జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, పనిలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శని త్రయోదశి రోజు శని భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. చాలా అరుదుగా వచ్చే శని త్రయోదశి ఈ ఏడాది "జూన్ 13న" వచ్చింది. ఈ రోజు ప్రదోష కాలంలో చతుర్ధశి తిథి కూడా ఉంది కాబట్టి మాసశివరాత్రి అయ్యింది. కాబట్టి, అధిక జ్యేష్టమాసంలో మాసశివరాత్రితో వస్తోన్న ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చం. అంతేకాదు, జూన్ 13న కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. మరి, ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.
శని త్రయోదశి, మాసశివరాత్రి రెండూ కలిసి వచ్చిన జూన్ 13న శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి, శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే ముప్పై మూడు మారేడు దళాలతో పరమేశ్వరుడిని పూజించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుందంటున్నారు .
- శివుడిని ముప్పై మూడు మారేడు దళాలతోనే ఎందుకు పూజించాలంటే.. అధికమాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఈ మాసంలో 33 అరిసెలు, అప్పాలు, బూరెలు వంటివి దానమివ్వమని అంటుంటారు. పూజలు చేసినా 33 పుష్పాలతో పూజలు చేయమని చెబుతుంటారు.
- దేవతల్లో ద్వాదశ ఆధిత్యులు.. అంటే 12 మంది సూర్య స్వరూపాలు ఉంటారు. ఏకాదశ రుద్రులు.. అంటే 11 మంది రుద్ర స్వరూపాలు ఉంటారు. ఇద్దరు అశ్వనీ దేవతలుంటారు. అష్ట వసువులు అని ఎనిమిది మంది ఉంటారు. మొత్తం కలిపితే 33 వస్తుంది. 33 కోట్ల దేవతలంటే అర్థమేమిటంటే, 33 మంది దేవతల సమూహం అని అర్థం. వీళ్లందరూ ఆనందించి, జీవితం అద్భుతంగా మారిపోవాలంటే అధికమాసంలో 33 సంఖ్యతో వీళ్లకు ప్రీతి కోసం ఏదైనా చేయాలి.
- అందుకే, ఈ శనిత్రయోదశి రోజు భయంకరమైన శని చూపుల వల్ల, శని దోషాల వల్ల వచ్చే సమస్యలు పోవాలన్నా, పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించాలన్నా 33 మారేడు దళాలతో ఈశ్వరుడి పూజ చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటున్నారు జ్యోతిష్యులు .
Comments
Post a Comment