Skip to main content

Posts

Showing posts from 2025

Deepavali festival date 20-10-2025 Monday

  Lakshmi Puja Timings for Diwali 2025: Date: Monday, October 20, 2025 Lakshmi Puja Muhurta:  7:36 PM to 9:00 PM  Duration: 1 hour 24 minutes Pradosh Kaal: 6:24 PM to 9:00 PM  Pradosh Kaal in Hinduism is the  twilight period . The twilight period on the 13 th day during the waxing and waning phase of moon (Shukla Paksha and Krishna Paksha) is the Pradosham period. Golden rule is that Trayodashi tithi should be present during twilight period. Auspicious Time for Worship : The twilight period is considered a powerful time for connecting with divine energies. హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి తిథి 2025లో  అక్టోబర్ 18 న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలి . మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం గా ఉంటారని చెబుతారు.  యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా ...

దేవాలయాలలో పవిత్రోత్సవాలు

  పవిత్రోత్సవం అనేది   పవిత్ర   (పవిత్ర),   ఉత్సవ   (పండుగ) అనే రెండు పదాల కలయిక నుండి ఉద్భవించింది. ఈ ఉత్సవం పశ్చాత్తాపకరమైనది, ప్రాయశ్చిత్తకరమైనది. దీని ప్రధాన లక్ష్యం ఏడాది పొడవునా వివిధ ఆచారాల నిర్వహణలో లోపాలు, అంటూ ముట్టు లు పాటించక దేవాలయాలకు వచ్చిన  కారణంగా సంభవించే చెడును వదిలించుకోవడం. ఈ పండుగను   దోష నివారణ   (తప్పు దిద్దుబాటు),   సర్వ యజ్ఞ ఫలప్రద   (ఏడాది పొడవునా వ్రతాల పవిత్రతను సమానం చేసే ఒక ఆచారం),   సర్వ దోషోపమానం   (అన్ని దోషాలను తొలగించడం),   సర్వ తుష్టికార ,   సర్వకామప్రద ,   సర్వలోకసంతిద   అని కూడా పిలుస్తారు. పవిత్ర గ్రంథాల ప్రస్తావన పవిత్రం చెడు నుండి రక్షిస్తుందని జయఖ్య సంహిత వివరిస్తుంది. విష్ణువు ఆరాధన సమయంలో ఆచారాలలో అంతర్భాగంగా  పవిత్ర ఆరోపణ  (దేవతను  పవిత్ర  దారంతో అలంకరించడం - పవిత్రమైన దారపు దండలు)ను పురాణాలు సూచిస్తున్నాయి.  అగ్ని పురాణం  ప్రకారం, ఆషాఢ మాసం ప్రారంభంలో లేదా కృత్తిక చివరిలో చాంద్రమాన పక్షం మొదటి రోజును పవిత్రోత్సవాలు నిర్వహించడానికి ఎ...

మహార్నవమి విశేషాలు

  నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం కూడా ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మహార్నవమి రోజున  అమ్మవారికి పిండివంటలతో పాటు చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు . మహానవమి చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియజేయబడినది. ప్రధానపూజ నవమి రోజే చేయాలి. నవమి పూజ చేసిన వారే దశమి రోజు పున: పూజ చేస్తారు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.  వివిద రకాల పిండి వంటలు, చెరుకు గడలు  అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుం...

అన్నం వలన ప్రాణి కోటి

  *అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః* *యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః* అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి.  మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

 మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య  (21-9-2025) వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు.

తర్పణం గురించిన విశేషాలు

  *తర్పణం!*                    ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....! తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. *1.) తర్పణం అంటే ఏమిటి? పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు. *2. ) తర్పణము ఎన్నిరకాలు ? తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు. *ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు. 1-గరుడ తర్పణం : - ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు. 2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : - నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి. 3-పర్హెణి తర్పణం : - యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు. 4-సాధారణ తర్పణం : - అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణ...

