Skip to main content

ఆషాడ మాసం విశేషాలు

 పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో ఈ మాసాన్ని ఆషాఢం అని పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోని ప్రవేశించడంతో దక్షిణాయణం మొదలవుతుంది. ఈ మాసంలో వర్షాలు కురుస్తాయి. రోగాలు ప్రబలే కాలం కూడా కావడంతో ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ముఖ్యంగా పెళ్లి, నిశ్చితార్థ వేడుకలు, ఉపనయనం, గృహప్రవేశం వంటి వేడుకలు నిర్వహించరు. ఇక ఈ సంవత్సరం ఆషాఢ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూన్ 19న మొదలుకాబోతోంది. ఆషాఢమాస శుక్ల పక్షం జూన్ 19న మొదలై జూలై 3న ముగుస్తుంది. ఆషాఢ మాస బహుళ పక్షం జూలై 4 మొదలై జూలై 17న ముగుస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ మాసంలోనే భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్ల ఏకాదశి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. భక్తులు ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ మాసంలో పూరీ రథయాత్ర, కుసుమహర జయంతి, సికింద్రాబాద్ బోనాల జాతర, స్కంద షష్ఠి, ప్రదోష వ్రతం, సంకష్టహర చతుర్థి వంటి పండుగలను జరుపుకుంటారు.

Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?

ఇక ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలి అంటారు.. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత అంటే వేసవికాలంలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో పుట్టే శిశువు ఎండవేడిని తాళలేరని ఈ మాసంలో కొత్తగా పెళ్లైన జంటల్ని దూరం పెడతారు. ఇక ఆడవారు ఎంతో ఇష్టం గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవని మరీ ముఖ్యంగా గర్భాశయ, చర్మ సంబంధ రోగాలు రావని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే మహిళలు ఎంతో శ్రద్ధగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా ఈ మాసానికి ఇటువంటి విశిష్థతలు ఉన్నాయి

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-