అధిక శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏకాదశినే పద్మిని ఏకాదశి, కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని అంటారు. పద్మిని ఏకాదశి అంటే లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించిన వారికి విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. పద్మిని ఏకాదశి రోజున పెళ్లి కాని స్త్రీలు ఉపవాసం ఉండి మంచి భర్త కావాలని పూజిస్తే, వారి కోరిక కచ్చితంగా నెరవేరుతుందని పురాణాల్లో పేర్కొనబడింది.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com
Comments
Post a Comment