Skip to main content

మోహినీ ఏకాదశి తేదీ 27-4-2026 సోమవారం

 వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ రోజునే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మోహినీ అవతార విశిష్టత తెలుసుకుందాం. 'మోహిని' అంటే మోహింపజేసేది అని అర్థం. హిందూ పురాణాలలో మోహిని అవతారం శ్రీమహావిష్ణువు ధరించిన అత్యంత విశిష్టమైన, ఏకైక స్త్రీ అవతారం.

మోహిని ఏకాదశి ఇలా వచ్చింది
శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్పూర హారతిచ్చి నమస్కరించుకోవాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సంధ్యా సమయంలో తిరిగి పూజ చేసి క్షీరసాగర మథనం ఘట్టాన్ని, శ్రీహరి మోహిని అవతార విశిష్టతను పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిత్య పూజ పూర్తి చేసి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఈ దానాలు శ్రేష్టం
మోహిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేయడం మహా ఫలదాయకమని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మామిడి పండ్లు, జలదానం, ఛత్రం, పాదరక్షలు వంటివి కూడా దానం చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి పాపాలు కూడా తొలగిపోతాయని, భక్తులు మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-