Skip to main content
 వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ (November) వరకు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో 108 హవన కుండలాలతో అష్టోత్తర శతనామ లక్ష్మీనారాయణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ కమిటీ భాగ్యనగర్‌ కన్వీనరు వరకుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా శ్రీమత్‌ భాగవత కథా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కార్యస్థలి అయిన ఎగ్జిబిషన్‌ మైదానంలో త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామనుజ జీయర్‌ స్వామీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించారు. అనంతరం వరకుమార్‌గుప్తా మాట్లాడుతూ 6వ తేదీన బేగంబజార్‌ ఫీల్‌ఖానా నుంచి మహా శోభాయాత్ర ప్రారంభమై ఎగ్జిబిషన్‌ మైదానంకు చేరుకుంటుందని తెలిపారు. 7వ తేదీ యజ్ఞం, భాగవత కథ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భట్టడ్‌ స్వామి, పురుషోత్తం లాహోటీ, మేగరాజ్‌ అగర్వాల్‌, శశికాంత్‌, గోకుల్‌చంద్‌, అనిల్‌ మిశ్రా, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.Purohiths wanted please call 9989324294 Rachakonda Rama charyulu.

Comments