీర్వాదాలుండాలనే భావనతో ప్రకృతితో కూడిన మండపాలను నిర్మించడం ఆచారంగా మార్చారు. పెద్దలు సరిసంఖ్యతో పెళ్లిపందిర్లను నిర్మించి, కొబ్బరి ఆకులతో పచ్చని పందిర్లు నిర్మించే వారు. వీటిని చతురస్రాకారం, అష్టభుజి ఆకారంలో వేయడం పరిపాటి. పందిరి కింద ముత్యాల పందిరిని కొబ్బరి ఆకులతో అందంగా తీర్చుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం చాలా మంది ఇంటి ముందు 16 గుంజలతో పందిరి వేస్తారు. దీనికి తల్లి గుంజలు, పిల్లగుంజలు వేస్తారు. ఈ గుంజలను జాజు, సున్నతో ఆలంకరిస్తారు. ఈ గుంజలపై గురిగి (చిన్న మట్టికుండ)ని రవికగుడ్డ (జాకేట్‌ వస్త్రం)తో కట్టి దానిపై కంచుడు (మట్టి ప్రమిద)ను పెట్టి పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు, తర్వాత రోజు ఇలా మూడు రోజులు దీపారాధన చేస్తారు. పచ్చని పందిరిని అల్లనేరెడు, మామిడి, కానుగ ఆకులతో నింపుతారు. పిల్లగుంజకు ఒక వస్త్రంలో నవధాన్యాలు, నాణేంను కట్టి వాటిని పెళ్లి కూతురితో కట్టిస్తారు. దానికిందా ముత్యాల పందిరి వేస్తారు. ముత్యాల పందిరి వధూవరులకు రక్షణ వలయంగా భావిస్తారు. పెళ్లి పందిరి వరకు నడిచిన జంట అక్కడికి చేరిన తర్వాత అవాంతరాలు రావొద్దనేది దీని పరమార్ధం.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-