కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది.దీనికి ఓ కథ కూడా ఉంది ఆ కథ ఏమిటనగా .. సూర్య భగవానునకు సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది.ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమ ధర్మరాజు సోదరి యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురు చూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని తనను మన్నించమని 'కార్తీక శుధ్ద విదియ' నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది. అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు.యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో' అని అడిగాడు. ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు.అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది.ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పండుగను 'భయ్యా-దుజ్' అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను 'భాయి-టికా' అని పిలుస్తారు. పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను 'టిక్కా' అని పిలుస్తారు. అనగా రేపటి రోజున అక్క , చెల్లెలు చేతి వంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు. కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి కనుమరుగైన బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, తమల పాకులు 100 , వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 , టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, అరటి పండ్లు 2 డజన్ అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, ఆవు పంచితం, 100 ml కర్పూరం పాకెట్ మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8. రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1, దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి బిళ్ళలు 25 పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, గరిక కొంచెం 1 కట్
Comments
Post a Comment