ఇందిరా ఏకాదశి తేదీ 17-9-2025 బుధవారం

  ఇందిరా ఏకాదశి అనేది  భాద్రపద మాసం  కృష్ణ పక్షంలో వచ్చే ఎంతో పవిత్రమైన, విశేషమైన ఏకాదశి . సాధారణంగా ఇది  పితృ పక్షంలో వస్తుంది  కాబట్టి పితృ దేవతలకు, పూర్వీకులకు అంకితం చేయబడిన ఏకాదశిగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం,  ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల  పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని, అలాగే వారికి మోక్షం లభిస్తుందని పురాణోక్తి. అలాగే.. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం. అంతే కాకుండా పితృ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయి. ముఖ్యంగా  ఏకాదశి వ్రతం  ఆచరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. పితృ దోష నివారణకు ఆచరించాల్సిన పరిహారాలు ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులకు సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజున పూర్వీకులకు తర్పణం వదలడం చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వులు నీటిలో కలిపి దక్షిణ ముఖ...

దేవాలయాలలో భక్తులు పాటించవలసిన నియమాలు

    ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పెద్ద పెద్దగా మాట్లాడకూడదు. లౌకిక విషయాలపై ప్రసంగాలు చేయకూడదు. పక్క వ్యక్తుల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈమధ్యకాలంలో గుడిలోకి వెళ్లాక సెల్‌ఫోన్లలో మాట్లాడటం అలవాటుగా మారింది. ఇలా చేయడం ముమ్మాటికీ పాపమేనని అంటున్నారు పెద్దలు. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా రజోగుణసంపన్నమైన విషయాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించకూడదు. ప్రతీ ఆలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వస్త్రధారణ కూడా ముఖ్యమైనదే. ఆలయ నియమానుసారమే వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. శౌచం లేకుండా, స్నానాదులు చేయకుండా, బొట్టు లేకుండా గుడకి వెళ్లరాదు. గుడికి వెళ్లేసమయంతో తమతో పాటు కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్లాలి. స్వామివారికి నైవేధ్యం సమర్పించాలి. ఇక ప్రదక్షిణ చేసే విధానం కూడా ముఖ్యమే. గబగబా పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మూలమూర్తిని దర్శించుకోరాదు. అంతేకాదు, ముఖమంటపంలో గోడలకు ఆనుకొని కూర్చోవడం, కాళ్లు జాపుకొని కూర్చోకూడదు. స్వామివారి సన్నిధానంలో ఉండాలని బలంగా కోరుకునే భక్తులు... దేహాన్ని విడిచిన తరువాత ఆలయంలో ఇటుకలు, స్తంభాల రూపంల...

పరివర్తిని ఏకాదశి తేదీ 3-9-2025 బుధవారం

   ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో ఏర్పడే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి, వామన ఏకాదశి అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  03 సెప్టెంబర్ 2025  బుధవారం రోజున పరివర్తిని ఏకాదశి వచ్చింది.   పరివర్తన ఏకాదశి పూజా విధానం మిగతా ఏకాదశుల మాదిరిగానే, పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై, పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీలక్ష్మీ నారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేమంతులతో నారాయణుని పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి. పూజా చేసేవారు రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి. సాయంత్రం పూజ ఏకాదశి రోజు సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.

శుక్రవారం నాడు వచ్చిన అమావాస్య రోజు చెయ్యాల్సిన విధి - యోగక్షేమ౦

  పిప్పళ్ళు, ఎండు మిరపకాయలు, బొరుగులు, గులాబీ పువ్వులు, మిరియాలు, చెంగల్వకోష్టు,గుగ్గిలం ,మహిసాక్షి, సాంబ్రాణి ,మరియు ఇతర విశేష మూలికలతో కలిపినా పొడితో దూపం వెయ్యండి .దూపం వేసాక " ఓం ఐ౦ హ్రీం శ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్ని రకాల దృష్టులు, దోషాలు హరించబడి మీరు అనుకునే కార్యాలు త్వరగా దిగ్విజయమవుతాయి.

