Skip to main content

వామన ద్వాదశి తేదీ 7-9-2022 బుధవారం

 హిందూపురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో వామన అవతారం ఒకటి. ఈ రోజు శ్రీహరి ని ఆరాధిస్తారు. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఓం వo వామనాయ నమః మంత్రం 108 సార్లు మనసులో అనుకోవాలి.  

వామనుడు జన్మ వృత్తాంతం
కశ్యపుడు, అదితికి జన్మించినవాడు వామనుడు. దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు చేతిలో ఓడిపోతాడు బలి చక్రవర్తి. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడు ఉపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథాన్ని, శక్తివంతమైన ధనస్సు, అక్షీయ తూణీరాలు పొంది.. రాక్షసుల అందరినీ కూడగట్టుకుని దేవేంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు. బృహస్పతి సూచనలు మేరకు దేవతలు అమరావతిని వీడి పారిపోతారు. బలిచక్రవర్తి గర్వమును అణచడానికై శ్రీహరి అదితి గర్భమున జన్మిస్తాడు. బలి చక్రవర్తి దానశీలి. అతడి దగ్గరికి వెళ్లి మూడు అడుగుల నేలను అడుగుతాడు వామనుడు. సరే అంటాడు బలి. వామనుడు త్రివిక్రముడై మెుత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి.. అతడిని దానికి రాజును చేస్తాడు. ఆ రాజ్యానికి స్వయంగా శ్రీహరే కాపలాగా ఉంటాడు. 

 వామన ద్వాదశి రోజున ఏం చేయాలి?
>> వామనుని అనుగ్రహం పొందడానికి వామన ద్వాదశి రోజున కంచు పాత్రలో నెయ్యి దీపం వెలిగించండి. దీంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి. 
>>  మీ వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కొబ్బరికాయపై యాగ్యోపవీతం చుట్టి వామనుడికి సమర్పించండి. మీ పనిలో ఏవైనా ఆటంకాలు ఉంటే ఇది తొలగిస్తుంది. 
>>  వామన ద్వాదశి పూజానంతరం అన్నం పెరుగు దానం చేయడం శుభప్రదం. ఇది ఇంట్లోకి అపారమైన సంపదను తీసుకువస్తుంది.
>>  వామన ద్వాదశి రోజున వామనుని విగ్రహాన్ని పూజించటం వల్ల  శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
>>  వామనుడిని పూజించేటప్పుడు  నైవేద్యంగా 52 లడ్డూలను పెట్టాలి. అందరికీ దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వామనుని అనుగ్రహం లభిస్తుంది. పూజానంతరం బ్రాహ్మణుడికి దానం చేయండి. దీంతో మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-