మామూలు పరిభాషలో ' పురుష ' అంటే మగవ్వాడు అని అర్థము వస్తుంది. కాని శ్రీ వైష్ణవ సాంప్రదాయములో పురు అంటే చాలా అని అర్థము. పురుష అంటే చాల ఇచ్చే వాడు అని అంటారు. ఆ చాల ఇచ్చే వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన దయగలవాడు కాబట్టి చాల ఇస్తాడు. లక్ష్మి దేవి అతనిచేత ఇప్పింప జేస్తుంది.ఆమె దయ లేకపోతే నారాయణుడు తనకు తానుగా ఇవ్వడు.
ఒక పిల్లవాడు తనకు కావలసిన వస్తువును ముందుగా తన అమ్మదగ్గరికి వెళ్లి అడగగా ఆ తల్లి తన బర్తకు చెప్పి ఇప్పించినట్టు ఉంటుంది. తండ్రి కంటే తల్లి తో పిల్లవాడు చనువుగా ఉండటము వలన ముందుగ తల్లి తో చెప్పుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా తన బార్య అయిన లక్ష్మిదెవి చేబుతేనే భక్తునికి వరాలు ఇస్తాడు.
కాకాసురుడు అనే రాక్షసుడు కాకి వేషములో వచ్చి సీతమ్మ చాతిని పొడుస్తూ ఉండగా రాముడు వెంటనే తన భాణము తో ఆ కాకి మీదకి విసరగా, కాకి రాక్షస రూపములోకి వచ్చి రాముని కాళ్ళ మీద పడతాడు. సీతమ్మ పక్కన ఉండి తన భర్త రాముని కోపాన్ని గ్రహించి చిన్న శిక్ష విధించి అతనిని రక్షించండి అని చెప్పడము వలన ఆ కాకాసురుడు బతికి భయట పడినాడు. కాని రావణా సురునిని మన్నించలేదు. ఎందుకని ? రాముని పక్కన సీతమ్మ లేదు కాబట్టి. ఆ రావణాసురుడు సీతమ్మను భగవంతునికి దూరము చేసినాడు కాబట్టి. రావణాసురిని మీద అమ్మవారికి దయ లేదు కాబట్టి.
అమ్మవారి దయ ఎంత ముఖ్యమో నమ్మాల్వారుల పాశురము చెబుతున్నది. అమ్మవారు భగవంతుని హృదయము మీద శాశ్వతముగా తన నివాసము ఏర్పాటు చేసుకున్నది. ఆ శాశ్వత నివాసమునుండి విడిపోకుండా ప్రమాణము చేసుకొని ఉన్నది. ఒక సారి ప్రమాణము చేసినాక తన శాశ్వత నివాసము గురించి పదే పదే చెప్పవలసిన పని ఏమున్నది ? ఇక్కడ అమ్మవారు ఒక చిన్న పిల్ల. ఒక పిల్ల తన ఆట వస్తువును ఎలాగ అయితే ఒదులు కోలేదో ఎప్పుడు కూడా ఆ అట వస్తువు నాది నాది అని అంటూ వుంటుందో , అలాగే అమ్మవారు గూడ తన నిత్య నివాసము గురించి పదే పదే చెప్పనవసరము లేదు అని అర్థము.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment