Skip to main content
DASARA  NAVARAATHRI సమస్త సృష్టిలో శక్తి ఉపాసనను మించింది లేదు. ఆ శక్తే- ఆది పరాశక్తి. ఆమె జగన్మూర్తి, బ్రహ్మ స్వరూపిణి, వేదవేద్య. ఆ దేవి సకల లోకాలకూ వందనీయగా విరాజిల్లుతోంది.
ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తికి ప్రతీకలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని పూజించే తొమ్మిది రోజులనూ ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శరదృతువులో వచ్చేవి కనుక, ఇవి శరన్నవరాత్రులుగా ప్రసిద్ధమయ్యాయి. దేవిని ఆరాధిస్తారు కాబట్టి, ‘దేవీ నవరాత్రులు’ అనీ వీటిని వ్యవహరిస్తారు. పరాశక్తికి మరో పేరు- శారద. ఆ తల్లిని అర్చించే రాత్రులు కావడంతో, వీటికి ‘శారద నవరాత్రులు’ అనే పేరూ ఉంది. నవరాత్రి ఉత్సవాలు సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి. చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేవి శరన్నవరాత్రులు. ఈ రెండు రుతువుల్లోనూ ఆదిశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. తొమ్మిది విధాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో తొమ్మిది రోజుల వ్రతదీక్ష చేపట్టిందని, ఆ శక్తి వల్ల కలిగిన అసమాన బలంతోనే పదో రోజున రాక్షసుల్ని మట్టుపెట్టిందని పురాణ కథనం.
అమ్మవారు మొదటి రోజున శైలపుత్రిగా, హైమవతిగా, పార్వతిగా పూజలందుకుంటుంది. ఒక చేతిలో కమలం, మరోచేత శూలం ధరించి దర్శనమిస్తుంది. రెండోరోజున బ్రహ్మచారిణి రూపంలో ఉంటుంది. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లుతుంది. మూడోరోజున ఆమె- సింహవాహిని. ధనుస్సు, గద, శూలం, ఖడ్గం, పాశం వంటి ఆయుధాలు ధరిస్తుంది. పది చేతుల రూపంలో ఉండే అమ్మవారిని జయం, ధైర్యం, వీరత్వం కోసం భక్తులు పూజిస్తారు.
చక్రం, గద, బాణం ఒకవైపు; కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించిన మాత నాలుగోరోజున దర్శనమిస్తుంది. ఎనిమిది భుజాలు కలిగిన ఆమెను ‘అష్ట భుజ దేవి’గా ఆరాధిస్తారు. ఆ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. సింహవాహినిగా ‘స్కంద మాత’ పేరిట అయిదో రోజున పూజిస్తూ, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ఆరో రూపం- కాత్యాయని. కాత్యాయనుడనే ముని ముందుగా పూజించడం వల్ల ఆమెకు ఆ పేరు వచ్చింది. త్రిమూర్తుల తేజంతో మహిషాసురుణ్ని సంహరించడానికి అవతరించిన రోజు అది!
అమ్మవారి ఏడో రూపం- దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. ఎనిమిదో రోజు రూపం- మహా గౌరి. ఆ రోజున ఆమె శ్వేత వస్త్రధారిణి. అభయ, వరద ముద్రలతో పాటు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. తొమ్మిదో రోజున ‘సిద్ధి ధాత్రి’ రూపం. సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. కమలాసని అయిన ఆ దేవి చతుర్భుజాల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉంటుంది. ఈ తొమ్మిది రూపాలకూ ‘నవదుర్గలు’ అని పేరు!
తిథుల హెచ్చుతగ్గుల వల్ల, ఒక్కోసారి పదమూడు రోజులు ఈ ఉత్సవాలు జరుపుతుంటారు. నవరాత్రుల్లో- దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ చేసే అమ్మవారిని సహస్రనామ స్తోత్రంతో, షోడశోపచార పూజలతో ఆరాధించడం తరతరాల సంప్రదాయంగా వస్తోంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో, పలు రీతుల్లో ఈ దసరా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. దేవి అర్చనలు, శమీ వృక్ష పూజలు, ఆయుధ పూజలు- సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖశాంతులను, విజయ పరంపరను ప్రసాదిస్తాయన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం!

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.