Skip to main content

జ్యేష్టఅభిషేకం తేదీ 4-6-2023 ఆదివారం ప్రాముఖ్య త

 ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జరిగేదే ఈ ఉత్సవం.  

అంగాలు (నేత్రాలు, ముక్కు, చెవులు వంటివి), మహాంగాలు(శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి), ఉపాంగాలు  (కేశాలు, నఖం వంటివి), ప్రత్యాంగాలు (శంఖుచక్రాలు, మకుటం, పీఠం వంటివి) తరుగులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు క్రియాధికారంలో వివరించారు. ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభిషేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిదేయక అభిషేకం అని కూడా పిలుస్తారు.
చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధతైల సమర్పణం చేయాలని భృగువు వివరించారు. దీనివల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారని చెప్పారు. దీని ప్రకారమే  జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది. 
జ్యేష్ఠాభిషేకం ప్రారంభంనాడు యధావిధిగా సుప్రభాతం, నామార్చన, నైవేద్యం, ఉచ్ఛవ మూర్తి గర్భాలయం నుంచి  వేంకటరమణ కల్యాణమంటపానికి చేరుకుంటారు.. శతకలశప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు.
అనంతరం స్వామివారికి ఆర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణధారణ చేస్తారు. 
వేద పండితులు  శ్రీసూక్తం, పురుషసూక్తం, భూసూక్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలలో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుసు నీళ్లతో, శతకలశాల్లోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. చివర్లో స్వామి, అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు.
తర్వాత నవ కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చకస్వామి శిరస్సుపై చల్లుకుని భక్తులందరిపై పురోభవ అని చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకరణ, నివేదన జరుగుతాయి.
వివిధ సేవలు, ఉత్సవాలను జరిపించుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు ఎప్పుడూ కవచాన్ని ధరించి ఉంటారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే  కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే  నిజరూపంలో దర్శనమిస్తారు.
ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతో అభిషేకిస్తారు.భక్తులందరికి తీర్థం ప్రసాదం ఇస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మైత్రినగర్,మదీనగూడ, హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. 

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,