Skip to main content

Posts

Showing posts from May, 2025

gruha pravesh pooja samagri

 పసుపు 200 గ్రాములు, turmeric powder కుంకుమ 100 గ్రాములు, kumkum శ్రీ గంధం 1 చిన్న డబ్బా, gandham  బియ్యం 4  కిలోలు,rice  ప్లాస్టిక్ కప్పులు 10, plastic cups తమల పాకులు, 100,betel leaves వక్కలు 45, betel nuts ఖర్జూరం పండ్లు 35, dates dry fruits బాదం పలుకులు 200 గ్రాములు,badaam nuts రాగి చెంబులు 2, copper kalash ఆచమన పాత్ర 1, glass,spoon,plate etc. కూచోవటానికి చాపలు,  mats  వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  loose flowers, and garlands అయిదు రకముల పండ్లు  five verities of fruits including banana dozan ఆవు పాలు లీటరు, cow milk one litre ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, curd  ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,  ghee for lamps etc. sugar 1/4 kilo మంచి తేనె సీసా 200 గ్రాములు,  honey  వత్తులు, , అగ్గిపెట్టె, wicks and match box దీపం చెమ్మెలు  2, మంగళ హారతి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి standing lamps and small lamps for haarathi  మామిడి కొమ్మలు, mango leaves నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )  nava dhaanya (nin...

శ్రీ వైష్ణవ దేవాలయ ప్రసాదా ల వివరాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.  తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు. అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్.  శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.  పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. . శ్రీ కృష్ణ  సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు.  త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది. శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబ...

జ్యేష్ట మాసం లో విశేషాలు

    జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను  దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.  జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం ఈ నెలలోని రోజులు ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవున్న దానిని సంస్కృతంలో జ్యేష్ఠ అని పిలుస్తారు. అందుకే ఈ నెలకు జ్యేష్ఠ మాసం అని పేరు పెట్టారు. ఈ మాసానికి అధిపతి కుజుడు. ఈ నెలలో జ్యేష్ఠ నక్షత్రం, పౌర్ణమి తిథి కలయిక ఉంటుంది, అందుకే దీనిని జ్యేష్ఠ మాసం అని పిలుస్తారు. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి....

సోమవతి అమావాస్య తేదీ 26-5-2025 సోమవారం

  అమావాస్య తిథి సోమవారం వచ్చినప్పుడు  దానిని సోమవతి అమావాస్య అంటారు. ఆ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున ఉపవాసం ఉండటమే కాకుండా, పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. హిందూ మతంలో, సోమవారం శివుడు, పార్వతి దేవికి అంకితం చేయబడింది.ఈ రోజున స్త్రీలు రావి చెట్టు లేదా మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే ఆలుమగలు అన్యోన్యముగా జీవిత కాలం ఉంటారని జ్యోతిష్య శాతరాలు చెబుతున్నాయి. 

ఉపనయనం పూజ సామగ్రి

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, ఆగర్బత్తులు 1 పెద్ద పాకెట్, కర్పూరం 1 పాకెట్  అరటిపండ్లు 4 డజనులు  తమల పాకులు 100  వక్కలు 150 గ్రాములు, రవిక గుడ్డలు 4, తుండు గుడ్డలు పెద్ద సైజ్  4, గౌరీదేవి పసుపు కొమ్ములు కిలో, కొబ్బరి బొండాలు 4,  సెంట్ పనీర్ గంధం 1 సీసా  దీపారాధన కుందులు + వత్తులు + అగ్గిపెట్టె  వరి పిండి 1/2 కిలో, చెక్క బొమ్మ 1, రావి చెట్టు పుల్లలు 20 చిన్న కట్టలు , ఆవు నెయ్యి 1/2 కిలో, ఆవాలు 1/4 కిలో, జీల కర్ర బెల్లం కొంచెం  jandiyamu -1  బియ్యం 20 kg జంత్రీకలు - 32, గుమ్మడి పండు - 1, పాళికలు -6 కడ ముంతలు - 3 mango leaves one stem,pupil tree leaves one stem  ప్రమి దలు - 4  పుట్ట మన్ను కొంచెం , ఆవు పాలు 1/2 లీటరు, పెరుగు కొంచెం. నవధాన్యములు - 100 గ్రాములు, కంకణ దారం రీలు 1, భటువు - 1  బిక్ష గిన్నె - 1, అప్పడాలు - 32, వడియాలు - 32, అరిశెలు 11, మూడు రకాల కూరగాయలు,  కంది పప్పు కిలో, మినప పప్పు కిలో  పెసర పప్పు కిలో, శనగ పప్పు కిలో, పంచె  + కండు వ  పంచ పాత్ర + ఉద్దరిణి, పట్టు వస్త్రాలు  చిల...

రామనుజాచార్యుల జయంతి 2-5-2025 శుక్రవారం

                                 // శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది మే 2వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు...