Skip to main content

అధిక జ్యేష్ఠ మాసం ఈ ఏడాది మే 17వ తేదీ ఆదివారం నుంచి వచ్చే నెల 15వ తేదీ సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాసం


Sri Vishnu
(ఫోటోలు- iStock)
Adhika Jyeshta masam 2026 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠ మాసం వస్తుంది. అయితే సూర్య సిద్ధాంతం, బ్రహ్మ సిద్ధాంతం తదితర గ్రంథాల ప్రకారం, ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి కనిపించదోఆ కాలాన్ని ‘అధిక మాసం’గా పరిగణిస్తారు. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక ఏడాదికి 365 రోజులు 6 గంటల 11 సెకన్లు. అయితే ఒక చాంద్రమానం ప్రకారం ఒక ఏడాదికి 354 రోజుల సుమారు 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు మాసాల మధ్య సమన్వయం కల్పించేందుకు భారతీయ శాస్త్రకారులు ‘అధిక మాస’ వ్యవస్థను రూపొందించినట్లు ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్త మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. 
 జ్యేష్ఠ శుక్ల పక్షం, రెండో పక్షం అయిన క్రిష్ణ పక్షంలో ఎలాంటి సంక్రాంతి లేకపోవడంతో ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా పరిగణించనున్నారు. ఈ లెక్కన ఏ ఏడాదిలో అయిన రెండు జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య విభేదాలు రావొచ్చు. రాజకీయంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రముఖ నాయకులు మరణం లేదా పదవీ కోల్పోవడం, హింసాత్మక ఘటనలు జరగొచ్చు. ప్రజలు కొత్త రోగాల బారిన పడచ్చు. పూజా కార్యక్రమాలు, దానధర్మాల కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

అధిక జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పనులు
 అధిక జ్యేష్ఠ మాసంలో వేణుమాధవుడిని స్మరించుకుంటూ స్నానం చేసిన అనంతరం ఉపవాస దీక్ష కొనసాగిస్తూ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. అధిక మాసంలో విష్ణుమూర్తి స్వరూపుడిగా భావించే సూర్యుడిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు ధాన్యం, పండ్లు, దుస్తులు దానం చేయాలి. అలాగే నెలాఖారులో బెల్లం, నెయ్యి వంటి వాటిని దానం చేయాలి.
ఈ మంత్రాలను పఠించాలి
కేశవం మాధవం రామమచ్యుతం పురుషోత్తమమ్
వాసుదేవం జగద్యోనిమనంతం శేషశాయినమ్
జనార్దనం ధరావాసం దామోదరమధార్దనమ్
గోవిందం వామనం శ్రీశం శ్రీక్రిష్ణం విశ్వసాక్షిణమ్
ఈ పనులు చేయకూడదు
* అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు.
* అయితే కొన్ని అత్యవసర కర్మలు చేయొచ్చు.
* వివాహ కార్యక్రమాలు, విహారయాత్రలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం చేయకూడదు
* కొత్త వాహనం, కొత్త ఆభరణాలు, కొత్త బట్టలు వంటివి తీసుకోకూడదు.
* కొత్త భూమి, కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోవాల్సి రావొచ్చు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-