Skip to main content

నిర్జల ఏకాదశి తేదీ 17-6-2024 సోమవారం

 జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు. పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీముడి ఏకాదశి అని కూడా అంటారు.

నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు.

నిర్జల ఏకాదశి వ్రత కథ

పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు, తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కానీ నెలలో రెండు రోజుల కూడా తాను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడికి చెప్తాడు. స్వర్గాన్ని పొందడానికి మోక్షమార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేద వ్యాసుడిని అడిగాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం నుండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పారు. అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు. అందుకే ఈ ఏకాదశికి భీముని ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉంది.

నిర్జల ఏకాదశి పరిహారాలు

జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమః అదే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శ్రీహరి విష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతీతి.

జాతకంలోనే అన్ని లోపాలను తొలగించుకునేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడి కాయలు, పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.

నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు

నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకి పంజరి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. పంజరిలో తులసి ఆకులు ఉంచినది నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే పూజ సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-