ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు. 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది.
దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం.
ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును పూజించండి. ఇప్పుడు పసుపు చందనం, పసుపు పువ్వులను స్వామికి సమర్పించండి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. నిర్జల ఏకాదశి ఉపవాస కథను చదివి రాత్రి దీప దానం చేసి.. విష్ణువుని పూజించి హారతి ఇవ్వండి.
Comments
Post a Comment