శ్రీ గణపతి నవరాత్రి పూజ సామగ్రి వివరాలు

  గణపతి పూజలో వాడే సామాగ్రి: గణపతి విగ్రహం లేదా ఫోటో : పూజకు ముందుగా గణపతి విగ్రహం  పసుపు,100 గ్రాములు,  కుంకుమ :100 గ్రాములు,  ఇవి దైవిక పూజలలో ముఖ్యమైనవి. పసుపు శుభ్రతకు, కుంకుమ శక్తి కోసం ఉపయోగిస్తారు.  చందనం : చందనం పవిత్రతకు సంకేతం. గణపతికి గంధం అనారోగ్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. పసుపు అక్షింతలు : శుభకార్యాలలో అక్షింతలను వినియోగిస్తారు. ఆచమనం పాత్ర 1  ద్రవ్యాలు : ద్రవ్యాలు అంటే బియ్యం 5 కిలోలు . రాగి కలశం చెంబులు 2  , ఆవు పంచితం 100 ml , గ్లాసులు 3, (పుణ్యాహ వాచనం ),కంకణ దారం , యగ్య ఉప వే తమ్ 1 , పానకం, నెయ్యి, పాలు, పెరుగు ,తేనె చక్కెర అన్నీ కలిపినవి పంచామృతం : ఇవి అభిషేకానికి వాడతారు. పుష్పాలు 1/2 కిలో  :మరియు పూల  దండ పెద్దది 1,  తెలుపు, ఎరుపు పువ్వులు, మొదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యం : గణపతికి ఇష్టమైన ప్రసాదం మొదకా లు. పులీహార , etc .   పండ్లు :  వివిధ రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. 21 రకముల ఆయుర్వేద చెట్ల ఆకులు (మొదటి రోజున మాత్రమే ),తమల పాకులు, నల్లని పోక వాక్కలు, ఖర్జూరం పండ్లు పాకెట్, dry fruits ,etc...

sri sudharshana ashtakam meanings & story

  Sudarshana Ashtakam consists of 8 slokas i n praise of Sudarshana c hakra.  .Sudarshanachakra is  weapon borne by Sriman Narayana .It is a powerful weapon which is used by Narayana to slay the enemies of His devotees. This ashtakam viz 8 slokas  were written by Swamy Desikan .When he was residing at Kanchipuram[ in 13 th cent AD] he heard that nearly all the residents of a nearby village  -  .Thirupatkuzhi  were stricken by debiltating disease that  caused high fever and chill and nothing could cure it.Many lost their lives and others  were bed ridden. Moved by their suffering he invoked Sudarshana chakra  by writing  Sudarshana Astakam and  Shoda  sayudha stothram  which are in praise of Sudarshana Chakra  so that Sri Sudarshana Chakra would    come to their aid and cure them of their disease. Elders recounting those days tell us that the residents of Thirupaatkuzhi  immediately recovered f...

అజ ఏకాదశి తేదీ 19-8-2025 మంగళ వారం ప్రాముఖ్యత

  శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే అజ ఏకాదశి అని అంటారు.  ఈ ఏకాదశికే అన్నద ఏకాదశి అనే మరో పేరు కూడా ఉంది. ఈ పండుగ విష్ణువు మరియు లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ ఏకాదశిని పాటించడం వల్ల భక్తులు అన్ని పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా.. జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా ఆ శ్రీహరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. . అజ ఏకాదశి పూజా విధానం అజ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్ష తీసుకోవాలి. అనంతరం ఇంట్లోని పూజా మందిరాన్ని శుద్ది చేసి విష్ణువు ప్రతిమను పెట్టండి. పూజలో తులసి మెుక్కను ఉపయోగించండి. విష్ణువు మంత్రాలను జపిస్తూ మంత్రోచ్ఛారణ చేయండి. దాంతో పాటు అజ ఏకాదశి కథను వినండి. మీ శక్తి కొలదీ ఆహారం, బట్టలు, డబ్బు మెుదలైనవి దానం చేయండి. ఏమి చేయకూడదు? ఈరోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారం( మాంసం, చేపలు) జోలికి పోకండి. ఎక్కువ శారీరక శ్రమ చేయకండి. వినోదం, విలాసాలకు దూరంగా ఉండండి. కోపం, హింసను విడనాడండి. మద్యం, మత్తు పదార్ధాలు సేవించకూడదు. అజ ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణాలు, హిందూ గ్రంథాల్లో చెప్పబడింది. బ్రహ్మవైవర...

Sri satyanarayana vratham puja items

  // జై శ్రీరామ్ //   పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 9  , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ), blouse peaces, red & yellow colour 2 nos., dothi,Sella 1 set. అరటి పండ్లు 1 డజన్ & అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 nos. అగర్ రబత్తి ,,, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  ముద్ద కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 రాగి  కలశం చెంబులు 2,   దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1,  రూపాయి  బిళ్ళలు  25.  చిన్నవి అరటి కొమ్మలు 4, పూలు ఒక  కిలో, పూల హారాలు  3  మూరలు , Tulasi maala ఒకటి ,sree satyanarayana swamy దేవుని ఫోటో   ఆచమనం పాత్ర సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, కాజు, kissmiss ,బాదాం పొడి,  బెల్లం పొడితో చేయాలి .ch...

