Skip to main content

కనుమ పండగ నాడు ఏం చేస్తారు

 కనుమ రోజున ఆవులుదూడలుఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు.

సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది.

కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి.

సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంతో ఉంటారు. ఆ రోజు సాయంకాలం పశువులకు పొంగలి నైవేద్యం పెడతారు.

పశువుల పాకలను ఈరోజు వ్యవసాయదారులు మాత్రమే శుభ్రం చేసి పశువులను కడుగుతారు. మిగతా రోజులలో వేరే వారు చేసినా ఈ రోజు ఆపని ఎవరికి వారే చేసుకుటాంరు. సాధారణంగా ఈరోజు రైతులు మాంసాహారం తప్పకుండా తింరు. తమ యజమాని మాంసాహారం తినేవారైతే అక్కడే భోజనం చేస్తారు. ఒకవేళ తమ యజమానులు శాఖాహారులైతే కనుక వారు ఇచ్చే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్ళి మాంసాహారం ఇంటిలో వండుకునే తినే సంప్రదాయం కూడా ఉన్నది.

ఈ రోజుననే పశువులకు పందేలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నది. ఇవి అన్నీ కూడా తాము ఇన్ని రోజుల నుంచి కష్టపడిన వాటికి ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయం, పశువులు ఏపుగా ఉండే సమయం కాబట్టి అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుటాంరు.

వ్యవసాయ దారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ సంవత్సరం పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఏర్పడింది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు ఉంచబడింది. అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైనదన్నమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండింపచేసే భగవంతుడికి పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీనిని జరుపుకుటాంరు.

ఈ సంక్రాంతి పండుగ పట్టణాలలో కంటే కూడా గ్రామాలలో ఎక్కువగా ఆనందంగా జరుపుకుటాంరు.

ఈరోజుతో సంక్రాంతి ఉత్సవాలు పూర్తి అవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాల సమయాన సంక్రాంతి రోజునుంచి ప్రతి ఒక్కరు వారి వారి స్థాయికి తగినంత నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉత్తరాయణం 6 నెలలు కూడా దైవారాధనకు  ధర్మ కార్యాక్రమాలను అనువైన సమయంగా భావించి వారి వారి కర్మదోషాలను తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి.

ఈ రోజున పెరుగుదానం చేయడం విశేషమైన ఫలితంగా భావిస్తారు. దానం చేయాలనే ఆలోచన రావడమే మంచిది. వచ్చిన ఆలోచనను అమలు చేయడం ఇంకా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లోనూ తప్పకుండా దానం చేయాలి. దానివలన అనంతమైన ఐశ్వర్యం లభిస్తుంది. 

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,