Skip to main content

వామన ద్వాదశి తేదీ 7-9-2022 బుధవారం

 హిందూపురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి. ఈ రోజు శ్రీహరి ని ఆరాధిస్తారు. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఓం వo వామనాయ నమః మంత్రం 108 సార్లు మనసులో అనుకోవాలి.  

వామనుడు జన్మ వృత్తాంతం
కశ్యపుడు, అదితికి జన్మించినవాడు వామనుడు. దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు చేతిలో ఓడిపోతాడు బలి చక్రవర్తి. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, శక్తివంతమైన ధనస్సు, అక్షీయ తూణీరాలు పొంది.. రాక్షసుల అందరినీ కూడగట్టుకుని దేవేంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు. బృహస్పతి సూచనలు మేరకు దేవతలు అమరావతిని వీడి పారిపోతారు. బలిచక్రవర్తి గర్వమును అణచడానికై శ్రీహరి అదితి గర్భమున జన్మిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి. అతడి దగ్గరికి వెళ్లి మూడు అడుగుల నేలను అడుగుతాడు వామనుడు. సరే అంటాడు బలి. వామనుడు త్రివిక్రముడై మెుత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి.. అతడిని దానికి రాజును చేస్తాడు. ఆ రాజ్యానికి స్వయంగా శ్రీహరే కాపలాగా ఉంటాడు. 

 వామన ద్వాదశి రోజున ఏం చేయాలి?
>> వామనుని అనుగ్రహం పొందడానికి వామన ద్వాదశి రోజున కంచు పాత్రలో నెయ్యి దీపం వెలిగించండి. దీంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి. 
>>  మీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కొబ్బరికాయపై యాగ్యోపవీతం చుట్టి వామనుడికి సమర్పించండి. మీ పనిలో ఏవైనా ఆటంకాలు ఉంటే ఇది తొలగిస్తుంది. 
>>  వామన ద్వాదశి పూజానంతరం అన్నం పెరుగు దానం చేయడం శుభప్రదం. ఇది ఇంట్లోకి అపారమైన సంపదను తీసుకువస్తుంది.
>>  వామన ద్వాదశి రోజున వామనుని విగ్రహాన్ని పూజించటం వల్ల  శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
>>  వామనుడిని పూజించేటప్పుడు  నైవేద్యంగా 52 లడ్డూలను పెట్టాలి. అందరికీ దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వామనుని అనుగ్రహం లభిస్తుంది. పూజానంతరం బ్రాహ్మణుడికి దానం చేయండి. దీంతో మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-