Skip to main content

shani thrayodashi on June 13 th Saturday

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు, పనిలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శని త్రయోదశి రోజు శని భగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. చాలా అరుదుగా వచ్చే శని త్రయోదశి ఈ ఏడాది "జూన్ 13న" వచ్చింది. ఈ రోజు ప్రదోష కాలంలో చతుర్ధశి తిథి కూడా ఉంది కాబట్టి మాసశివరాత్రి అయ్యింది. కాబట్టి, అధిక జ్యేష్టమాసంలో మాసశివరాత్రితో వస్తోన్న ఈ శని త్రయోదశి చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చం. అంతేకాదు, జూన్​ 13న కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. మరి, ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

శని త్రయోదశి, మాసశివరాత్రి రెండూ కలిసి వచ్చిన జూన్ 13న శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి, శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే ముప్పై మూడు మారేడు దళాలతో పరమేశ్వరుడిని పూజించడం అత్యంత శుభ ఫలితాలనిస్తుందంటున్నారు .

  • శివుడిని ముప్పై మూడు మారేడు దళాలతోనే ఎందుకు పూజించాలంటే.. అధికమాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఈ మాసంలో 33 అరిసెలు, అప్పాలు, బూరెలు వంటివి దానమివ్వమని అంటుంటారు. పూజలు చేసినా 33 పుష్పాలతో పూజలు చేయమని చెబుతుంటారు.
  • దేవతల్లో ద్వాదశ ఆధిత్యులు.. అంటే 12 మంది సూర్య స్వరూపాలు ఉంటారు. ఏకాదశ రుద్రులు.. అంటే 11 మంది రుద్ర స్వరూపాలు ఉంటారు. ఇద్దరు అశ్వనీ దేవతలుంటారు. అష్ట వసువులు అని ఎనిమిది మంది ఉంటారు. మొత్తం కలిపితే 33 వస్తుంది. 33 కోట్ల దేవతలంటే అర్థమేమిటంటే, 33 మంది దేవతల సమూహం అని అర్థం. వీళ్లందరూ ఆనందించి, జీవితం అద్భుతంగా మారిపోవాలంటే అధికమాసంలో 33 సంఖ్యతో వీళ్లకు ప్రీతి కోసం ఏదైనా చేయాలి.
  • అందుకే, ఈ శనిత్రయోదశి రోజు భయంకరమైన శని చూపుల వల్ల, శని దోషాల వల్ల వచ్చే సమస్యలు పోవాలన్నా, పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించాలన్నా 33 మారేడు దళాలతో ఈశ్వరుడి పూజ చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటున్నారు జ్యోతిష్యులు .

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-