Skip to main content

తిరుప్పాణ్ అల్వార్ తిరు నక్షత్రం తేదీ 28-11-2023 మంగళ వారం

 తిరుప్పాణ్ అల్వార్ లేదా తిరుపనాళ్వార్ హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు. అళ్వార్ల శ్లోకాలను నలైరా దివ్య ప్రబంధం గా సంకలనం చేశారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. 108 దేవాలయాలు వైష్ణవ దివ్య దేశాలుగా వర్గీకరించబడ్డాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. తిరుప్పాణాళ్వార్ పన్నెండు అళ్వార్ల క్రమంలో పదకొండవ వాడిగా పరిగణించబడతాడు.

హిందూ పురాణం ప్రకారం అతను పానార్ కులానికి చెందిన దంపతులకు జన్మించాడు. తిరుప్పాణాళ్వార్ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం లోని ప్రధాన దైవం రంగనాథస్వామికి అనుబంధంగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను ఆ దైవంలోనే ఐక్యం అయినట్లు నమ్ముతారు.తిరుప్పాణ్ ఆల్వార్ 8 లేదా 9 వ శతాబ్దంలో శ్రీరంగం సమీపంలోని అలగపురి అనే చిన్న గ్రామంలో రోహిణి నక్షత్రం లో బుధవారం పుర్తుర్మాది సంవత్సరంలో కార్తిగై (నవంబరు-డిసెంబరు) నెలలో జన్మించాడు. పానార్లు సంగీతకారులు, సాంప్రదాయ సంగీత పాటలు పాడే కులానికి చెందినవారు. వారు ప్రేక్షకులను పారవశ్యం, ఆనందం కలిగించే సంగీతాన్నందించే సామర్థ్యం కలిగి ఉండెవారు.అతను విష్ణు ఛాతీపై ఉన్న చిన్న గుర్తు యొక్కఅంశ (రూపం) అని నమ్ముతారు (పురాణాల ప్రకారం అందరు ఆళ్వార్లు విష్ణువు యొక్క కొంత భాగానికి అవతారాలు), దీనిని శ్రీమన్నారాయణుని ఛాతీపై శ్రీవత్సం అని పిలుస్తారు.

తిరుప్పాణాళ్వార్ యొక్క పది శ్లోకాలను అమలనాతిపిరన్ అని పిలుస్తారు. అతని రచనలు నాలాయిరం దివ్య ప్రబంధంలోని 4000 చరణాలలో పది శ్లోకాలు. తిరుప్పాణాళ్వార్ రచనలు వైష్ణవ మతం యొక్క తాత్విక, వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి.

దక్షిణ-భారత వైష్ణవ దేవాలయాలలో తిరుపనాళ్వార్ చిత్రాలు ఉంటాయి. అతనితో సంబంధం ఉన్న ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. తిరుపనాళ్వార్ అవతార ఉత్సవం శ్రీరంగంలో జరుపుతారు. వోరైయూర్‌లోని అఘగియా మనవాలా పెరుమాళ్ ఆలయంలో పది రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. తిరుప్పాణాళ్వార్, ఇతర అళ్వార్ర్‌ల శ్లోకాలు రోజువారీ ప్రార్థనలలో భాగంగా దక్షిణ భారతదేశంలోని చాలా విష్ణు దేవాలయాలలో పఠిస్తారు.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.