Skip to main content

పెరియాళ్వార్

 

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి 29-6-2023
అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్
ఆచార్యులు~: విష్వక్సేనులు
శ్రీ సూక్తులు: తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొళి
పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై
పెరియవాచ్చాన్ పిళ్ళై తన తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. వీరి యొక్క అవతార ప్రయోజనం, ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడం. ఎంపెరుమాన్ కృపచే పెరియాళ్వార్ సహజముగానే పెరుమాళ్ యందు దాస్యకైంకర్యం అను దానిచే అలంకరిపబడిరి. తమ జీవితాన్ని ఎంపెరుమాన్ కు కైంకర్యము చేయడానికి మరియు శాస్త్ర నిర్ణయం చేసి ఉత్తమ కైంకర్యమును ప్రవర్తింప చేయడానికి వినియోగించాలనుకున్నారు.శ్రీకృష్ణుడు కంస సభకు వెళ్ళేముందు మథురలోని మాలకారుని గృహమునకు వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలకారుడు ప్రేమతో మరియు ఆనందముతో మాలను సమర్పించగా శ్రీకృష్ణుడు చాలా ఆనందముతో దాని ధరించాడు.దీనిని గుర్తించిన పెరియాళ్వార్, పెరుమాళ్ కు మాలాకైంకర్యం చేయడమే ఉత్తమ కైంకర్యముగా భావించి, ఒక నందనవనము పెంచి దానినుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ కు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే మాలాకైంకర్యము చేయసాగిరి.
పెరియాళ్వార్ కు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది. ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు వారిది నిత్య కైంకర్యము)తమ ఆనందమునకై చేయగా , పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం ఎంపెరుమాన్ ఆనందమునకై (జీవాత్మలకు పరమపదమునందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని)మాత్రమే తమ కైంకర్యమును చేసిరి.ఇతర ఆళ్వార్లు, ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములను పోగొడతాడని భావించారు. కాని పెరియాళ్వార్, ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళైలోకాచార్యులు మరియు మామునులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు విధిగా కీర్తించబడిందని తెలిపారు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-