గణానామ్ త్వా గణపతిగ్‌ం హవామహే

  గణానామ్ త్వా గణపతిగ్‌ం హవామహే కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్। జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్॥ టీకా: గణానామ్= గణముయందు; త్వా= నిన్ను; గణపతిగ్‍ం= గణపతిని; హవామహే= ఆహ్వానించుచున్నాము; కవిమ్= కవిని; కవీనామ్= కవులలో; ఉపమ= పోలికలో; అశ్రవస్-తవమ్= మిక్కిలి అధికుడయిన వానిని; జ్యేష్ఠ రాజమ్= పెద్ద రాజు అయిన వాడిని (రాజాధిరాజును); బ్రహ్మణామ్= బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే= బ్రహ్మణస్పతివి; ఆ= అయిన; శృణ్వన్= ఆలకించి; ఊతిభిః= కోర్కెలు తీర్చువాడవై ; సీద= అలంకరించుము; సాదనమ్= ఆసనము/స్థానము. తాత్పర్యం:  గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణస్పతివి, పెద్దరాజువు/రాజాధిరాజువు అయిన నీవు మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము. నిజానికి ఈ సూక్తానికి అధిదేవత బృహస్పతి/బ్రహ్మణస్పతి. ఈ సూక్తంలో మిగిలిన శ్లోకాలన్నీ బృహస్పతి/బ్రహ్మణస్పతిని ఉద్దేశించి రాసినవే. గణపతి అంటే ఇక్కడ జనసమూహానికి అధిపతి. అంతే. నిజానికి ఇంద్రుణ్ణి కూడా ‘గణపతి’ అంటూ ప్...

పుత్రదా ఏకాదశి తేదీ 5-8-2025 మంగళ వారం

  ఈ రోజు యొక్క ప్రాముఖ్యత పిల్లల జననం, దీర్ఘాయుష్షు మరియు పిల్లల ఆరోగ్యం కోసం పరిగణించబడుతుంది. పుత్ర ఏకాదశి అంటే ‘పుత్రుడిని ఇచ్చే ఏకాదశి’ అని అర్థం. పుత్ర ఏకాదశి నాడు నిజమైన హృదయంతో విష్ణువును పూజించడం ద్వారా మరియు పేద మరియు నిస్సహాయ ప్రజలకు దానం చేయడం ద్వారా, జంటలు పిల్లల ఆనందాన్ని పొందుతారని చెబుతారు. దీనితో పాటు, వివాహిత స్త్రీల ఆనందం మరియు అదృష్టం కూడా పెరుగుతుంది. అదే సమయంలో, సామాన్యులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పేదలకు మరియు నిస్సహాయులకు దానం చేయడం ద్వారా, సాధకులు విష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి నియమాల ప్రకారం దేవుడిని పూజించే వారు పిల్లల ఆనందాన్ని పొందుతారు మరియు పిల్లల దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని చెబుతారు. ఈ ఉపవాసం ప్రభావం వల్ల, పిల్లలు లేని జంటలు సమర్థులైన మరియు మహిమాన్వితమైన పిల్లల ఆశీర్వాదాన్ని పొందుతారు.   ఏకాదశి నాడు దానం యొక్క ప్రాముఖ్యత సనాతన సంప్రదాయంలో దానం చాలా ముఖ్యమైనది. ఇది మానవ అభివృద్ధికి అలాగే ప్రజల పురోగతికి గొప్ప మాధ్యమం. దానం అంటే...

Sri Sudharshana Perumal Thiru Nakshatram on 31-7-2025 Thursday

  Maha sudarsana homam for removal of all enemies & avoiding accidents, The desires of human beings are innumerable and they vary in nature. The yantra (a symbol embedded in metal) used in the Homa, will keep all negativity at a distance and bring in divine and auspicious energies. It is performed for For any auspicious beginning Removal of astrological flaws For victory, courage and prosperity.  To annihilate evil forces. Suffering caused by incurable diseases, sorcery or enemies are dispelled by Lord Sudharshana. Alleviates the suffering of the progeny belonging to later generations due to non- performance of the last rites of the previous generations.  Stops the danger or problems, which may possibly occur in future The power of the Homam Homam is a sacrament performed to a particular divine being by appeasing ´Agni´, the lord of fire. Sun in the Hindu worldview, is considered, as the main source of energy in the universe and fire is believed to be symbolic of the ...

