Skip to main content

పెరియాళ్వార్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి 29-6-2023
అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్
ఆచార్యులు~: విష్వక్సేనులు
శ్రీ సూక్తులు: తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొళి
పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై
పెరియవాచ్చాన్ పిళ్ళై తన తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. వీరి యొక్క అవతార ప్రయోజనం, ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడం. ఎంపెరుమాన్ కృపచే పెరియాళ్వార్ సహజముగానే పెరుమాళ్ యందు దాస్యకైంకర్యం అను దానిచే అలంకరిపబడిరి. తమ జీవితాన్ని ఎంపెరుమాన్ కు కైంకర్యము చేయడానికి మరియు శాస్త్ర నిర్ణయం చేసి ఉత్తమ కైంకర్యమును ప్రవర్తింప చేయడానికి వినియోగించాలనుకున్నారు.శ్రీకృష్ణుడు కంస సభకు వెళ్ళేముందు మథురలోని మాలకారుని గృహమునకు వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలకారుడు ప్రేమతో మరియు ఆనందముతో మాలను సమర్పించగా శ్రీకృష్ణుడు చాలా ఆనందముతో దాని ధరించాడు.దీనిని గుర్తించిన పెరియాళ్వార్, పెరుమాళ్ కు మాలాకైంకర్యం చేయడమే ఉత్తమ కైంకర్యముగా భావించి, ఒక నందనవనము పెంచి దానినుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ కు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే మాలాకైంకర్యము చేయసాగిరి.
పెరియాళ్వార్ కు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది. ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు వారిది నిత్య కైంకర్యము)తమ ఆనందమునకై చేయగా , పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం ఎంపెరుమాన్ ఆనందమునకై (జీవాత్మలకు పరమపదమునందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని)మాత్రమే తమ కైంకర్యమును చేసిరి.ఇతర ఆళ్వార్లు, ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములను పోగొడతాడని భావించారు. కాని పెరియాళ్వార్, ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళైలోకాచార్యులు మరియు మామునులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు విధిగా కీర్తించబడిందని తెలిపారు.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-