Skip to main content

shani thrayodashi on June 13 th Saturday

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, పనిలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శని త్రయోదశి రోజు శని భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. చాలా అరుదుగా వచ్చే శని త్రయోదశి ఈ ఏడాది "జూన్ 13న" వచ్చింది. ఈ రోజు ప్రదోష కాలంలో చతుర్ధశి తిథి కూడా ఉంది కాబట్టి మాసశివరాత్రి అయ్యింది. కాబట్టి, అధిక జ్యేష్టమాసంలో మాసశివరాత్రితో వస్తోన్న ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చం. అంతేకాదు, జూన్​ 13న కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. మరి, ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

శని త్రయోదశి, మాసశివరాత్రి రెండూ కలిసి వచ్చిన జూన్ 13న శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి, శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే ముప్పై మూడు మారేడు దళాలతో పరమేశ్వరుడిని పూజించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుందంటున్నారు .

  • శివుడిని ముప్పై మూడు మారేడు దళాలతోనే ఎందుకు పూజించాలంటే.. అధికమాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఈ మాసంలో 33 అరిసెలు, అప్పాలు, బూరెలు వంటివి దానమివ్వమని అంటుంటారు. పూజలు చేసినా 33 పుష్పాలతో పూజలు చేయమని చెబుతుంటారు.
  • దేవతల్లో ద్వాదశ ఆధిత్యులు.. అంటే 12 మంది సూర్య స్వరూపాలు ఉంటారు. ఏకాదశ రుద్రులు.. అంటే 11 మంది రుద్ర స్వరూపాలు ఉంటారు. ఇద్దరు అశ్వనీ దేవతలుంటారు. అష్ట వసువులు అని ఎనిమిది మంది ఉంటారు. మొత్తం కలిపితే 33 వస్తుంది. 33 కోట్ల దేవతలంటే అర్థమేమిటంటే, 33 మంది దేవతల సమూహం అని అర్థం. వీళ్లందరూ ఆనందించి, జీవితం అద్భుతంగా మారిపోవాలంటే అధికమాసంలో 33 సంఖ్యతో వీళ్లకు ప్రీతి కోసం ఏదైనా చేయాలి.
  • అందుకే, ఈ శనిత్రయోదశి రోజు భయంకరమైన శని చూపుల వల్ల, శని దోషాల వల్ల వచ్చే సమస్యలు పోవాలన్నా, పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించాలన్నా 33 మారేడు దళాలతో ఈశ్వరుడి పూజ చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటున్నారు జ్యోతిష్యులు .

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-