Skip to main content

శ్రీ మహాలక్ష్మి దేవి మధ్యవర్తిత్వము.

మామూలు పరిభాషలో ' పురుష ' అంటే మగవ్వాడు అని అర్థము వస్తుంది. కాని శ్రీ వైష్ణవ సాంప్రదాయములో పురు అంటే చాలా అని అర్థము. పురుష అంటే చాల ఇచ్చే వాడు అని అంటారు. ఆ చాల ఇచ్చే వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన దయగలవాడు కాబట్టి చాల ఇస్తాడు. లక్ష్మి దేవి అతనిచేత ఇప్పింప జేస్తుంది.ఆమె దయ లేకపోతే నారాయణుడు తనకు తానుగా ఇవ్వడు. ఒక పిల్లవాడు తనకు కావలసిన వస్తువును ముందుగా తన అమ్మదగ్గరికి వెళ్లి అడగగా ఆ తల్లి తన బర్తకు చెప్పి ఇప్పించినట్టు ఉంటుంది. తండ్రి కంటే తల్లి తో పిల్లవాడు చనువుగా ఉండటము వలన ముందుగ తల్లి తో చెప్పుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా తన బార్య అయిన లక్ష్మిదెవి చేబుతేనే భక్తునికి వరాలు ఇస్తాడు. కాకాసురుడు అనే రాక్షసుడు కాకి వేషములో వచ్చి సీతమ్మ చాతిని పొడుస్తూ ఉండగా రాముడు వెంటనే తన భాణము తో ఆ కాకి మీదకి విసరగా, కాకి రాక్షస రూపములోకి వచ్చి రాముని కాళ్ళ మీద పడతాడు. సీతమ్మ పక్కన ఉండి తన భర్త రాముని కోపాన్ని గ్రహించి చిన్న శిక్ష విధించి అతనిని రక్షించండి అని చెప్పడము వలన ఆ కాకాసురుడు బతికి భయట పడినాడు. కాని రావణా సురునిని మన్నించలేదు. ఎందుకని ? రాముని పక్కన సీతమ్మ లేదు కాబట్టి. ఆ రావణాసురుడు సీతమ్మను భగవంతునికి దూరము చేసినాడు కాబట్టి. రావణాసురిని మీద అమ్మవారికి దయ లేదు కాబట్టి. అమ్మవారి దయ ఎంత ముఖ్యమో నమ్మాల్వారుల పాశురము చెబుతున్నది. అమ్మవారు భగవంతుని హృదయము మీద శాశ్వతముగా తన నివాసము ఏర్పాటు చేసుకున్నది. ఆ శాశ్వత నివాసమునుండి విడిపోకుండా ప్రమాణము చేసుకొని ఉన్నది. ఒక సారి ప్రమాణము చేసినాక తన శాశ్వత నివాసము గురించి పదే పదే చెప్పవలసిన పని ఏమున్నది ? ఇక్కడ అమ్మవారు ఒక చిన్న పిల్ల. ఒక పిల్ల తన ఆట వస్తువును ఎలాగ అయితే ఒదులు కోలేదో ఎప్పుడు కూడా ఆ అట వస్తువు నాది నాది అని అంటూ వుంటుందో , అలాగే అమ్మవారు గూడ తన నిత్య నివాసము గురించి పదే పదే చెప్పనవసరము లేదు అని అర్థము.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,