ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు.
అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్. శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి.బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. . శ్రీ కృష్ణ సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు. త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది.
శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక రాత్రి 7.30 నిమిషాలకు మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన ఆదివారం పిండిని స్వామివారికి సమర్పిస్తారు.
ఇక రాత్రి 7.30 నిమిషాలకు మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన ఆదివారం పిండిని స్వామివారికి సమర్పిస్తారు.
సోమవారం విశేష పూజ సందర్బంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వామివారికి నివేదిస్తారు. ఇక మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నివేదిస్తారు. ఈ మాత్ర ప్రసాదంతోపాటు రోజూ సమర్పించే ప్రసాదాలు కూడా ఉంటాయి. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరప్పును నివేదిస్తారు. ఇక గురువారం రోజూ సమర్పించే ప్రసాదాలతోపాటు తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబి, మురుకు, పాయసాలను నివేదిస్తారు. ఇక శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలను సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదికలో కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్యోజనం, మిర్యాలపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదిస్తారు.
Comments
Post a Comment