గోదాదేవి తిరునక్షత్రం తేదీ 28-7-2025 సోమవారం

భగవంతునికి  భార్యగా మారిన పుణ్యవతి ఆండాళ్‌నే గోదాదేవి .  హరి సంకీర్తనం, శరణాగతీ, పుష్పమాల సమర్పణం అనే మూడు సేవల గురించి శ్రీమహావిష్ణువు స్వయంగా భూదేవితో చెప్పినట్లు ఆర్యోక్తి..ఈ రోజున ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై సేవ కాలం మరియు ఆశ్తోతరం, ఆండాళ్ సూక్తి చదువుదాం రండి. శ్రీ వైష్ణవ దేవాలయాలకు రండి. కలిసి పూజలు  చేద్దాం.  విశిష్టాద్వైత మత ప్రచారకులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రo . గోదా దేవి తిరునక్షత్రం ఈ రోజు .  ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.   అంటే ఆవిడ విష్ణు చిత్తుల వారికి ఈ రోజున తులసి వనంలో దొరికింది .  నిజానికి భూదేవి ఆండాళ్ గా జన్మించిందని చెబుతారు.  అందుకే ఈ రోజు అన్ని వైష్ణవాలయాలలో ఆండాళ్ తిరునక్షత్రం విశేషంగా జరుపుతారు . తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమా...

కామిక ఏకాదశి తేదీ 21-7-2025 సోమవారం

  ఏకాదశి హిందూ మత విశ్వాసాలలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు పూర్తిగా ఈ విశ్వాన్ని పోషించే విష్ణువుకు అంకితం చేయబడింది. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. శ్రావణ మాసంలో శ్రీ హరి ఆరాధన అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం, పేదలు, నిరాశ్రయులు మరియు నిస్సహాయులకు దానం చేయడం ద్వారా మరియు ఈ రోజున నారాయణుడిని పూజించడం ద్వారా, భక్తుడు మోక్షాన్ని పొందుతాడు.   , ఉదయ తిథి ప్రకారం, కామిక ఏకాదశి జూలై 21న జరుపుకుంటారు.   కామిక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పేదలకు, నిరాశ్రయులకు మరియు నిస్సహాయులకు దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతాడని చెబుతారు. చాతుర్మాసంలో వచ్చే కామిక ఏకాదశికి దానికదే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నమ్మకాల ప్రకారం, ఈ ఏకాదశి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున విష్ణువుకు తులసి ఆకులు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.   ఏకాదశి నాడు దానం యొక్క ప్రాముఖ్యత  ఆధ్యాత్మిక ఉద్ధరణకు ప్రధాన సాధనం కూడా. దానం అంటే ఒకరి సంపద, సమ...

గురు పౌర్ణమి తేదీ 10-7-2025 గురువారం

ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. వ్యాసభగవానుడిని మానవాళి మెుత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిడి వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు. అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని పెద్దలు  చెబుతున్నారు.

యోగిని ఏకాదశి తేదీ 21-6-2025 శనివారం

  జ్యేష్ఠ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి, పాపాలను నాశనం చేయడానికి, జీవితంలో ఆనందం, శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా.. 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది.  పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు. ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి. యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస న...

హోమం పూజ సామగ్రి

  హోమ సామగ్రి :  పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర , ఆవు పిడకలు ,5, నవధాన్యాలు అన్నీ కలిపి 1/2 కిలో,  స్వచ్చమైన ఆవు నెయ్యి , కిలో ,  పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము), సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు), ఎండు మామిడి , రావి,జువ్వి, మర్రి చెట్టు కొమ్మ పుల్లలు , కర్పూరము ,1 ముద్ధ పాకెట్  పూజా సామగ్రి ,పూలు,పండ్లు,  పూర్ణాహుతి పాకెట్,  తాటాకుల విసనకర్ర , ఎర్రని  మట్టి పాత్రలు 2,  ఔషద మొక్కల సమిధలు  , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని , బ్రాహ్మణ దక్షిణ Rs .  హోమ శక్తి :  ఔషధ ఉపయోగాలు : దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము . హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు . హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి . హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి , మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాం...

నిర్జల ఏకాదశి తేదీ 6-6-2025 శుక్రవారం

   ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు.  24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు.  విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం. ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును...