Skip to main content

శ్రీ వైష్ణవ దేవాలయ ప్రసాదా ల వివరాలు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.  తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు.

అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్.  శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.  పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. . శ్రీ కృష్ణ  సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు.  త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది.

శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు నివేదిస్తారు.  పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఇక రాత్రి 7.30 నిమిషాలకు మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన ఆదివారం పిండిని స్వామివారికి సమర్పిస్తారు.
 సోమవారం విశేష పూజ సందర్బంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వామివారికి నివేదిస్తారు. ఇక మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నివేదిస్తారు. ఈ మాత్ర ప్రసాదంతోపాటు రోజూ సమర్పించే ప్రసాదాలు కూడా ఉంటాయి. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరప్పును నివేదిస్తారు. ఇక గురువారం రోజూ సమర్పించే ప్రసాదాలతోపాటు తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబి, మురుకు, పాయసాలను నివేదిస్తారు. ఇక శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలను సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదికలో కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్యోజనం, మిర్యాలపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదిస్తారు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-