Skip to main content

కనుమ పండగ విశిష్టత తేదీ 16-1-2022

 కనుమ రోజున ఆవులుదూడలుఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు.

సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది.

కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి.

సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంతో ఉంటారు. ఆ రోజు సాయంకాలం పశువులకు పొంగలి నైవేద్యం పెడతారు.

పశువుల పాకలను ఈరోజు వ్యవసాయదారులు మాత్రమే శుభ్రం చేసి పశువులను కడుగుతారు. మిగతా రోజులలో వేరే వారు చేసినా ఈ రోజు ఆపని ఎవరికి వారే చేసుకుటాంరు. సాధారణంగా ఈరోజు రైతులు మాంసాహారం తప్పకుండా తింరు. తమ యజమాని మాంసాహారం తినేవారైతే అక్కడే భోజనం చేస్తారు. ఒకవేళ తమ యజమానులు శాఖాహారులైతే కనుక వారు ఇచ్చే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్ళి మాంసాహారం ఇంటిలో వండుకునే తినే సంప్రదాయం కూడా ఉన్నది.

ఈ రోజుననే పశువులకు పందేలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నది. ఇవి అన్నీ కూడా తాము ఇన్ని రోజుల నుంచి కష్టపడిన వాటికి ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయం, పశువులు ఏపుగా ఉండే సమయం కాబట్టి అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుటాంరు.

వ్యవసాయ దారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ సంవత్సరం పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఏర్పడింది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు ఉంచబడింది. అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైనదన్నమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండింపచేసే భగవంతుడికి పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీనిని జరుపుకుటాంరు.

ఈ సంక్రాంతి పండుగ పట్టణాలలో కంటే కూడా గ్రామాలలో ఎక్కువగా ఆనందంగా జరుపుకుటాంరు.

ఈరోజుతో సంక్రాంతి ఉత్సవాలు పూర్తి అవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాల సమయాన సంక్రాంతి రోజునుంచి ప్రతి ఒక్కరు వారి వారి స్థాయికి తగినంత నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉత్తరాయణం 6 నెలలు కూడా దైవారాధనకు  ధర్మ కార్యాక్రమాలను అనువైన సమయంగా భావించి వారి వారి కర్మదోషాలను తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి.

ఈ రోజున పెరుగుదానం చేయడం విశేషమైన ఫలితంగా భావిస్తారు. దానం చేయాలనే ఆలోచన రావడమే మంచిది. వచ్చిన ఆలోచనను అమలు చేయడం ఇంకా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లోనూ తప్పకుండా దానం చేయాలి. దానివలన అనంతమైన ఐశ్వర్యం లభిస్తుంది. 

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.