వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ (November) వరకు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో 108 హవన కుండలాలతో అష్టోత్తర శతనామ లక్ష్మీనారాయణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ కమిటీ భాగ్యనగర్ కన్వీనరు వరకుమార్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా శ్రీమత్ భాగవత కథా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కార్యస్థలి అయిన ఎగ్జిబిషన్ మైదానంలో త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామనుజ జీయర్ స్వామీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించారు. అనంతరం వరకుమార్గుప్తా మాట్లాడుతూ 6వ తేదీన బేగంబజార్ ఫీల్ఖానా నుంచి మహా శోభాయాత్ర ప్రారంభమై ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుంటుందని తెలిపారు. 7వ తేదీ యజ్ఞం, భాగవత కథ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భట్టడ్ స్వామి, పురుషోత్తం లాహోటీ, మేగరాజ్ అగర్వాల్, శశికాంత్, గోకుల్చంద్, అనిల్ మిశ్రా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.Purohiths wanted please call 9989324294 Rachakonda Rama charyulu.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment