Skip to main content
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని (1-7-2020 బుధవారం) తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగల్నీ మొదలవుతాయి  మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో, ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం...
ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజగదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. అందుకనే ఆ పేరు. అందుకే ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈ రోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెబుతారు. పేలాల పిండి వల్ల జలుబులాంటి సమస్యలు దూరమైపోతాయి. పేలాలపిండిని బెల్లం, యాలుకలతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది.
ఆవులను పూజించేందుకు కూడా తొలి ఏకాదశి చాలా మంచిది. గోవు అంటే సాక్షాత్తు కామధేనువు. అందుకే ఈ రోజు కనుక గోపూజ చేస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయని నమ్మకం. రాచకొండ రామాచార్యులు, పూజారి, రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదరాబాద్. మొబైల్ నంబర్ :9989324294

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-