Skip to main content

మే నెల 4 న వరూధిని ఏకాదశి

వరూథిని ఏకాదశి ( మే 4) న ఏ పనులుచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.. ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందుల్లో బాధపడేవారు కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. 

వరుథిని ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు ఏమిటంటే..

అన్న వితరణ: వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా ఫలం లభిస్తుంది. అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది.దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు నెలవుగా ఉంటుంది. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి.

దాహార్తిని తీర్చడం: వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వారికి ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం.

నువ్వుల దానం: హిందూ మత విశ్వాసం ప్రకారం నువ్వులు శ్రీ హరి నుండి ఉద్భవించాయి. ఏకాదశి రోజున నల్ల నువ్వులను నీటిలో వదలడం వల్ల శ్రీ హరి, శనిస్వరుడు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. అదే సమయంలో ఈ రోజున నువ్వులతో చేసిన స్వీట్లను దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.

సత్తు పిండి దానం: సత్తు అంటే వేయించిన శనగల పొడ.. చైత్ర, వైశాఖ మాసంలో వేసవికాలం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి నాడు సత్తు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధనలాభం చేకూరుతుందని, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,